Solar Eclipse:ఈ ఏడాది మొదటి సూర్య గ్రహణం.. ఈ రాశుల అదృష్టం రెట్టింపు ..!
Solar Eclipse: 2026లో తొలి సూర్య గ్రహణం ఫిబ్రవరి 17( మంగళవారం నాడు) న ఏర్పడనుంది. ఈ గ్రహణం కుంభ రాశిలో శతభిష నక్షత్రంలో సంభవిస్తుంది. ఈ గ్రహణ ప్రభావం కొన్ని రాశుల వారికి అదృష్టంగా మారనుంది. ఆ రాశులేంటో చూద్దాం..

సూర్య గ్రహణం వల్ల లాభపడే రాశులు..
1.మేష రాశి...
ఈ సూర్య గ్రహణం మేష రాశివారికి ఆకస్మిక ధనలాభాన్ని తెచ్చి పెట్టే అవకాశం ఉంది. ఈ గ్రహణ ప్రభావంతో ఈ రాశివారికి గతంలో ఆగిపోయిన పనులు వేగంగా పూర్తి అవుతాయి. ఉద్యోగస్థులకు ప్రమోషన్ లేదా జీతం పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.పెట్టుబడుల నుంచి మంచి లాభాలు పొందుతారు. సామాజికంగా గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి.
2.మిథున రాశి...
మిథున రాశివారికి ఈ గ్రహణం ఒక వరం లాంటిది. ఈ గ్రహణ ప్రభావంతో కఠినమైన సమస్యలను కూడా చాలా సులభంగా పరిష్కరించగలరు. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త భాగస్వామ్యాలు లభిస్తాయి. ఈ సమయంలో అదృష్టం పెరుగుతుంది. ఏ పని చేసినా ఈ రాశివారికి చాలా అనుకూలంగా మారిపోతుంది.
3.సింహ రాశి...
సింహ రాశికి అధిపతి సూర్యుడు. గ్రహణం తర్వాత మీ జాతకంలో కొత్త వెలుగులు నిండుతాయి. ఈ గ్రహణ ప్రభావం కారణంగా.. వృత్తిపరంగా అద్భుతమైన మార్పులు చూస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్థలు తొలగిపోయి.. బంధం బలపడుతుంది. రాజకీయ, ప్రభుత్వ రంగాల్లో ఉన్నవారికి కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.
4.తుల రాశి...
గ్రహణ ప్రభావం తుల రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశివారికి ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. గ్రహణ ప్రభావంతో.. కొత్త ఆదాయ మార్గాలు వెతుక్కుంటూ వస్తాయి. మీరు తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి.
పాత బాకీలు వసూలై ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కుతారు.
ఈ రాశులవారు జాగ్రత్తగా ఉండాల్సిందే..
ఈ గ్రహణం కుంభ రాశిలో జరుగుతోంది కాబట్టి కుంభం, వృశ్చికం , మకర రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలోనూ, వాహనం నడిపేటప్పుడు అప్రమత్తత అవసరం.
అదృష్టం పెరగడానికి చేయాల్సిన పరిహారాలు:
గ్రహణ సమయంలో , గ్రహణం తర్వాత ఈ పనులు చేయడం వల్ల దోషాలు తొలగి అదృష్టం పెరుగుతుంది:
గ్రహణ సమయంలో 'ఆదిత్య హృదయం' లేదా 'సూర్యాష్టకం' పఠించడం.
గ్రహణం ముగిసిన తర్వాత పవిత్ర నదీ స్నానం లేదా ఇంట్లోనే గంగాజలంతో స్నానం చేయడం.
పేదలకు గోధుమలు, బెల్లం లేదా ఎరుపు రంగు వస్త్రాలను దానం చేయడం.
'ఓం నమో భగవతే వాసుదేవాయ' అనే మంత్రాన్ని జపించడం.

