లోకేశ్లాగా అమ్మాయిలతో తిరగలా, మందుకొట్టలా: పోసాని సంచలన వ్యాఖ్యలు
తాను లోఫర్ను, వెన్నుపొటు దారుని, రౌడీషీటర్ను కాదని సుజనా చౌదరిలాగా బ్యాంకులను మోసం చేయలేదన్నారు. భూకబ్జాలు చేయలేదని, లోకేశ్లాగా అమ్మాయిలతో తిరగలేదు, మందు కొట్టలేదు, అవినీతి పనులు చేయలేదని పోసాని మండిపడ్డారు
తాను లోఫర్ను, వెన్నుపొటు దారుని, రౌడీషీటర్ను కాదని సుజనా చౌదరిలాగా బ్యాంకులను మోసం చేయలేదన్నారు. భూకబ్జాలు చేయలేదని, లోకేశ్లాగా అమ్మాయిలతో తిరగలేదు, మందు కొట్టలేదు, అవినీతి పనులు చేయలేదని పోసాని మండిపడ్డారు. లోకేశ్ అమ్మాయిలతో తిరిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయని పోసాని గుర్తు చేశారు
నా సినిమా మేనిఫెస్టోలో సమకాలీన రాజకీయాల గురించి ప్రస్తావించా, ఆపరేషన్ దుర్యోధనను ఆ సినిమా పోలి ఉంటుంది. ఈ సినిమా బయోపిక్ కాదు, ఏ రాజకీయ పార్టీకి మద్ధతుగా తీయలేదు. చంద్రబాబు క్యారెక్టర్ ఉంటే నా తల నరికేసుకోవచ్చు. ఒక ముఖ్యమంత్రికి రైతుకి, సామాన్య కార్యకర్తకి మధ్య జరిగే సినిమాయే మేనిఫెస్టో. రైతుకు వందశాతం రుణమాఫీ చేస్తానన్న ఒక సీఎం మాట తప్పడం వల్ల ఈ సినిమాలో రైతు ఆత్మహత్య చేసుకుంటాడని తెలిపారు. సెన్సార్ నిబంధనలకు లోబడే ఈ సినిమా తీశానని కృష్ణమురళి స్పష్టం చేశారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ప్రతిపక్షనేత జగన్ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేందుకు చంద్రబాబు, లోకేశ్ ప్రయత్నించారు. వాళ్ల మీద నేను ఫిర్యాదు చేస్తా... ఎలక్షన్ కమిషన్ వాళ్లిద్దరిని పిలిపించి వివరణ అడగగలదా అని పోసాని ప్రశ్నించారు. చంద్రబాబు దేశ ప్రధానిని ప్రతిరోజు ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారని మేం మా బాధ చెప్పుకోవాలంటే కోడ్లు అడ్డం వస్తాయా అన్నారు.
ప్రతిపక్షనేతపై కోడికత్తితో దాడి చేసినప్పుడు నిందితుడు దగ్గర ఎలాంటి లెటర్ లేదని పోలీసులు మీడియా ముందుకు వచ్చినప్పుడు లెటర్ ఎలా వచ్చిందని పోసాని ప్రశ్నించారు. నోట్లో నుంచి లింగాలు, బంగారం వచ్చినప్పుడు లెటర్లు రావా అన్నారు. చంద్రబాబు తలచుకుంటే జగన్ ఆఫ్ట్రాల్ అన్నారు. ఎన్టీఆర్నే చంపిన వ్యక్తికి జగన్ను ఏదో ఒకటి చేయడం పెద్ద విషయం కాదన్నారు. భారతదేశంలో ఏదైనా చేయగలగిన వ్యక్తి బాబేనన్నారు.