MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • స్లీపర్ బస్సులు కాదు కదిలే శవపేటికలు.. అక్కడ వీటిపై బ్యాన్.? పూర్తి వివరాలు ఇవిగో

స్లీపర్ బస్సులు కాదు కదిలే శవపేటికలు.. అక్కడ వీటిపై బ్యాన్.? పూర్తి వివరాలు ఇవిగో

Sleeper Buses: స్లీపర్ బస్సులు సౌకర్యవంతంగా కనిపించినా, భద్రత విషయంలో తీవ్ర లోపాలున్నాయి. డిజైన్ లోపాలు, ఇరుకైన నడిచే దారి, అత్యవసర ద్వారాలు తక్కువ, నిబంధనల ఉల్లంఘనలు వెరిసి ప్రమాదాలకు దారితీస్తున్నాయి.  

2 Min read
Author : Pavithra D
Published : Oct 26 2025, 07:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సౌకర్యం కాదు.. కదిలే శవపేటికలు..
Image Credit : Twitter

సౌకర్యం కాదు.. కదిలే శవపేటికలు..

సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఆశించి అధిక ధరలు ఉన్నప్పటికీ ప్రయాణికులు స్లీపర్ బస్సులు ఎంచుకుంటారు. వాస్తవానికి భద్రత విషయంలో తీవ్ర లోపాలతో కూడుకున్నవి ఇవి. హైటెక్ డిజైన్‌తో, బెడ్‌రూమ్‌ను తలపించే స్లీపర్ బెర్త్‌లు, ఏసీ సౌకర్యాలతో కూడిన ఈ బస్సులు, చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, ప్రమాదం సంభవించినప్పుడు కదిలే శవపేటికలుగా మారుతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీసీ బస్సుల కంటే వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయని ప్రయాణికులు భావించినా, భద్రతకు మాత్రం ఆపరేటర్లు ప్రాధాన్యత ఇవ్వడం లేదని రవాణా నిపుణులు చెబుతున్నారు.

25
 డిజైన్‌లోనే అనేక లోపాలు..
Image Credit : Twitter

డిజైన్‌లోనే అనేక లోపాలు..

స్లీపర్ బస్సుల డిజైన్‌లోనే అనేక లోపాలున్నాయి. బస్సుల అధిక ఎత్తు, పొడవు కారణంగా ఇరుకు రోడ్లు, మలుపులలో వీటిని నియంత్రించడం కష్టతరం. ప్రమాదం జరిగినప్పుడు బస్సు ఒకవైపునకు ఒరిగిపోయినప్పుడు, ప్రయాణికులు కిటికీలను లేదా అత్యవసర ద్వారాలను చేరడం చాలా కష్టం. లోపల బెడ్‌రూమ్ తరహాలో ఉండే బెర్త్‌లు, ఇరుకైన నడిచే మార్గం వల్ల ప్రమాద సమయంలో ప్రయాణికులు సులువుగా బయటకు రాలేకపోతున్నారు. ఎవరి బెర్త్ పైకి వారు వెళ్తే తప్ప మరొకరు నడవడానికి అవకాశం ఉండదు. గతంలో సింగిల్ బెర్త్‌లతో కూడిన డిజైన్లు ఉన్నప్పటికీ, ఆదాయం పెంచుకోవడం కోసం ఆపరేటర్ల అభ్యంతరాల మేరకు వాహన తయారీ కంపెనీలు డిజైన్లను మార్చాయి. ఇది ప్రయాణికుల ప్రాణాలకు ముప్పుగా మారింది.

Related Articles

Related image1
Kurnool Crime:వివాహేతర సంబంధానికి ఒకరు బలి... వేటకొడవలితో అతి కిరాతకంగా నరికి
Related image2
Andhra: రిసార్ట్‌గా రుషికొండ ప్యాలెస్.? ప్రజల నుంచి నాలుగు ప్రతిపాదనలు.. మరి ప్రభుత్వం నిర్ణయమేంటి.?
35
అవి స్లీపర్ బస్సులు లేవు..
Image Credit : Twitter

అవి స్లీపర్ బస్సులు లేవు..

అధునాతన బస్సుల్లో ఉండాల్సిన డ్రౌజీనెస్ అలర్ట్ సిస్టమ్ వంటివి చాలా స్లీపర్ బస్సులలో లేకపోవడం లేదా పనిచేయకపోవడం మరో ప్రధాన సమస్య. రాత్రిపూట సుదూర ప్రయాణాలు చేసే డ్రైవర్లకు అలసట లేదా నిద్రమత్తు వచ్చే ప్రమాదం అధికం. ఒక సర్వే ప్రకారం, 25 శాతం మంది డ్రైవర్లు నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తున్నట్లు అంగీకరించారు. ఏసీ బస్సులు కావడం వల్ల కిటికీలు పూర్తిగా మూసేసి ఉంటాయి. అత్యవసర ద్వారాలు ఎక్కడ ఉన్నాయో కూడా చాలామంది ప్రయాణికులకు తెలియదు. ఆపరేటర్లు అవగాహన కల్పించరు. కిటికీలు పగలగొట్టడానికి సుత్తి వంటి పరికరాలు ఉండాల్సినప్పటికీ, అవి అందుబాటులో ఉండవు. కర్నూలు బస్సు ప్రమాదంలో బయటపడిన ప్రయాణికుల చేతులకు గాయాలు కావడం దీనికి నిదర్శనం.

45
వివిధ దేశాల్లో బ్యాన్..
Image Credit : Twitter

వివిధ దేశాల్లో బ్యాన్..

భద్రతా లోపాలను గుర్తించి చైనా, జర్మనీ వంటి అనేక దేశాలు స్లీపర్ బస్సులను నిషేధించాయి. చైనాలో 2009-2013 మధ్య జరిగిన ప్రమాదాలలో 252 మంది మరణించడంతో 2012లో కొత్త స్లీపర్ బస్సుల రిజిస్ట్రేషన్‌లను నిలిపివేసి, క్రమంగా వాటి వినియోగాన్ని తగ్గించింది. జర్మనీ 2006లోనే స్లీపర్ కోచ్‌లను నిషేధించింది. అయితే, మన దేశంలో ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ARAI) 2016లో స్లీపర్ బస్సులకు 2+1 లేఅవుట్, 70.8 అంగుళాల పొడవు గల బెర్త్, 12 మీటర్ల పొడవు గల బస్సులకు కనీసం నాలుగు అత్యవసర ద్వారాలు, ప్రతి సీటు పక్కన సుత్తి వంటి నిబంధనలను రూపొందించినప్పటికీ.. ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీలు వీటిని పాటించడం లేదు.

55
రోడ్ ట్యాక్స్ తక్కువ..
Image Credit : Twitter

రోడ్ ట్యాక్స్ తక్కువ..

ప్రైవేట్ ట్రావెల్ ఆపరేటర్లు తక్కువ రోడ్ ట్యాక్స్, సులభమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియల కోసం ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, డామన్ అండ్ డయ్యూ, అరుణాచల్ ప్రదేశ్‌లలో బస్సులను రిజిస్టర్ చేయిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంవత్సరానికి ఐదు లక్షల వరకు పన్ను చెల్లించాల్సి ఉండగా, ఈ రాష్ట్రాల్లో 50 వేలు చెల్లిస్తే సరిపోతుంది. డైరెక్ట్‌గా వెహికిల్ తీసుకెళ్లకుండానే వాట్సాప్ ద్వారా పత్రాలు పంపించి గంటల్లో రిజిస్ట్రేషన్లు పొందుతున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయ నష్టాన్ని కలిగించడమే కాకుండా, ఈ బస్సులపై పర్యవేక్షణ అధికారం లేకుండా చేస్తుంది. ఫిట్‌నెస్ పరీక్షలను కూడా తూతూమంత్రంగా వీడియో కాల్స్ ద్వారా క్లియర్ చేస్తున్నారని ఆరోపణలున్నాయి. బస్సుల డిజైన్ లోపాలు, భద్రతా ప్రమాణాల విస్మరణ, నిబంధనల ఉల్లంఘనల కారణంగానే వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Raghurama Custodial Torture Case: కస్టోడియల్ టార్చర్ కేసుపై RRR కీలక ప్రెస్ మీట్ | Asianet Telugu
Recommended image2
Now Playing
Dr Pemmasani Chandrasekhar Speech: శ్రీ కళాసుధ అసోసియేషన్ ఉగాది పురస్కారాలు | Asianet News Telugu
Recommended image3
Now Playing
CM Chandrababu Naidu Attends Iftar Dinner: ఇఫ్తార్ విందులో చంద్రబాబు| Asianet Telugu
Related Stories
Recommended image1
Kurnool Crime:వివాహేతర సంబంధానికి ఒకరు బలి... వేటకొడవలితో అతి కిరాతకంగా నరికి
Recommended image2
Andhra: రిసార్ట్‌గా రుషికొండ ప్యాలెస్.? ప్రజల నుంచి నాలుగు ప్రతిపాదనలు.. మరి ప్రభుత్వం నిర్ణయమేంటి.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved