MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • కాశీబుగ్గ ఆల‌య నిర్మాణానికి కార‌ణం.. ఒక వ్య‌క్తి ఈగోనా.? ఆస‌క్తిక‌ర విష‌యాలు..

కాశీబుగ్గ ఆల‌య నిర్మాణానికి కార‌ణం.. ఒక వ్య‌క్తి ఈగోనా.? ఆస‌క్తిక‌ర విష‌యాలు..

kashi Bugga: శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే ఈ ఆలయం నిర్మాణం వెనకాల అసలు కారణం ఏంటంటే.? 

2 Min read
Narender Vaitla
Published : Nov 02 2025, 12:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు
Image Credit : Asianet News

ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు

ఏకాదశి సందర్భంగా వేలాది మంది భక్తులు కాశీబుగ్గ ఆలయానికి తరలివచ్చారు. ఆలయం పరిమిత స్థలంలో ఉండగా, గరిష్టంగా రెండు నుంచి మూడు వేల మందిని మాత్రమే ఒకేసారి అనుమతించే సామర్థ్యం ఉంది. కానీ ఈసారి సోషల్ మీడియా ప్రచారం కారణంగా 25 వేల మందికి పైగా భక్తులు ఒకేసారి గుడి వద్దకు చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా క్యూలైన్లు కూలిపోయి భక్తులు ఒకరిపై మరొకరు పడిపోయారు. ఈ తొక్కిసలాటలో 9 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు.

25
సోషల్ మీడియా ప్రభావం – వైరల్ వీడియోలే కారణమా?
Image Credit : stockPhoto

సోషల్ మీడియా ప్రభావం – వైరల్ వీడియోలే కారణమా?

ఇటీవల కాలంలో కొత్త ఆలయాలపై సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. ఇన్‌ఫ్లుయెన్సర్లు “ఇక్కడికి వస్తే కోరికలు నెరవేరతాయి”, “ఈ ఆలయం తిరుమల తరహాలో ఉంది” అంటూ వీడియోలు వైరల్ చేయడంతో ప్రజలు విపరీతంగా ఆకర్షితులయ్యారు. కాశీబుగ్గ ఆలయం కూడా అలాంటి ప్రచారం వల్లే ప్రాచుర్యం పొందింది. చాలా మంది “తిరుమలకి వెళ్లలేము, ఇక్కడే దర్శనం చేసుకుందాం” అని నిర్ణయించుకున్నారు. ఈ అంచనా లేకుండా వచ్చిన భక్తుల రద్దీనే ప్రమాదానికి ప్రధాన కారణంగా అధికారులు గుర్తించారు.

Related Articles

Related image1
నెల ఓపిక పడితే చాలు.. శని ప్రత్యక్ష సంచారంతో ఈ రాశుల వారి జీవితాల్లో ఊహించ‌ని మార్పులు
Related image2
పెద్ద ప్లాన్ వేసిన నెట్‌ఫ్లిక్స్‌.. హైద‌రాబాద్‌లో 41వేల చ‌ద‌ర‌పు అడుగుల ఆఫీస్‌. ఏం చేయనున్నారంటే.?
35
తిరుమలలో నిరాకరణతో పుట్టిన కొత్త ఆలయం
Image Credit : X@titu_dipankar

తిరుమలలో నిరాకరణతో పుట్టిన కొత్త ఆలయం

కాశీబుగ్గ ఆలయాన్ని హరిముకుంద పండా అనే 95 ఏళ్ల వృద్ధుడు నిర్మించారు. పదేళ్ల క్రితం ఆయన తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లినప్పుడు వృద్ధాప్యంతో క్యూలైన్‌లో నిలబడలేకపోయాడు. త్వ‌ర‌గా ద‌ర్శ‌నం చేయించ‌మ‌ని అడ‌గ‌డంతో.. సిబ్బంది దర్శనం ఇవ్వకపోవడంతో నిరాశ చెందాడు. అదే సమయంలో తన సొంత పొలంలోనే శ్రీవారి ఆలయం నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. 2019లో ప్రారంభమైన నిర్మాణం ఇప్పటికీ కొనసాగుతోంది. ఆలయం తిరుమల రెప్లికా తరహాలో ఉండి, గోపురాలు, గర్భగుడి, నవగ్రహాల విగ్రహాలతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కేవలం ఆరు నెలల క్రితమే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ఆలయం, తక్కువ సమయంలోనే విపరీతమైన ప్రాచుర్యం పొందింది.

45
యాక్ట్‌ ప్రకారం అనుమతులు, భద్రత లోపమే ప్రధాన కారణం
Image Credit : X

యాక్ట్‌ ప్రకారం అనుమతులు, భద్రత లోపమే ప్రధాన కారణం

ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రెలిజియస్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్, 1987 ప్రకారం, కొత్తగా నిర్మించే ఆలయాలు ప్రభుత్వ రిజిస్ట్రేషన్‌లో ఉండాలి. భద్రత, భక్తుల నియంత్రణకు సంబంధించిన ఏర్పాట్లు తప్పనిసరి. కానీ కాశీబుగ్గ ఆలయం ప్రైవేట్ ఆలయం కావడంతో ప్రభుత్వానికి ముందుగా సమాచారం ఇవ్వలేదని అధికారులు తెలిపారు. సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం, నియంత్రణలోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు పేర్కొన్నారు.

55
ప్రభుత్వ చర్యలు – బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు
Image Credit : Asianet News

ప్రభుత్వ చర్యలు – బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు

కాశీబుగ్గ విషాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై విచారణకు ఆదేశిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటించారు.

మొత్తం మీద‌.. కాశీబుగ్గ విషాదం ఒక గట్టి హెచ్చరిక. భక్తి ఎంతటి పవిత్రమైనదైనా, భద్రతా ప్రమాణాలు పాటించకపోతే అది విషాదంగా మారవచ్చు. సోషల్ మీడియా ప్రచారం వల్ల ఆలయాలు పాపుల‌ర్‌ అవ్వడం తప్పు కాదు, కానీ భక్తుల ప్రాణాలను కాపాడే ఏర్పాట్లు తప్పనిసరి. ఈ ఘటన భవిష్యత్తులో ప్రైవేట్ ఆలయాల నిర్వహణపై ప్రభుత్వ కఠిన నియంత్రణ అవ‌స‌ర‌మ‌ని చెబుతోంది.

About the Author

NV
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు.
ఆంధ్ర ప్రదేశ్
నేరాలు, మోసాలు
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved