స్వాతంత్య్ర దినోత్సవ స్పెషల్... సర్వాంగసుందరంగా ముస్తాబైన సచివాలయం, రాజ్ భవన్
అమరావతి: ఓ వైపు విద్యుద్దీపాలు... మరో వైపు చిన్నపాటి చినుకులు... ఆ నీటి తుంపరల మధ్య చిమ్మచీకటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం దగదగా మెరిసిపోతోంది. చూపరుల కళ్లల్లో వెయ్యికాంతులు విరబూయిస్తూ శనివారం జరిగే 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం సెక్రటేరియట్ సర్వాంగసుందరంగా ముస్తాబయ్యింది.
ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది సచివాలయంలోని అయిదు బ్లాకులతో పాటు అసెంబ్లీకి రంగు రంగుల విద్యుద్దీపాలను అధికారులు అలంకరించారు. సచివాలయ ప్రాంగణంలో ఉన్న పార్కులో ఉన్న మొక్కలు కూడా విద్యుద్దీపాలతో వెలుగులు విరజిమ్మాయి. పంద్రాగస్టు సందర్భంగా సచివాలయం, అసెంబ్లీ ప్రాంగణంలో జాతీయ జెండాను ఎగురవేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు.
ఇక ఈ వేడుకల కోసం రాజ్ భవన్ ప్రాంగణాన్ని కూడా విద్యుద్దీపాలతో అలంకరించారు. అలాగే ఇతర ప్రభుత్వ కార్యాలయాలను కూడా సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.
స్వాతంత్య్ర ధినోత్సవ వేడుకల కోసం విద్యుద్దీపాలతో ముస్తాబయిన రాజ్ భవన్ ప్రాంగణం
రంగురంగుల విద్యుద్దీపాలతో రాజ్ భవన్ ప్రాంగణం
రాజ్ భవన్ పరిసరాల్లో భారీగా లైటింగ్
విద్యుద్దీపాల కాంతుల్లో రాజ్ భవన్
రంగురంగుల విద్యుద్దీపాల వెలుగుల మధ్య రాజ్ భవన్ ప్రాంగణం
విద్యుద్దీప కాంతుల మధ్య రాజ్ భవన్ ప్రాంగణం
స్వాతంత్య్ర ధినోత్సవ వేడుకల కోసం విద్యుద్దీపాలతో ముస్తాబయిన రాజ్ భవన్
స్వాతంత్య్ర ధినోత్సవ వేడుకల కోసం విద్యుద్దీపాలతో ముస్తాబయిన సచివాలయం
విద్యుద్దీపాలతో ముస్తాబయిన రాజ్ భవన్ ప్రాంగణం
స్వాతంత్య్ర ధినోత్సవ వేడుకల కోసం విద్యుద్దీపాలతో ముస్తాబయిన సచివాలయం