జగన్ నవరత్నాలకు ఆంధ్ర ప్రజల ఓటు
వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసివచ్చిన ప్రధాన అంశాలు నవరత్నాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ప్రకటించిన నవరత్నాలు పథకాలు ప్రజల్లోకి చొచ్చుకుపోయాయి. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో ప్రతీ గడపగడపకు నవరత్నాల పథకాలను తీసుకెళ్లారు.
వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసివచ్చిన ప్రధాన అంశాలు నవరత్నాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ప్రకటించిన నవరత్నాలు పథకాలు ప్రజల్లోకి చొచ్చుకుపోయాయి. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో ప్రతీ గడపగడపకు నవరత్నాల పథకాలను తీసుకెళ్లారు.
అలాగే ఎన్నికల ప్రచారంలో కూడా ఈ నవరత్నాల పథకాల వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. వైయస్ఆర్ రైతు భరోసా పథకం కింద ఏడాదికి రూ.12,500చొప్పున ప్రతీ రైతు అకౌంట్లో వేస్తానని జగన్ రైతులకు హామీ ఇచ్చారు.
వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కూడా ప్రజలను వైసీకి మరింత దగ్గర చేర్చింది. రూ.లక్ష నుంచి రూ.10 లక్షలు వరకు లబ్ధి చేకూరేలా వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ వర్తించేలా చేస్తానని జగన్ హామీ ఇచ్చారు.
అలాగే ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాకుడా తెలగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేసేలా చేస్తానని హామీ ఇవ్వడంతో పేదప్రజలు ఏకధాటిగా వైసీపీకి ఓట్లు వేశారు. అమ్మఒడి పథకం కింద ప్రతీ కుటుంబానికి ఏడాదికి రూ.15,000 లబ్ధి చేకూర్చడం వంటి పథకాలు మహిళలను వైసీపీకి మరింత దగ్గర చేశాయి.
వైయస్ఆర్ చేయూత పథకం కింద ప్రతీ కుటుంబానికి ఏడాదికి రూ.75వేలు వచ్చేలా వారికి భరోసా కల్పించడం పింఛన్లు పెంపు అర్హులైన ప్రతీ ఒక్కరికి పింఛన్ వచ్చేలా చెయ్యడంతోపాటు పింఛన్ ను రూ.2000 నుంచి మూడు వేల రూపాయల వరకు పెంచుకుంటూ పోవడం వంటి అంశాలు వైసీపీ విజయానికి దోహదం చేశాయి.
వీటితోపాటు ఆనాడు వైఎస్ఆర్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకంపై కూడా వైఎస్ జగన్ కీలక హామీ ఇచ్చారు. ఉన్నత చదువులు చదివే విద్యార్థికి లక్ష నుంచి లక్షా 50 వేల రూపాయల వరకు ఫీజు రీయింబర్స్ మెంట్ వచ్చేలా చేస్తానని హామీ ఇవ్వడంతో పట్టభద్రులు వైసీపీ వైపు మెుగ్గు చూపారు.
ఇళ్లులేని నిరుపేదలకు రూ.2లక్షల నుంచి రూ..500000 వరకు ఖర్చుపెట్టి ఇళ్లు నిర్మిస్తానని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా రూ. 50 వేల రూపాయలు ఉపాధి కల్పించడం, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడంతోపాటు గ్రామ సచివాలయాల్లో 1.60 లక్షలు ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇవ్వడంతో నిరుద్యోగులు సైతం వైసీపీకి పట్టం కట్టారు.
గతంలో వైఎస్ఆర్ రైతన్న రాజ్యం కోసం జలయజ్ఞం పథకాన్ని చేపట్టారో అదే రీతిలో వైయస్ఆర్ జలయజ్ఞంం పథకాన్ని కూడా అమలు చేస్తానని జగన్ హామీ ఇవ్వడం ఈ పథకాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు దోహదం చేశాయి.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీ పసుపు-కుంకుమ పథకాన్ని అమలు చేసి మహిళల అకౌంట్లో నగదు వేసినా, వృద్ధాప్య పింఛన్ పెంచినా, నిరుద్యోగ భృతి వెయ్యి అంటూ వెయ్యి నుంచి రూ.2000 వరకు పెంచినా ప్రజలు మాత్రం నమ్మలేదు. వాటిని కేవలం ఎన్నికల జిమ్మిక్కులుగానే చూశారు. కానీ వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలకు మాత్రం ప్రజల జేజేలు కొట్టారనడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనం.