Ola: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేందుకు ఇదే సరైన సమయం.. ఏకంగా రూ. 27 వేల డిస్కౌంట్.
ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా నడుస్తోంది. ప్రభుత్వాలు సబ్సిడీలు అందించడం, పెట్రోల్ ధరలు పెరిగిన నేపథ్యంలో చాలా మంది ఈవీ వాహనాలకు మొగ్గు చూపుతున్నారు. ఇక ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు సైతం కస్టమర్లను ఆకర్షించేందుకు డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ స్కూటర్ తయారీ సంస్థ ఓలా కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది.

ప్రముఖ విద్యుత్ స్కూటర్ల తయారీ కంపెనీ ఓలా కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త తెలిపింది. హోలీ సందర్భంగా ప్రత్యేక సేల్ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఎస్1 రేంజ్ స్కూటర్లపై భారీగా డిస్కౌంట్ను అందిస్తోది. అయితే ఈ అవకాశం కేవలం 5 రోజులు మాత్రమే అందుబాటులో ఉండనుంది. మార్చి 13వ తేదీన మొదలయ్యే ఈ సేల్ మార్చి 17వ తేదీ వరకు అందుబాటులో ఉండనుంది.

ఈ సేల్లో భాగంగా ఓలా ఎస్ ఎయిర్ స్కూటీపై ఏకంగా రూ. 26,750 డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో ఈ స్కూటీని రూ. 89,999కి సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది. అలాగే ఓలా ఎక్స్+ జెన్2 స్కూటర్పై రూ. 22 వేల డిస్కౌంట్ అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం ఈ స్కూటీ ధర రూ.82,999 నుంచి ప్రారంభం అవుతుంది. ఎస్1 రేంజ్లోని మిగతా స్కూటీలపై రూ.25 వేల వరకు తగ్గింపు ఉంటుంది.
ఇదిలా ఉంటే ఓలా ఇటీవల మార్కెట్లోకి తీసుకొచ్చిన ఎస్1 జెన్3 రేంజ్పై ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. కేవలం డిస్కౌంట్ు మాత్రమే పరిమితం కాకుండా అదనంగా మరో రూ.10,500 విలువైన ప్రయోజనాలను ఓలా ఎలక్ట్రిక్ అందిస్తోంది. కొత్తగా ఎస్1 జెన్2 స్కూటర్ కొనుగోలు చేసేవారికి ఏడాది పాటు రూ.2,999 విలువైన మూవ్ ఓఎస్+ సబ్స్క్రిప్షన్ని ఉచితంగా అందిస్తోంది. రూ.14,999 విలువైన ఎక్స్టెండెడ్ వారెంటీని రూ.7,499కే ఇస్తోంది.
సేల్స్ తగ్గిన నేపథ్యంలోనే:
ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల క్రితం ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో దూసుకెళ్లిన ఓలా ఇటీవలి కాలంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. గత నెలలో ఓలా మొత్తం 8,647 యూనిట్లను విక్రయించింది. అయితే బజాజ్, టీవీఎస్, ఏథర్ వంటివి భారీగా అమ్మకాలను చేపట్టాయి. దీంతో ఇతర కంపెనీల నుంచి వస్తున్న పోటీని తట్టుకోవడానికి ఓలా కంపెనీ తీవ్రంగా కష్టపడుతుంది. ఇందులో భాగంగానే సేల్స్ పెంచుకోవాలనే ఉద్దేశంతో ఓలా ఈ ఆఫర్లను ప్రకటించినట్లు అర్థమవుతోంది. ఎలాగైనా సేల్స్ విషయంలో మళ్లీ మొదటి స్థానానికి చేరుకోవాలని ఓలా గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది.