గ్యాస్ లీకేజితో పిట్టలా రాలుతున్న జనాలు, ఎల్.జి.పాలిమర్స్ చరిత్ర ఇదీ....
విశాఖ నగరంలోని గోపాలపట్నం పరిధి ఆర్.ఆర్.వెంకటాపురంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి విషవాయువు విడుదలై ప్రమాదం సంభవించింది. అర్థరాత్రి సుమారు 2 నుంచి మూడు గంటల మధ్య ప్రాంతాల్లో ఈ కంపెనీలోని విషవాయువు స్టైరిన్ లీకై దాదాపు మూడు కిలోమీటర్ల పరిధిలో వ్యాపించింది.
విశాఖ నగరంలోని గోపాలపట్నం పరిధి ఆర్.ఆర్.వెంకటాపురంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి విషవాయువు విడుదలై ప్రమాదం సంభవించింది. అర్థరాత్రి సుమారు 2 నుంచి మూడు గంటల మధ్య ప్రాంతాల్లో ఈ కంపెనీలోని విషవాయువు స్టైరిన్ లీకై దాదాపు మూడు కిలోమీటర్ల పరిధిలో వ్యాపించింది.
చుట్టుపక్కల కనీసం 20 గ్రామాలకు ఈ వాయువు వ్యాపించింది. ఇప్పటికే ముగ్గురు మరణించగా వందల మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడం లో ఇబ్బందులతో స్థానికులు తీవ్ర స్వస్థత పాలయ్యారు. అపస్మారక స్థితిలో రహదారిపై పడిపోయిన కొందరిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు పోలీసులు.
ప్రజలు భయాందోళనలతో తలుపులు వేసుకొని ఇళ్లలోనే ఉండిపోయారు, దీనివల్ల గ్యాస్ మరింత మందిని బలితీసుకునే ఆస్కారమున్నందున, పోలీసులు సైరెన్ మోగించి ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా ప్రజలకు సూచిస్తూ... వారిని తరలిస్తున్నారు.
ఇక అస్వస్థతకు గురైన వారిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఈ కంపెనీ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్ పరికరాలను తయారు చేసే ఎల్. జి. కంపెనీకి చెందినదే. ఈ కంపెనీ పాలీ స్టైరిన్ ను తయారు చేస్తుంది.
1961లో హిందూస్తాన్ పాలిమర్స్ గా ఏర్పాటైన ఈ సంస్థను 1978లో యూబీ గ్రూపుతో కలిసింది. ఆ తరువాత కొరియాకు చెందిన ఎల్.జి కంపెనీ దీనిని కొనుగోలు చేసింది. 1997లో దీని పేరు మర్చి ఎల్.జి పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గా నామకరణం చేసారు.
విషవాయువును పీల్చడం వల్ల అస్వస్థతకు గురై, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులు