Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • జగన్ కు చంద్రబాబు దెబ్బ: 90 స్థానాల్లో అభ్యర్థుల ఖరారు

జగన్ కు చంద్రబాబు దెబ్బ: 90 స్థానాల్లో అభ్యర్థుల ఖరారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై తెలుగు దేశం పార్టీ  ఫోకస్ పెట్టింది.  ఇప్పటికే  90 అభ్యర్థులకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మిగిలిన స్థానాల్లో అభ్యర్థులపై  చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. 

narsimha lode | Updated : Dec 31 2023, 10:36 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
జగన్ కు చంద్రబాబు దెబ్బ: 90 స్థానాల్లో  అభ్యర్థుల ఖరారు

జగన్ కు చంద్రబాబు దెబ్బ: 90 స్థానాల్లో అభ్యర్థుల ఖరారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి  2024 ఏప్రిల్ మాసంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ ఎన్నికలకు  రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు సన్నద్దమౌతున్నాయి. గతానికి భిన్నంగా తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు  ఎన్నికల వ్యూహలను రచిస్తున్నారు.  వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై  తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు దాదాపుగా పూర్తైంది. 

 

also read:బీజేపీ తేల్చాకే: సీట్ల సర్ధుబాటుపై టీడీపీ, జనసేన ప్రకటన

27
జగన్ కు చంద్రబాబు దెబ్బ: 90 స్థానాల్లో  అభ్యర్థుల ఖరారు

జగన్ కు చంద్రబాబు దెబ్బ: 90 స్థానాల్లో అభ్యర్థుల ఖరారు


 రాష్ట్రంలోని  175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై  చంద్రబాబు కసరత్తు  కొనసాగుతుంది.  ఇప్పటికే  90 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికను చంద్రబాబు పూర్తి చేశారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో  పని  చేసుకోవాలని చంద్రబాబు నాయుడు స్వయంగా ఆ పార్టీ నేతలకు  సూచించారు.

 

also read:టీడీపీతో పొత్తుపై సంక్రాంతికి విడుదల: మోడీకి నివేదిక

37
జగన్ కు చంద్రబాబు దెబ్బ: 90 స్థానాల్లో  అభ్యర్థుల ఖరారు

జగన్ కు చంద్రబాబు దెబ్బ: 90 స్థానాల్లో అభ్యర్థుల ఖరారు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  తెలుగు దేశం, జనసేనలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి.  ఉభయ గోదావరి జిల్లాల్లో మెజారిటీ సీట్లను జనసేన పార్టీ కోరే అవకాశం ఉంది. దీంతో పాటు  ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడ  ఆ పార్టీ  ఫోకస్ పెట్టింది. 

 

also read:బీఆర్‌ఎస్‌కు కాళేశ్వరం కష్టాలు: మేడిగడ్డ ముంచుతుందా, తేల్చుతుందా?

47
జగన్ కు చంద్రబాబు దెబ్బ: 90 స్థానాల్లో  అభ్యర్థుల ఖరారు

జగన్ కు చంద్రబాబు దెబ్బ: 90 స్థానాల్లో అభ్యర్థుల ఖరారు


ఇదిలా ఉంటే  జనసేనతో పాటు  ఈ కూటమిలో  భారతీయ జనతా పార్టీ చేరితే  ఆ పార్టీకి కూడ  సీట్లను కేటాయించాల్సిన అనివార్య పరిస్థితులు తెలుగు దేశం పార్టీపై  ఉన్నాయి.  భారతీయ జనతా పార్టీ  12 అసెంబ్లీ, ఆరు  పార్లమెంట్ స్థానాలను కోరుతున్నట్టుగా ప్రచారం సాగుతుంది. మరో వైపు జనసేన కూడ  30కిపైగా అసెంబ్లీ స్థానాలపై పట్టుబడుతుంది.  అయితే  జనసేన కోరినన్ని స్థానాలను  తెలుగు దేశం పార్టీ ఇచ్చే పరిస్థితి ఉండకపోవచ్చని తెలుగు దేశం పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. 

also read: జగనన్న వదిలిన బాణం: కాంగ్రెస్‌ చేతికి అస్త్రం కానుందా?

57
జగన్ కు చంద్రబాబు దెబ్బ: 90 స్థానాల్లో  అభ్యర్థుల ఖరారు

జగన్ కు చంద్రబాబు దెబ్బ: 90 స్థానాల్లో అభ్యర్థుల ఖరారు

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు  గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన  90 అసెంబ్లీ స్థానాలను మినహాయించి ఇతర స్థానాలను జనసేనకు కేటాయించే అవకాశం ఉంది.  పొత్తుల పేరుతో ఇతర పార్టీలకు ఎక్కువ సీట్లను కేటాయిస్తే  యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (వైఎస్ఆర్‌సీపీ)కి పరోక్షంగా  ప్రయోజనం కలిగే అవకాశం లేకపోలేదనే చర్చ  తెలుగు దేశం వర్గాల్లో సాగుతుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని  పొత్తుల్లో భాగంగా  ఇతర పార్టీలకు సీట్లను కేటాయించాలని  చంద్రబాబును ఆ పార్టీ నేతలు కోరుతున్నారు.

 

also read:కాంగ్రెస్‌లోకి వై.ఎస్. షర్మిల?: వై.ఎస్. విజయమ్మ ఎటువైపు

67
జగన్ కు చంద్రబాబు దెబ్బ: 90 స్థానాల్లో  అభ్యర్థుల ఖరారు

జగన్ కు చంద్రబాబు దెబ్బ: 90 స్థానాల్లో అభ్యర్థుల ఖరారు

2024 అసెంబ్లీ ఎన్నికలను తెలుగు దేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.ఈ ఎన్నికల్లో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రాకపోతే  తెలుగు దేశం పార్టీకి రాజకీయంగా  ఇబ్బందులు తప్పవు. దీంతో  ఈ ఎన్నికలను  తెలుగు దేశం పార్టీ సీరియస్ గా తీసుకుంది. వచ్చే ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకు మాత్రమే టిక్కెట్లను తెలుగు దేశం నిర్ణయం తీసుకుంది. సర్వే రిపోర్టు ఆధారంగానే అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేశారు. 90 అభ్యర్థులకు ఈ సర్వే రిపోర్టు ఆధారంగా చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.వైఎస్ఆర్‌పీ ఇంకా అభ్యర్థులను ఖరారుపై కేంద్రీకరించింది.  కానీ, చంద్రబాబు మాత్రం 90 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు.

 

also read:ఆయేషా మీరా హత్యకు నేటికి 16 ఏళ్లు: ఎన్నో మలుపులు, తేలని దోషులు

77
జగన్ కు చంద్రబాబు దెబ్బ: 90 స్థానాల్లో  అభ్యర్థుల ఖరారు

జగన్ కు చంద్రబాబు దెబ్బ: 90 స్థానాల్లో అభ్యర్థుల ఖరారు


2024 అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దఫా అధికారంలోకి రావడం కోసం వైఎస్ఆర్‌సీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి  కేంద్రీకరించారు.  ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. దీంతో  రాష్ట్రంలోని  40 నుండి  60 అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జీలను మార్చనున్నారు. ఇప్పటికే  11 అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జీలను మార్చారు.  మిగిలిని స్థానాల్లో మార్పులకు సంబంధించిన వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం రెండు మూడు రోజుల్లో ప్రకటించనుంది.

 

also read:ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కూటమి:బాబుకు దెబ్బేనా?

narsimha lode
About the Author
narsimha lode
జనసేన
నారా చంద్రబాబు నాయుడు
పవన్ కళ్యాణ్
తెలుగుదేశం పార్టీ
 
Recommended Stories
AP, Telangana Weather Updates : ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త... వీకెండ్ కాబట్టి ఇంట్లోంచి బయటకు రాకండి
AP, Telangana Weather Updates : ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త... వీకెండ్ కాబట్టి ఇంట్లోంచి బయటకు రాకండి
Andhra Pradesh: అన్నదాత సుఖీభవ పథకానికి ముహుర్తం కుదిరింది..మొదటి విడతగా ఆ రోజున అకౌంట్లలోకి రూ.7 వేలు!
Andhra Pradesh: అన్నదాత సుఖీభవ పథకానికి ముహుర్తం కుదిరింది..మొదటి విడతగా ఆ రోజున అకౌంట్లలోకి రూ.7 వేలు!
Andhra Pradesh: నేడు ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు..రిజల్ట్స్‌ ని ఇలా చెక్‌ చేసుకోండి!
Andhra Pradesh: నేడు ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు..రిజల్ట్స్‌ ని ఇలా చెక్‌ చేసుకోండి!
Top Stories
Telugu news live updates: AP, Telangana Weather Updates - ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త... వీకెండ్ కాబట్టి ఇంట్లోంచి బయటకు రాకండి
Telugu news live updates: AP, Telangana Weather Updates - ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త... వీకెండ్ కాబట్టి ఇంట్లోంచి బయటకు రాకండి
Telugu news live updates: Recruitment - స్పేస్ సెంటర్‌లో ఉద్యోగం చేయాలనుందా? నెలకు రూ.1.4 లక్షల వరకు జీతం ఇచ్చే పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్
Telugu news live updates: Recruitment - స్పేస్ సెంటర్‌లో ఉద్యోగం చేయాలనుందా? నెలకు రూ.1.4 లక్షల వరకు జీతం ఇచ్చే పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్
PM Modi: అది మాన‌వ‌త్వంపై జ‌రిగిన దాడి.. మ‌రోసారి పాక్‌కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన మోదీ
PM Modi: అది మాన‌వ‌త్వంపై జ‌రిగిన దాడి.. మ‌రోసారి పాక్‌కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన మోదీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
  • Language Editions
  • newsable(english)
  • മലയാളം(malayalam)
  • தமிழ்(tamil)
  • ಕನ್ನಡ(kannada)
  • తెలుగు(telugu)
  • বাংলা(bangla)
  • हिन्दी(hindi)
  • मराठी(marathi)
  • Popular Categories
  • Entertainment
  • Fact Check
  • Sports
  • Life Style
  • International News
  • Hot on Web
  • Pawan Kalyan
  • Telugu News
  • Nara Chandrababu Naidu
  • District News
  • Nellore News
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Guntur News
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved