MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Lord Rama: రాముడు తన చేతులతో ప్రతిష్టించిన శివలింగం ఎక్కడ ఉంది? జీవితంలో ఒక్కసారి అయినా చూడాల్సిందే

Lord Rama: రాముడు తన చేతులతో ప్రతిష్టించిన శివలింగం ఎక్కడ ఉంది? జీవితంలో ఒక్కసారి అయినా చూడాల్సిందే

రాముడు జీవితం హిందూ భక్తులకు పరమవేదం. రాముడు ఆ శివుడిని పూజించాడని అంటారు. అంతేకాదు తన చేతులతోనే ఆయన శివలింగాన్ని ప్రతిష్టించాడని చెబుతారు. ఆ శివలింగమే ఇప్పుడు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామేశ్వరంగా మారింది.

1 Min read
Haritha Chappa
Published : Sep 15 2025, 11:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రాముడు ప్రతిష్టించిన శివలింగం
Image Credit : Asianet News

రాముడు ప్రతిష్టించిన శివలింగం

భారతీయ ప్రజలకు రాముడు ఆరాధ్య దేవుడు. అతడి జీవితం, అతని గుణగణాలు, లక్షణాలు, వ్యక్తిత్వం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. రాముడు తన చేతులతోనే ఒకచోట శివలింగాన్ని ప్రతిష్టించాడని చెప్పుకుంటారు. అది ఎక్కడుందో మీకు తెలుసా? రామేశ్వరంలో తమిళనాడులోని ఒక పవిత్ర ద్వీపం అది. అక్కడే రాముడు శివలింగాన్ని ప్రతిష్టించాడు. ఇప్పుడు రామేశ్వరంగా ఆ ప్రాంతం ప్రసిద్ధ జ్యోతిర్లింగంగా మారింది.

25
రాముడు లంకను చేరేందుకు
Image Credit : Asianet News

రాముడు లంకను చేరేందుకు

రామాయణ మహాకావ్యంలో లంకా యుద్ధానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. రాముడు లంకను చేరాలంటే సముద్రాన్ని దాటాలి. అందుకు వంతెన కట్టింది రామేశ్వరం దగ్గరే. దాన్ని రామసేతు అని పిలుస్తారు. భారతదేశంలోని రామేశ్వరం ద్వీపం.. శ్రీలంకలోని మన్నార్ ద్వీపం మధ్య ఈ రామసేతు కనిపిస్తుంది.

Related Articles

Related image1
Lord Shani: రెండేళ్ల వరకు శని దేవుని ఆశీస్సులు నిండుగా ఉండే ఐదు రాశులు ఇదిగో, వీరికి తిరుగే ఉండదు
Related image2
Budha Shukra Transit: సెప్టెంబర్లో రెండు చేతులతో డబ్బు సంపాదించే నాలుగు రాశులు ఇవే, అంతా శుక్రుడు బుధుడు ఎఫెక్ట్
35
వానర సైన్యంతో
Image Credit : Asianet News

వానర సైన్యంతో

సీతను కాపాడేందుకు వానర సైన్యంతో సముద్రాన్ని దాటి రాముడు లంకకు చేరుకోవాలి. అందుకే రాముడు ఆ శివుడు ఆశీస్సులను కోరుకున్నాడు. ఇందుకోసం శివుడిని ప్రార్థించి శివలింగాన్ని అక్కడ ప్రతిష్టించాడు. అదే జ్యోతిర్లింగంగా మారింది. రాముడు ఈశ్వరుడు కలిపి రామేశ్వరంగా మారింది. రామేశ్వరాన్ని జీవితంలో ఒక్కసారి అయినా కనులారా చూడాలని ఎంతోమంది భక్తులు మనస్ఫూర్తిగా కోరుకుంటారు.

45
రామసేతు
Image Credit : Asianet News

రామసేతు

రాముడి వంతెన లేదా రామసేతును ఆడమ్స్ బ్రిడ్స్ అని కూడా పిలుస్తారు. దీనిని చూసేందుకే ఎంతోమంది ప్రజలు ఇక్కడికి వస్తారు. రామేశ్వరం అనేది చెన్నై నుంచి 572 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ నుంచి సముద్రమార్గం ద్వారా శ్రీలంకను చేరుకోవచ్చు.

55
రామనాథ స్వామి ఆలయం
Image Credit : Asianet News

రామనాథ స్వామి ఆలయం

రామేశ్వరం లో ఉన్న రామనాథ స్వామి ఆలయం కచ్చితంగా చూడాల్సిన ప్రదేశాలలో ఒకటి. మన దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలలో శివుడికి అంకితం చేసిన అద్భుతమైన జ్యోతిర్లింగం ఇక్కడ ఉంది. శ్రీరాముడి భక్తులు, ఈశ్వరుడి భక్తులు కూడా ఇక్కడికి తండోపతండాలుగా వస్తారు. వీలైతే జీవితంలో ఒక్కసారి అయినా ఈ రామేశ్వరాన్ని చూసి తరించండి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved