MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Andhra Pradesh: ఏపీఎస్ఆర్టీసీ అదిరిపోయే బంపరాఫర్.. భారీగా తగ్గిన బస్ ఛార్జీలు ..

Andhra Pradesh: ఏపీఎస్ఆర్టీసీ అదిరిపోయే బంపరాఫర్.. భారీగా తగ్గిన బస్ ఛార్జీలు ..

ఏపీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు తీపి కబురు చెప్పింది.వెన్నెల, ఇంద్ర బస్సుల్లో ఛార్జీలపై భారీ తగ్గింపు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 31 వరకు ఈ ఆఫర్ అమల్లో ఉంటుందని అధికారులు వివరించారు.

2 Min read
Author : Bhavana Thota
| Updated : Jul 12 2025, 09:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బంపరాఫర్
Image Credit : our own

బంపరాఫర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికుల కోసం మంచి ఆఫర్ తీసుకొచ్చింది. ఈసారి ప్రయాణికులపై వ్యయం తగ్గేలా ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. అనంతపురం ప్రాంతం నుంచి ప్రధాన నగరాలకు వెళ్లే ఏసీ బస్సుల టికెట్ ధరలను ఆర్టీసీ అధికారులు గణనీయంగా తగ్గించారు. ఈ తగ్గింపు జులై 31 వరకు అమల్లో ఉంటుంది.

26
వెన్నెల ఏసీ, స్లీపర్ బస్సు
Image Credit : our own

వెన్నెల ఏసీ, స్లీపర్ బస్సు

ఇందులో భాగంగా వెన్నెల ఏసీ, స్లీపర్ బస్సుల్లో 20 శాతం, ఇంద్ర ఏసీ బస్సుల్లో 15 శాతం వరకు ఛార్జీలు తగ్గించారు. దీంతో అనేక మంది ప్రయాణికులు చౌకగా ప్రయాణించే అవకాశాన్ని పొందనున్నారు. ఆర్టీసీ నుంచి అందిన సమాచారం ప్రకారం, అనంతపురం నుంచి హైదరాబాద్, చెన్నై, తిరుపతి, విజయవాడ వంటి ప్రధాన నగరాలకు ఈ తగ్గింపు వర్తించనుంది. ప్రయాణికులు తిరుగు దారిలోనూ ఇదే తగ్గింపు వర్తింపజేసుకుంటారు.

Related Articles

Related image1
APSRTC: ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయంపై క్లారిటీ
Related image2
Andhra Pradesh విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌ న్యూస్‌..ఒక్కొక్కరికి 15 లక్షల నుంచి 25 లక్షలు..!
36
తిరుపతి మార్గంలోనూ
Image Credit : our own

తిరుపతి మార్గంలోనూ

ఉదాహరణకు, తాడిపత్రి నుంచి హైదరాబాద్‌కు వెళ్ళే బస్సుల టికెట్ ధర ప్రస్తుతం రూ.884కి తగ్గింది. గతంలో ఇదే మార్గంలో టికెట్ ధర రూ.1105 ఉండేది. అదే విధంగా అనంతపురం నుంచి విజయవాడ వెళ్లాలంటే గతంలో రూ.961 చెల్లించాల్సివస్తుండగా, ఇప్పుడు ఆ ధర రూ.817కు పడిపోయింది. అనంతపురం నుంచి చెన్నైకి టికెట్ ధర కూడా రూ.832 నుంచి రూ.708కి తగ్గించారు. తిరుపతి మార్గంలోనూ తగ్గింపు ఉంది. గతానికి తక్కువగా రూ.579 నుండి రూ.493కి టికెట్ ధర తగ్గించినట్లు సమాచారం

46
రూ.100 నుంచి రూ.150 వరకూ
Image Credit : our own

రూ.100 నుంచి రూ.150 వరకూ

ప్రతీ మార్గంలో సగటున రూ.100 నుంచి రూ.150 వరకూ ప్రయాణదారులకు ఆదా అవుతుందని అధికారులు తెలిపారు. బస్సుల్లో ప్రయాణించే ప్రజలకు ఇది నిజంగా ఊరట కలిగించే పరిణామం.ఈ నిర్ణయానికి కారణంగా ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ సంస్థలతో పోటీగా ఆదాయ మార్గాలను పెంపొందించాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆషాఢమాసంలో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఆర్టీసీ ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయాలనే దిశగా ఈ తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

56
ఏసీ బస్సులపై
Image Credit : Gemini

ఏసీ బస్సులపై

రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోని ఆర్టీసీ డిపోల నుంచి కూడా ప్రముఖ నగరాలకి వెళ్లే ఏసీ బస్సులపై ఛార్జీల తగ్గింపు అమల్లోకి వచ్చింది. హైదరాబాద్, చెన్నై, విజయవాడ వంటి ప్రధాన గమ్యస్థానాల వైపు వెళ్లే బస్సులపై ఈ తగ్గింపు వర్తించనుంది.వెన్నెల బస్సులు అంటే అత్యాధునిక సౌకర్యాలు కలిగిన నైట్ ఏసీ బస్సులు. అందులో స్లీపర్ ఫెసిలిటీ కూడా లభిస్తుంది. ఇంద్ర బస్సులు కాస్త రీజనబుల్ ఎసీ సర్వీసులుగా గుర్తింపు పొందినవే. ఈ రెండింటినీ ఎక్కువమంది ప్రయాణికులు రాత్రి ప్రయాణానికి ఎంచుకుంటుంటారు. ఇప్పుడు ఈ రెండింటిపై పెద్ద ఎత్తున డిస్కౌంట్ రావడం వల్ల ప్రయాణికుల ఖర్చు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

66
ముందుగానే టికెట్లు
Image Credit : Gemini

ముందుగానే టికెట్లు

ధరల తగ్గింపు తాత్కాలికమే అయినందున, ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. వెబ్‌సైట్ లేదా ఆర్టీసీ మోబైల్ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే వారు ఈ తగ్గింపును సులభంగా అందిపుచ్చుకోవచ్చు.ఇప్పటికే ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు అనేక మార్గాలను అన్వేషిస్తోంది. అందులో భాగంగానే ఈ ఛార్జీల తగ్గింపు ఒక భాగంగా అమలైంది. ప్రయాణికులకు మేలు జరుగడమే కాకుండా సంస్థకు వచ్చే ఆదాయాన్ని కూడా ఇది ప్రభావితం చేస్తుందని అధికారులు నమ్ముతున్నారు.

About the Author

BT
Bhavana Thota
భావన మహిళా జర్నలిస్ట్. ఈమె 10 ఏళ్లుగా పాత్రికేయరంగంలో ఉన్నారు. స్థానిక వార్తలు మొదలుకుని అంతర్జాతీయ వార్తల దాకా ఏ అంశంపై అయినా సులభంగా అర్థం అయ్యేలా కథనాలు రాయగలగడం భావన ప్రత్యేకత. ఈమె ఈనాడులో దాదాపు ఆరేళ్లు పని చేశారు. తొలివెలుగు, ఆర్టీవీలోనూ ఈమె పలు కేటగిరీలకు సబ్ ఎడిటర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఆమె ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్
విజయవాడ

Latest Videos
Recommended Stories
Recommended image1
Free Bus Travel : మహిళలు, దివ్యాంగులతో పాటు వీరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం
Recommended image2
వెంక‌న్న భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌.. ముంద‌స్తు బుకింగ్ లేకుండానే ప్ర‌త్యేక‌ ద‌ర్శ‌నం, నేరుగా టికెట్‌
Recommended image3
తిరుమల లడ్డూను చెక్ చేసేందుకు 'ఇ-నోస్' ఇ-టంగ్'.. ఎలా పనిచేస్తాయో తెలుసా..?
Related Stories
Recommended image1
APSRTC: ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయంపై క్లారిటీ
Recommended image2
Andhra Pradesh విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌ న్యూస్‌..ఒక్కొక్కరికి 15 లక్షల నుంచి 25 లక్షలు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved