MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • weather: అండమాన్ తీరానికి నైరుతి రుతుపవనాలు.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌కు అల‌ర్ట్

weather: అండమాన్ తీరానికి నైరుతి రుతుపవనాలు.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌కు అల‌ర్ట్

weather: సాధార‌ణం కంటే ముందుగానే రుతుప‌వ‌నాలు రానున్నాయి. ఈ ఏడాది మాన్సూన్‌ మే 27న అంటే సాధారణం కంటే ముందుగానే కేరళను తాకనుంది. ఈ వారంలో తెలంగాణ‌, రాయలసీమ, ఉత్తరాంధ్రలో వడగండ్లతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

2 Min read
Mahesh Rajamoni
Published : May 13 2025, 07:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

weather update: ఈ ఏడాది రుతుప‌వ‌నాలు సాధారణంగా కంటే ముందుగానే మే 27న కేరళ తీరాన్ని తాకనున్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా వ్యవసాయ పనులకు ఎంతో అవసరమైన వర్షాలు త్వరగా ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ సమయంలో దక్షిణ, మధ్య బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొంటూ, వచ్చే నాలుగైదు రోజుల్లో అండమాన్, నికోబార్ దీవులు, దక్షిణ-మధ్య బంగాళాఖాతం వరకు రుతుప‌వ‌నాల ప్ర‌భావం విస్తరించనుందని అంచనా వేసింది. 

26

వేగంగా మారుతున్న వాతావరణ పరిస్థితుల మధ్యలో పశ్చిమ బంగాళాఖాతంలో అండమాన్ దీవుల సమీపంలో బుధవారం ఉపరితల ద్రోణి ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. పరిస్థితులు అనుకూలంగా ఉంటే, ఇది అల్ప‌పీడనంగా మారే అవకాశం ఉంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంది. 

Related Articles

Related image1
Telangana: తెలంగాణ‌లో భారీగా పెరిగిన రేష‌న్ కార్డుల ల‌బ్ధిదారులు..
Related image2
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు
36

ప్ర‌స్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు, ఉక్కపోత తీవ్రతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కాకాణిలో అత్యధికంగా 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇంకోలు (43.5℃), జువ్విగుంట (43.3℃), మొగలూరు (43.1℃) స‌హా ప‌లు ప్రాంతాల్లో గ‌రిష్ఠ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి. 17 జిల్లాల్లోని 116 కేంద్రాల్లో 41℃కుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

46

విప‌త్తు నిర్వహణ సంస్థ వివ‌రాల ప్ర‌కారం.. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42℃ నుండి 43.5℃ మధ్య నమోదయ్యాయి. రాయలసీమ జిల్లాల్లో మంగళవారం, బుధవారం వడగండ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాల‌ను కూడా ప్ర‌స్తావించింది. గురువారం కొన్ని ప్రాంతాల్లో మరింత వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయి.

56

ఇక తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కూడా వ‌ర్షాలు ప‌డే అవ‌కాశ‌ముంది. ఉత్తర, దక్షిణ ద్రోణులు బలహీనపడినప్పటికీ వచ్చే 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముంది. అయితే ఉష్ణోగ్రతలు 36℃ నుండి 40℃ మధ్య ఉండే అవకాశం ఉంది. సాయంత్రం సమయాల్లో చిరుజ‌ల్లులు ప‌డే అవ‌కాశ‌ముంది.

66

ఇప్పటివరకు వాతావరణ శాఖ స్పష్టమైన వర్షాభావ అంచనా ఇవ్వనప్పటికీ, మాన్సూన్ ప్రభావంతో ఈ సంవత్సరం సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
వాతావరణం
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved