పాదయాత్ర సెంటిమెంట్ పండింది: వైఎస్, చంద్రబాబుల మీదుగా జగన్
అమరావతి: తెలుగురాష్ట్రాల్లో పాదయాత్ర ఒక సెంటిమెంట్ గా మారింది. పవర్ దక్కాలంటే పాదయాత్రలు చేయాల్సిందేనన్న నానుడిని నిజం చేస్తూ వస్తున్నాయి ప్రస్తుత రాజకీయాలు. గత అనుభవాలను పరిగణలోకి తీసుకుంటే పాదయాత్రలు పవర్ ను కట్టబెడుతున్నాయి అనడానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
అమరావతి: తెలుగురాష్ట్రాల్లో పాదయాత్ర ఒక సెంటిమెంట్ గా మారింది. పవర్ దక్కాలంటే పాదయాత్రలు చేయాల్సిందేనన్న నానుడిని నిజం చేస్తూ వస్తున్నాయి ప్రస్తుత రాజకీయాలు. గత అనుభవాలను పరిగణలోకి తీసుకుంటే పాదయాత్రలు పవర్ ను కట్టబెడుతున్నాయి అనడానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరాజకీయాలు అందుకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. పాదయాత్ర చేసిన వారు ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావడం ఖచ్చితంగా జరుగుతూ వస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రూఫ్ చేస్తున్నాయి కూడా.
తెలుగురాష్ట్రాల్లో తొలిసారిగా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు ఉండేది. ఆ ఆధిపత్య పోరులో తాను ఏంటో నిరూపించుకునేందుకు అలాగే ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.
ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వై.ఎస్ రాజశేఖరరెడ్డి 2003 ఏప్రిల్ 9న రంగారెడ్డి జిల్లాలోని చేవేళ్ల నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.
మండు వేసవిలో రాజశేఖర్ రెడ్డి నిర్వహించన పాదయాత్ర అప్పట్లో సంచలనంగా మారింది. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర, చంద్రబాబుపై ఉన్నవ్యతిరేకత ఆనాడు కాంగ్రెస్ పార్టీకి కలిసివచ్చింది. ప్రజాప్రస్థానం పాదయాత్రతో వైయస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రా రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రస్థానం పాదయాత్ర పేరుతో 1468 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు సైతం పాదయాత్ర ద్వారానే పవర్ వస్తుందని ఆశించారు.
అందులో భాగంగా అక్టోబర్ 2 2012న వస్తున్నా నీకోసం అంటూ పాదయాత్ర చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు 2340 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. అనంతరం ఎన్నికల్లో పోటీ చేశారు. 2014 ఎన్నిల్లో చంద్రబాబు ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చారు.
ఇకపోతే 2012 అక్టోబరు 18న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ షర్మిల సైతం పాదయాత్ర చేపట్టారు. మరోప్రజాప్రస్థానం పేరుతో తన తండ్రి దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డిని గుర్తుకు తెచ్చేలా ఆమె రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు.
2012 అక్టోబర్ 18న ప్రారంభించిన పాదయాత్రను వైయస్ షర్మిల 2013 జులై 29 వరకు అంటే 230 రోజుల పాటు సుమారు 3112 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. అయితే వైయస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడులు పాదయాత్రలు చేసి అధికారంలోకి వస్తే వైయస్ షర్మిల మాత్రం రాజకీయాలకు దూరమయ్యారు.
అనంతరం 2019 ఎన్నికల్లో తెరపైకి వచ్చి వైసీపీలో కీలక పాత్ర పోషించారు. ఇకపోతే అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ సైతం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీ కొనుగోలు చేయడాన్ని నిరసిస్తూ అసెంబ్లీలో తమకు న్యాయం జరగడం లేదని భావిస్తూ ప్రజా తీర్పుకోసం బయలుదేరారు. ప్రజల సమక్షంలోనే ప్రజల తీర్పును కోరతానంటూ అసెంబ్లీకి గుడ్ బై చెప్పి ప్రజలబాట పట్టారు.
అలా ఏర్పడిందే ప్రజా సంకల్పయాత్ర. దాదాపు ఏడాదిపాటు 3వేల కిలోమీటర్లుకు పైగా పాదయాత్ర చేస్తూ ప్రజలకు అత్యంత చేరువయ్యారు వైయస్ జగన్. తన పాదయాత్ర ద్వారా అధికార తెలుగుదేశం పార్టీ విధానాలను తూర్పరబడుతూ ప్రతీ ఇంటి గడపను తట్టారు వైయస్ జగన్.
2017 నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర ఏడాదికి పైగా నిర్విరామంగా కొనసాగింది. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ అవినీతి కార్యకలాపాలను, హామీల అమలులో వైఫల్యాలను ఎండగడుతూ జగన్ పాదయాత్ర చేపట్టారు.
రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల హామీని పూర్తిగా అమలు చేయకపోవడం, సాగునీటి ప్రాజెక్టుల్లో దోపిడీ, రాజధాని నిర్మాణంలో అక్రమాలు, ఇసుక దోపిడీ, మైనింగ్ అక్రమాలు, యువతకు నిరుద్యోగ భృతి కల్పనలో విఫలం వంటి అంశాలను ప్రధాన అస్త్రంగా చేసుకుంటూ జగన్ పాదయాత్రలో దూసుకుపోయారు.
పాదయాత్ర చేస్తున్నప్పుడు తనపై హత్యాయత్నం జరిగినా పట్టించుకోకుండా మళ్లీ పాదయాత్రకు సై అంటూ అందరిని కలుసుకుంటూ ముందుకు దూసుకెళ్లారు వైయస్ జగన్. వైయస్ జగన్ మండుటెండల్లోనూ వర్షంలో తడుస్తూ కూడా పాదయాత్ర చేపట్టారు.
దేశచరిత్రలోనే ఏ రాజకీయ వేత్త చేయని విధంగా వైయస్ జగన్ అత్యధిక కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు. 2017 నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన పాదయాత్ర 341 రోజుల పాటు 3,648 కిలో మీటర్లు పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు వైయస్ జగన్.
జగన్ తన పాదయాత్రలో మొత్తం 134 నియోజక వర్గాల్లో పర్యటించారు. పాదయాత్ర ఆసాంతం 2,516 గ్రామాలు, 231 మండలాలు, 54 మున్సిపాల్టీలు, 8 కార్పోరేషన్ల మీదుగా ఈ యాత్ర సాగించారు. మొత్తం 124 బహిరంగ సభల్లో జగన్ ప్రసంగించారు. 55 ఆత్మీయ సమ్మేళనాల్లో జగన్ పాల్గొనడం విశేషం.
ఇచ్ఛాపురం టౌన్కు 2 కిలో మీటర్ల ముందే ఈ స్థూపం కనిపిస్తుంది. మూడు అంతస్తుల లెక్కన, పునాది నుంచి 88 అడుగుల ఎత్తులో స్థూపం ఉంటుంది. పునాది నుంచి స్థూపం బేస్ వరకూ 13 జిల్లాలను సూచిస్తూ 13 మెట్లు నిర్మించారు. నాలుగు పిల్లర్లపై 3 అంతస్తుల్లో స్థూపం ఉంటుంది.
మొదటి అంతస్తులో జగన్ పాదయాత్ర ఫొటోలు ఉంటాయి. రెండో అంతస్తులో వైయస్సార్ ఫొటోలు ఉంటాయి. స్థూపం పైఅంతస్తు డోమ్ నుంచి 15 అడుగుల ఎత్తులో పార్టీ పతాకం ఎగురుతుంది.
గతంలో వైఎస్ఆర్ రైతన్న రాజ్యం కోసం జలయజ్ఞం పథకాన్ని చేపట్టారో అదే రీతిలో వైయస్ఆర్ జలయజ్ఞంం పథకాన్ని కూడా అమలు చేస్తానని జగన్ హామీ ఇవ్వడం ఈ పథకాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు దోహదం చేశాయి.