జబర్దస్త్: క్లాప్స్ కు బ్రేక్, ఎపి ఎన్నికల్లో తారల ఫైట్
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పోరు తారా స్థాయికి చేరుకున్నాయి. నామినేషన్ల పర్వం ఊపందుకున్న తరుణంలో ఎన్నికల ప్రచారానికి అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే అధికార తెలుగుదేశం పార్టీ ఎన్నికల సన్నాహక ప్రచార సభల పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఎన్నికల సమరానికి సై అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పోరు తారా స్థాయికి చేరుకున్నాయి. నామినేషన్ల పర్వం ఊపందుకున్న తరుణంలో ఎన్నికల ప్రచారానికి అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే అధికార తెలుగుదేశం పార్టీ ఎన్నికల సన్నాహక ప్రచార సభల పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఎన్నికల సమరానికి సై అంటున్నారు.
మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం ఢీ అంటే ఢీ అంటోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 16 నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అధికార పార్టీ విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూనే తీవ్ర ఆరోపణలు చేస్తూ పొలిటికల్ సమరాన్ని హీటెక్కిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పోరు తారా స్థాయికి చేరుకున్నాయి. నామినేషన్ల పర్వం ఊపందుకున్న తరుణంలో ఎన్నికల ప్రచారానికి అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే అధికార తెలుగుదేశం పార్టీ ఎన్నికల సన్నాహక ప్రచార సభల పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఎన్నికల సమరానికి సై అంటున్నారు.
టాలీవుడ్ కు చెందిన హీరోలు, హీరోయిన్లు, ప్రముఖ నటులు సైతం సినీరంగంలోనే కాదు రాజకీయ రంగంలోనూ తమ సత్తా చూపుతామంటూ రెడీ అవుతున్నారు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి చెందిన నటులు ఆయా పార్టీలలో కర్చీఫ్ వేసుకున్నారు. మరికొందరైతే ఏకంగా ఎన్నికల బరిలోనే ఉన్నారు.
దీంతో ఏపీలో రాబోయే ఎన్నికలకు సినీ గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్ కాబోతుందన్నమాట. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ లేనంతగా ఈసారి సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటులు రాజకీయరంగ ప్రవేశం చేశారు. వారంతా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారు.
ఇప్పటి వరకు తమ సినిమాలతో బాక్సాఫీస్ ను బద్దలు కొట్టిన నటులు పలు పార్టీల తరపున ఓట్ బ్యాంక్ ను కొల్లగొట్టేందుకు రెడీ అవుతున్నారు. క్లాప్స్కు, యాక్షన్కు తాత్కాలికంగా బ్రేక్ చెప్పి ఎన్నికల సమరంలో గ్లామర్ అద్దేందుకు రెడీ అవుతున్నారు.
అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ తోపాటు జనసేన పార్టీలో కూడా సినీ గ్లామర్ సందడి చెయ్యబోతుంది. తెలుగు సినీరంగంలో టాప్ హీరోగా వెలుగొందుతున్న పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయనాయకుడిలా మారిపోయారు. జనసేన పార్టీ స్థాపించి తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు.
సూపర్ హిట్ సినిమాలతో టాలీవుడ్ ను ఏలిన పవన్ ఇప్పుడు రాజకీయంగా తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం, బీఎస్పీల పొత్తుతో ఎన్నికల బరిలో నిలిచారు.
జనసేన పార్టీ తరపున జబర్దస్త్ ఫేమ్ ఆది, షకలక శంకర్ లు ప్రచారం చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఆది ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం కూడా జరుగుతోంది. ఇకపోతే మెగాబ్రదర్ నాగబాబు, వరుణ్ తేజ్ లు జనసేన పార్టీ తరపున ప్రచారం చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది.
ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ఎన్నికల బరిలో నిలిచిన మరోనటుడు నందమూరి బాలకృష్ణ. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలయ్య రాజకీయ రంగంలోనూ తన సత్తా చాటారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు.
బాలకృష్ణ రాజకీయాల్లోకి వచ్చి ఐదేళ్లు గడిచినా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకే ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తూనే లెజెండ్, లయన్, డిక్టేటర్, గౌతమీపుత్ర శాతకర్ణి, పైసా వసూల్, జై సింహా వంటి సినిమాల్లో నటించి మెప్పించారు కూడా.
balakrishnaఇటీవలే ఎన్టీయార్ బయోపిక్ ఆధారంగా కథానాయకుడు, మహానాయకుడు సినిమాల్లో తండ్రి ఎన్టీయార్ పాత్రను పోషించి విమర్శల ప్రశంసలు కూడా అందుకున్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా అదే నియోజకవర్గం నుంచి తిరిగి పోటీ చెయ్యనున్నారు బాలయ్య.
అంతేకాదు బాలయ్య తన రాజకీయ వారసులను కూడా బరిలోకి దించనున్నారు. పెద్దల్లుడు నారా లోకేష్ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా చిన్నల్లుడు శ్రీభరత్ విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
ఇకపోతే ప్రముఖ నిర్మాత సినీనటులు మాగంటి మురళీమోహన్ సైతం తన రాజకీయ వారసురాలిగా కోడలు రూపాదేవిని రాజమహేంద్రవరం నుంచిపోటీకి దించనున్నారు. 2014 ఎన్నికల్లో రాజమహేంద్రవరం ఎంపీగా పోటీ చేసి గెలుపొందిన ఆయన ఈసారి తన కోడలు రూపాదేవిని రంగంలోకి దింపారు.
ఆమె రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిగాపోటీ చెయ్యనున్నారు. ఆమె తరపున రాబోయే ఎన్నికల్లో ప్రచారం నిర్వహించనున్నారు మురళీమోహన్. పేరుకు రూపాదేవి అయినా తెరవెనుక చక్రం తిప్పేది మాగంటి మురళీమోహన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
మరోవైపు సినీ నిర్మాత వల్లభనేని వంశీమోహన్ సైతం టీడీపీ ఎమ్మెల్యేగా మరోసారి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. 2014 ఎన్నికల్లో కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన రాబోయే ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యనున్నారు. వంశీమోహన్ జూనియర్ ఎన్టీఆర్కు నమ్మిన బంటు.
మరో సినీ నిర్మాత మాగంటి వెంకటేశ్వరరావు అలియాస్ బాబు సైతం రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఏలూరు లోక్ సభ స్థానం నుంచి పలుమార్లు ఎంపీగా గెలుపొందిన ఆయన రాబోయే ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఇకపోతే నటుడు శివప్రసాద్ సైతం మరోసారి పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. 2014 ఎన్నికల్లో చిత్తూరు ఎంపీగా గెలుపొందిన శివప్రసాద్ పలు చిత్రాల్లో నటించారు నటిస్తున్నారు కూడా. అంతేకాదు ప్రత్యేక హోదా సాధన కోసం ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ ఎంపీల పోరాటాల నేపథ్యంలో శివప్రసాద్ పలు వేషధారణలతో అందరి ప్రశంలు అందుకున్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసి తన సత్తా చాటాలనుకుంటున్నారు.
ఇకపోతే అలనాటి హీరోయిన్ దివ్యవాణి సైతం తెలుగుదేశంపార్టీలో కీలక నేతగా ఉన్నారు. టీడీపీ అధికార ప్రతినిధిగా ఎన్నికైన ఆమె అడపాదడపా వైసీపీపై విమర్శల దాడికి దిగుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేసేందుకు ఆమె రెడీ అయ్యారు.
ఇకపోతే మరో ప్రముఖ నటి వాణీ విశ్వనాథ్ టీడీపీలో చేరారు. ఆమె కూడా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేయబోతున్నారని తెలుస్తోంది. ఈమె చిత్తూరు జిల్లా నగరి నుంచి వైసీపీ అభ్యర్థి రోజాకు పోటీగా చేస్తారని ప్రచారం కూడా జరిగింది.
మరోవైపు ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ కూడా తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. బోయపాటి శ్రీనివాస్ తెరవెనుక పార్టీ ప్రచారసేవలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. ప్రచార ఫ్లెక్సీలు, పత్రికలు, టీవీ ప్రకటనల రూపకల్పన అంతా బోయపాటి శ్రీనివాస్ దేనని టాక్.
ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సినీ ప్రముఖుల సందడి మామూలుగా లేదు. నగరి ఎమ్మెల్యే రోజాతో ప్రారంభమై యంగ్ హీరో తనీష్ వరకు కొనసాగుతూనే ఉంది
వైసీపీ తరపున చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేసేందుకు రోజా రెడీ అయ్యారు. 2014 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆమె 2019ఎన్నికల్లో కూడా తిరిగిపోటీ చేస్తున్నారు. వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఆమె రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేస్తూ మహిళల్లో జోష్ నింపుతునున్నారు.
ఇకపోతే సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళికూడా వైసీపీకి అనుబంధంగా కొనసాగుతున్నారు. పలు వేదికలపై, టీవీల్లోని చర్చా వేదికల్లో వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు పోసాని కృష్ణమురళీ అనుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు.
అటు హాస్యనటుడు పృథ్వీరాజ్ వైసీపీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వైసీపీ రాష్ట్రకార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఆయన త్వరలోనే ఎన్నికల ప్రచారానికి రెడీ అవుతున్నారు. టీడీపీకి వ్యతిరేకంగా తన బృందంతో ప్రచారం చెయ్యబోతున్నారు.
ఇకపోతే అలనాటి హీరోయిన్, మాజీ ఎమ్మెల్యే జయసుధ వైసీపీ గూటికి చేరారు. 2009లో కాంగ్రెస్పార్టీ తరపున సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆమె ఆ తర్వాత టీడీపీలో చేరారు. ఇటీవలే వైసీపీలో చేరారు. వైసీపీ తరపును పోటీ చేద్దామని ఆశించారు కానీ టికెట్ దక్కకపోవడంతో ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.
అటు ప్రముఖ హాస్యనటుడు అలీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కూడా రాబోయే ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం కూడా జరిగింది. టికెట్ దక్కకపోవడంతో ఆయన కేవలం ప్రచారానికి పరిమితం కానున్నారు.
టాలీవుడ్ నటుడు కృష్ణుడు కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎన్నికల ప్రచారం ఉన్న నేపథ్యంలో మరింత జోరుగా పాల్గొనే అవకాశం ఉంది.
వీరితోపాటు అలనాటి హీరో భానుచందర్ సైతం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీలో చేరిన తర్వాత పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. రావాలి కావాలి జగన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ హల్ చల్ చేస్తున్నారు.
వీరితోపాటు ప్రముఖ సినీనిర్మాత పొట్లూరి వరప్రసాద్ సైతం ఇటీవలే వైసీపీలో చేరిపోయారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చెయ్యనున్నారు.
ఇకపోతే మరో నటుడు రాజారవీంద్ర సైతం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. టాలీవుడ్ లో ఆంధ్రయాసలో మాట్లాడుతూ అందర్నీ ఆకట్టుకుంటున్న రాజారవీంద్ర రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేస్తారని టాక్.
అలాగే ప్రముఖ దర్శకుడు దర్శకరత్న దాసరి నారాయణ రావు కుమారుడు దాసరి అరుణ్ సైతం వైసీపీలో తీర్థం పుచ్చుకున్నారు. రాబోయే ఎన్నికల్లో ఆయన వైసీపీ తరపున ప్రచారం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు. తనను పార్టీ ఎన్నికల ప్రచారం చెయ్యమని ఆదేశిస్తే తప్పకుండా ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు కూడా.
ఇకపోతే తాజాగా యంగ్ హీరో తనీష్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కర్నూలులో వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తనీష్ రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేస్తారని టాక్.
మరోవైపు నచ్చావులే ఫేం మాధవీలత బీజేపీలో చేరారు. ఆమె గుంటూరు జిల్లా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యనున్నారు. మెుత్తానికి రాబోయే ఎన్నికల ప్రచారంలో సినీ నటులు సందడి చెయ్యనున్నారన్నమాట.