MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • మరో బిగ్ ఏఐ డేటా సెంటర్.. ఆంధ్రకు రిలయన్స్ గుడ్‌న్యూస్.. నిరుద్యోగులకు పండగే !

మరో బిగ్ ఏఐ డేటా సెంటర్.. ఆంధ్రకు రిలయన్స్ గుడ్‌న్యూస్.. నిరుద్యోగులకు పండగే !

Reliance investments AP: ఆంధ్రప్రదేశ్ లో భారీ పెట్టుబడులకు రిలయన్స్ సిద్ధమైంది. 1GW AI డేటా సెంటర్‌, 6GWp సోలార్ ప్రాజెక్ట్‌, కర్నూలులో ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయనుంది. దీంతో వేలాది కొత్త ఉద్యోగాలు రానునున్నాయి.

2 Min read
Mahesh Rajamoni
Published : Nov 14 2025, 06:00 PM IST| Updated : Nov 14 2025, 06:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సీఐఐ సదస్సులో కీలక చర్చలు.. ఏపీ రిలయన్స్ మెగా ప్రాజెక్టులు
Image Credit : Getty

సీఐఐ సదస్సులో కీలక చర్చలు.. ఏపీ రిలయన్స్ మెగా ప్రాజెక్టులు

విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు ఆంధ్రప్రదేశ్‌కు కొత్త పెట్టుబడి అవకాశాలకు వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరుసగా దేశీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. ఇదే క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎంఎస్ ప్రసాద్, సౌత్ ఇండియా మెంటార్ మాధవరావు ముఖ్యమంత్రిని కలిసి రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై సమగ్రంగా చర్చించారు.

ఈ చర్చలు కేవలం ప్రాథమిక స్థాయిలో నిలవకుండానే, ముఖ్యమైన నిర్ణయాలకు మార్గం సుగమం చేశాయి. చర్చల అనంతరం రిలయన్స్ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించినట్లు అధికారికంగా వెల్లడించింది.

25
గిగావాట్ సామర్థ్యంతో అత్యాధునిక AI డేటా సెంటర్ ఏర్పాటు
Image Credit : X/AndhraPradeshCM

గిగావాట్ సామర్థ్యంతో అత్యాధునిక AI డేటా సెంటర్ ఏర్పాటు

రిలయన్స్ ఈ పెట్టుబడి ప్యాకేజ్‌లో అత్యంత ప్రధానమైనది 1 GW AI డేటా సెంటర్‌. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన GPUలు, TPUలు, హై-ఎండ్ AI ప్రాసెసర్‌లను హోస్ట్ చేసే సామర్థ్యంతో ఈ సెంటర్ నిర్మించనున్నారు.

ఈ డేటా సెంటర్ పూర్తిస్థాయి మాడ్యులర్ టెక్నాలజీతో, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేయనున్నారు. గుజరాత్‌లోని జామ్‌నగర్ రిలయన్స్ గిగావాట్ స్థాయి డేటా సెంటర్‌తో అనుసంధానం కావడం ద్వారా ఇది ఆసియా ఖండంలో అత్యంత శక్తివంతమైన AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్‌వర్క్‌లలో ఒకటిగా మారనుంది.

కృత్రిమ మేధస్సు రంగంలో జరుగుతున్న ప్రపంచవ్యాప్త మార్పుల్లో ఆంధ్రప్రదేశ్ కీలక కేంద్రంగా నిలిచేందుకు ఈ ప్రాజెక్ట్ దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.

Related Articles

Related image1
IMD Rain Alert : ఒకటి కాదు రెండు అల్పపీడనాలు .. ఈ ప్రాంతాల్లో చలిగాలులతో వర్షాలు, బిఅలెర్ట్
Related image2
తిరుమలలో అంబానీ అద్భుత సదుపాయం.. భక్తులకు నిత్యం 2 లక్షల అన్నప్రసాదాలు
35
6 GWp సోలార్ పవర్ ప్రాజెక్ట్.. ఎనర్జీ రంగంలో ఏపీ భారీ ముందడుగు
Image Credit : ANI

6 GWp సోలార్ పవర్ ప్రాజెక్ట్.. ఎనర్జీ రంగంలో ఏపీ భారీ ముందడుగు

ఈ AI డేటా సెంటర్‌కు అవసరమయ్యే విద్యుత్ సరఫరా కోసం రిలయన్స్ 6 GWp సోలార్ పవర్ ప్రాజెక్ట్ను కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనుంది.

ఈ ప్రాజెక్ట్ రాష్ట్రంలోని పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచడమే కాక, పరిశ్రమల విస్తరణకు కావాల్సిన విద్యుత్ మౌలిక సదుపాయాలను బలపరచనుంది.

సౌర శక్తి రంగంలో ఇది దేశంలోనే అత్యంత పెద్ద ప్రైవేట్ పెట్టుబడులలో ఒకటిగా నిలుస్తుందని అధికారులు భావిస్తున్నారు.

45
కర్నూలులో 170 ఎకరాల్లో గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్
Image Credit : Getty

కర్నూలులో 170 ఎకరాల్లో గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్

వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్ రంగాలను తిరిగి ట్రాక్ లోకి తీసుకురానున్న మరో ప్రముఖ ప్రాజెక్ట్ కర్నూలు జిల్లాలో నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్‌.

170 ఎకరాల విస్తీర్ణంలో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ ఆధునిక ఆటోమేషన్ సిస్టమ్‌లతో, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకోనుంది.

ఇది రైతులకు ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, నిల్వ, ఎగుమతి అవకాశాలను విస్తృతంగా అందించనుంది. వ్యవసాయ విలువ గొలుసులో నష్టాలను తగ్గించడంలో, రైతులకు అధిక ఆదాయం చేరడంలో ఇది కీలకంగా నిలుస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

55
వేలాది ఉద్యోగావకాశాలకు దారి : సీఎం చంద్రబాబు
Image Credit : X/AndhraPradeshCM

వేలాది ఉద్యోగావకాశాలకు దారి : సీఎం చంద్రబాబు

ఈ మూడు మెగా ప్రాజెక్ట్‌ల ద్వారా ప్రత్యక్ష, పరోక్షంగా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. ఐటీ, టెక్నాలజీ, పవర్, వ్యవసాయం, లాజిస్టిక్స్ వంటి విభాగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని అంచనా. రాష్ట్రంపై విశ్వాసం ఉంచి భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీకి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఇటీవలి కాలంలో రాష్ట్రం పెట్టుబడుల్లో మళ్లీ వేగం అందుకుంటున్న వేళ, రిలయన్స్ నిర్ణయం ఆ వేగాన్ని మరింత బలపరచనుంది. ప్రభుత్వంతో ఇప్పటికే 35 MoUs కుదరడంతో, రాష్ట్రంలో పారిశ్రామిక విస్తరణకు ఇది బలమైన సంకేతంగా కనిపిస్తోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
నారా చంద్రబాబు నాయుడు
సాంకేతిక వార్తలు చిట్కాలు
భారత దేశం
వ్యాపారం
పవన్ కళ్యాణ్
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved