లోకేష్ పై పోటీకి జనసేన దూరం: పవన్, జేడీల కోసమే బాబు పెండింగ్?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్పై పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పోటీకి దూరంగా ఉంటోంది. లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి స్థానాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీసీఐకి కేటాయించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్పై పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పోటీకి దూరంగా ఉంటోంది. లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి స్థానాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీసీఐకి కేటాయించారు.
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మీద జనసేన పోటీకి దూరంగా ఉంటోంది.. విజయవాడ సెంట్రల్ సీటును కూడా సీసీఎంకు కేటాయించింది. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ గెలిచిన సీట్లను తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పెండింగులో పెట్టారు.
కీలకమైన కొన్ని స్థానాలకు చంద్రబాబు ఇప్పటి వరకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. జనసేన తన అభ్యర్థులను ప్రకటించిన తర్వాతనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఆ స్థానాలకు ఖరారయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
పవన్కల్యాణ్, లక్ష్మీనారాయణలు పోటీచేయవచ్చని ప్రచారం జరుగుతున్న గాజువాక, భీమిలి, పెందుర్తి తదితర సీట్లకు చంద్రబాబు తన అభ్యర్థులను ప్రకటించకపోవడంలోని ఆంతర్యం అదేనని అంటున్నారు.
గాజువాకలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నా ఆయన పేరును ఖరారుచేయలేదు. అలాగే, పెందుర్తిలో ఐదుసార్లు గెలిచిన సీనియర్ నేత మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి టికెట్ను కూడా చంద్రబాబు పెండింగ్లో పెట్టారు