MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Business
  • సముద్ర గర్భంలో రైలు పరుగు.. భారత్ లోనే తొలిసారి.. ఈ బుల్లెట్ పరుగు ఎక్కడో తెలుసా?

సముద్ర గర్భంలో రైలు పరుగు.. భారత్ లోనే తొలిసారి.. ఈ బుల్లెట్ పరుగు ఎక్కడో తెలుసా?

India's first undersea train tunnel: త్వరలో సముద్ర గర్భంలో ప్రయాణించవచ్చు. అది కూడా రైలులో..  అది కూడా మ‌న భార‌త్ లోనే.. వావ్ అద్భుతంగా ఉంది కదా ఈ ప్రయాణం గురించి ఆలోచిస్తుంటే.. ! అద్భుత నిర్మాణం మ‌రిన్ని విష‌యాలు మీకోసం..  

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Aug 12 2024, 11:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
under sea train tunnel, under sea train

under sea train tunnel, under sea train

India's first undersea train tunnel: అవును భారతదేశంలో మొట్టమొదటిసారిగా సముద్రగర్భ రైలు సొరంగం నిర్మిస్తున్నారు. అరేబియా సముద్రం కింద 7 కిలో మీట‌ర్ల పొడవున రైలు సొరంగాన్ని నిర్మించనున్నారు. ఈ సొరంగం లోపల గాలి వేగంతో రైలు నడుస్తుంది. అయితే, ఈ పని అంత సులభం కాదు. ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
train 11

train 11

భారతీయ రైల్వేలు కాలక్రమేణా పురోగమిస్తున్నాయి. రాజధాని, శతాబ్ది, లాంగ్ డ్రైవ్ రైలు త‌ర్వాత అత్యాధునిక సాంకేతిక‌త‌తో కూడాన‌ వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. కోల్‌కతాలో నది కింద మెట్రో పరుగులు తీయడం ప్రారంభించింది. భారతదేశం సముద్రగర్భంలో బుల్లెట్ రైలు టన్నెల్ ను నిర్మిస్తోంది.  దేశంలో త్వరలో బుల్లెట్ రైళ్లు ప్రారంభం కానున్నాయి. ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2026 నాటికి బుల్లెట్ రైలు పరుగులు తీస్తుందని స‌మాచారం. ఇందుకోసం బుల్లెట్ ట్రైన్ కారిడార్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అహ్మదాబాద్-ముంబై మధ్య నడిచే బుల్లెట్ రైలు 508 కిలోమీటర్ల ప్రయాణం భూమిపై నుంచి మాత్ర‌మే కాదు స‌ముద్ర గ‌ర్భం నుంచి కూడా ఉండ‌నుంది. దాని మార్గంలో సొరంగాలు, సముద్రం భాగం నుంచి వెళ్ల‌నుంది. 

36
Modi Bullet Train

Modi Bullet Train

అహ్మదాబాద్-ముంబై మధ్య నిర్మిస్తున్న బుల్లెట్ రైలు కారిడార్‌లో 21 కిలోమీటర్ల భాగం భూగర్భంలో ఉంటుంది. విశేషమేమిటంటే ఈ కారిడార్ కోసం సముద్రం కింద టన్నెల్ నిర్మిస్తున్నారు. బుల్లెట్ రైలు కోసం అరేబియా సముద్రంలో సొరంగాన్ని నిర్మిస్తున్నారు. సముద్రం కింద 7 కిలో మీట‌ర్ల పొడవైన సొరంగాన్ని సిద్ధం చేస్తున్నారు. 

46
bullet train

bullet train

దేశంలోనే మొదటి సముద్రగర్భ రైల్వే సొరంగం ఇది. అరేబియా సముద్రం కింద బుల్లెట్ రైలు కోసం నిర్మిస్తున్న ఈ నీటి అడుగున సొరంగం 7 కిలోమీటర్ల పొడవు, 25 నుండి 65 మీటర్ల లోతు ఉంటుంది. ఈ సొరంగం భారతదేశపు మొదటి సముద్రగర్భ రైల్వే సొరంగం. సముద్రం కింద సొరంగం నిర్మించడం అంత సులభం కాదు. ఇందుకోసం అధునాతన సాంకేతికతను వినియోగిస్తున్నారు. ప్రత్యేక యంత్రాల సాయంతో సముద్రగర్భంలో టన్నెల్‌ను నిర్మించనున్నారు. 

56

సముద్రగర్భంలో టన్నెల్ నిర్మించేందుకు ఎండ్వాస్ యంత్రాలను అమర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీని కోసం ఘన్సోలీ, శిల్పాటా, విక్రోలిలో తవ్వకాలు జరుగుతున్నాయి. ఎకనామిక్స్ టైమ్ తన నివేదికలో మూలాలను ఉటంకిస్తూ ఈ ఏడాది చివరి నాటికి బుల్లెట్ రైలు సముద్రగర్భ సొరంగం కోసం మొదటి టన్నెల్ బోరింగ్ మెషిన్ (TBM) పనులు ప్రారంభమవుతాయని పేర్కొంది. సొరంగం త్రవ్వటానికి 13.1 మీటర్ల వ్యాసం కలిగిన కట్టర్ హెడ్‌తో అమర్చబడిన టన్నెల్ బోరింగ్ మెషిన్ ఉపయోగించబడుతుంది. కొత్త ఆస్ట్రియన్ టన్నెలింగ్ పద్ధతి ద్వారా తవ్వకం జరుగుతుంది. 

 

66

సముద్రం అడుగున 7 కిలోమీటర్ల మేర సముద్రగర్భంలో సొరంగం నిర్మించడం సవాలుతో కూడుకున్నది. ఈ మార్గంలో డబుల్ లైన్‌తో సింగిల్ ట్యూబ్ టన్నెల్ నిర్మించనున్నారు, ఇందులో బుల్లెట్ రైళ్ల కదలిక కోసం రెండు ట్రాక్‌లను ఏర్పాటు చేస్తారు. ఈ సొరంగంలో బుల్లెట్ రైలు వేగం గంటకు 320 కిలోమీటర్లు ఉంటుంది. భారత్‌లో సముద్రగర్భంలో టన్నెల్‌ను నిర్మించడం ఇదే తొలిసారి. సొరంగం నిర్మించేందుకు ఘన్సోలీ, శిల్పాటా, విక్రోలిలో తవ్వకాలు జరుపుతున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Hike: పసిడి ప్రియులకు భారీ షార్.. రూ.2లక్షలకు చేరువలో తులం బంగారం
Recommended image2
Worlds Cheapest House: ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఇల్లు.. కేవలం 1 డాలర్‌ మాత్రమే !
Recommended image3
మీ పిల్ల‌లు కూడా గుడ్డులో తెల్ల‌ది తిని, ప‌చ్చ‌ది ప‌డేస్తున్నారా.? ఈ గ్యాడ్జెట్ ఉంటే అలా కుదరదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved