MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • వైకుంఠ ఏకాదశి రోజు అన్నం తినకూడదా? దీని వెనకాల ఉన్న కథేంటంటే..

వైకుంఠ ఏకాదశి రోజు అన్నం తినకూడదా? దీని వెనకాల ఉన్న కథేంటంటే..

హిందువులకు వైకుంఠ ఏకాదశి ఎంతో ప్రాముఖ్యమైందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహా విష్ణువుకు ఎంతో ప్రీతికరమని పురాణాలు చెబుతుంటాయి. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి విష్ణు మూర్తిని దర్శించుకుంటే ఎంతో పుణ్యం దక్కుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు. ఇక వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలని పండితులు చెబుతుంటారు. దీని వెనకాల ఉన్న అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..  

2 Min read
Narender Vaitla
Published : Jan 09 2025, 11:33 AM IST| Updated : Jan 09 2025, 11:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి స్వామి వారిని దర్శనం చేసుకోవడం కోసం భక్తులు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఇలా ఉత్తర ద్వారం నుంచి స్వామి వారిని దర్శించుకున్నవారికి పునర్జన్మ ఉండదని, మోక్షం లభిస్తుందని పండితులు చెబుతుంటారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా జనవరి 10వ తేదీన వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు భక్తులంతా సిద్ధమవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. 

24

మార్గశిర మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి/ ముక్కోటి ఏకాదశిగా పిలుస్తుంటారు. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశిగా చెబుతుంటారు. ఈ రోజున స్వామి వారిని దర్శించుకుంటే సకాల పాపాలు తొలగిపోయి, కోరికలన్నీ నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. రాత్రి సమయం అయిన దక్షిణాయనం పూర్తిచేసుకుని దేవతలకు పగటి సమయం అయిన ఉత్తరాయణం ప్రారంభం అవుతోంది. ఈ సందర్భంగా నిద్రనుంచి మేల్కొనే శ్రీమన్నారాయణుడిని ఉత్తరద్వారనుంచి వెళ్లి దర్శనం చేసుకుంటారు. 

34

వైకుంఠ ఏకాదశి రోజున చాలా మంది ఉపవాసంతో ఉంటారు. ఈ రోజు అస్సలు అన్నం అస్సలు తినకూడదని పండితులు చెబుతుంటారు. దీనివెనకాల ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. దీని ప్రకారం మధుకైటవులు అనే రాక్షసులకు ముక్తిని ప్రసాదించి వారికి ఉత్తరద్వార దర్శనం  కల్పించింది ఈరోజే. ఇదే రోజు మురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. ఆ మురాసరుడు నివశించే ప్రదేశం అన్నం..అందుకే ఈ  వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం చేయాలని, అన్నం అస్సలు తినకూడదని పండితులు చెబుతుంటారు. 

44

ఈరోజున పాలు, పండ్లను తీసుకుంటూ ఉండాలి. రోజంతా భగవంతుడి ధ్యానంలో ఉంటూ, సంధ్యాసమయంలో పూజ పూర్తిచేసి రాత్రంతా జాగరణ చేస్తారు. అన్నపానీయాలకు దూరంగా ఉండాలని పండితులు సూచిస్తంటారు. వైకుంఠ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామాన్ని పఠించినా, విన్నా పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతుంటారు. ఉపవాస నియమాల ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజున బ్రహ్మచర్యం పాటించాలి. ఏకాదశి ముందు రాత్రి నేలపై నిద్రించాలి. ఏకాదశి రోజున ఎవరినీ దూషించవద్దు, మంచి ఆలోచనలనతో ఉండాలని పండిలు చెబుతుంటారు. 
 

About the Author

NV
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved