MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Thalliki Vandanam: తల్లికి వందనం రెండో జాబితా రెడీ.. మీ పేరు ఉందో లేదో చెక్‌ చేసేయండి!

Thalliki Vandanam: తల్లికి వందనం రెండో జాబితా రెడీ.. మీ పేరు ఉందో లేదో చెక్‌ చేసేయండి!

తల్లికి వందనం రెండో విడత జూలై 5న డబ్బులు జమ కానున్నాయి. జాబితాలో మీ పేరు ఉందో లేదో వెబ్‌సైట్, వాట్సాప్ ద్వారా ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.

2 Min read
Bhavana Thota
Published : Jul 02 2025, 09:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తల్లికి వందనం
Image Credit : Gemini

తల్లికి వందనం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల తల్లుల కోసం ప్రవేశపెట్టిన ‘తల్లికి వందనం’ పథకం మొదటి విడత ద్వారా ఇప్పటికే వేలాది మందికి నేరుగా ఆర్థిక సహాయం అందించింది. జూన్ 12వ తేదీ నుంచి మొదలైన డబ్బుల జమ ప్రక్రియలో, అర్హత కలిగిన తల్లుల బ్యాంక్ ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.13,000 చొప్పున డబ్బులు జమ చేశారు. విద్యార్థుల సంఖ్యను బట్టి తల్లికి ఒకటి కాదు, రెండోసారి కూడా ఈ మొత్తం లభించే అవకాశం ఉండటంతో ఆసక్తి పెరిగింది.

26
రెండో విడత డేటా
Image Credit : Gemini

రెండో విడత డేటా

అయితే తొలి విడతలో కొన్ని తల్లులకు డబ్బులు జమ కాలేదు. ముఖ్యంగా ఇటీవలే పిల్లలు స్కూల్లో చేరిన వారు, ఇంటర్ మొదటి సంవత్సరం చదివే విద్యార్థుల తల్లులు ఈ జాబితాలో లేకపోవచ్చు. వీరి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రెండో విడత డేటాను తయారు చేసింది. ఈ నెల 5న వీరి అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నట్లు అధికారికంగా తెలిపింది.

Related Articles

Related image1
Thalliki Vandanam: తల్లికి వందనం పథకం డబ్బులు ఇంకా రాలేదా.. పొరపాటున కూడా ఈ తప్పు చేయోద్దు!
Related image2
Thalliki Vandanam: అర్హత ఉన్నా తల్లికి వందనం నగదు రాలేదా..అయితే ఈ ఒక్క పని చేయండి చాలు!
36
రెండు మార్గాలు
Image Credit : Ai

రెండు మార్గాలు

రెండో విడతకు సంబంధించిన లబ్ధిదారుల జాబితా ఇప్పటికే సిద్ధమైంది. తల్లుల పేర్లు జాబితాలో ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవాలంటే ఇప్పుడు రెండు మార్గాలు ఉన్నాయి. మొదటి మార్గం ద్వారా చెక్ చేయాలంటే అధికారిక వెబ్‌సైట్ అయిన https://gsws-nbm.ap.gov.in లోకి వెళ్లి అక్కడ “తల్లికి వందనం” అనే పథకాన్ని ఎంచుకుని, తల్లి ఆధార్ నంబర్ నమోదు చేసి సబ్మిట్ చేయాలి. అప్పుడు డేటాబేస్‌ ఆధారంగా మీ అర్హత వివరాలు చూపిస్తాయి.

46
ఈ నెల 5లోగా
Image Credit : Freepik

ఈ నెల 5లోగా

రెండో మార్గం వాట్సాప్ ద్వారా చెక్ చేసుకునే అవకాశం. ప్రభుత్వ మన మిత్ర సేవ ద్వారా మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీరు +91 95523 00009 అనే వాట్సాప్ నంబర్‌కి “Thalliki Vandanam” అని పంపితే, మీకు సమాచారం వస్తుంది. ఇది పథకానికి అనుసంధానంగా రూపొందించిన డిజిటల్ సేవలలో భాగం.ఇదిలా ఉండగా, స్కూళ్లలో ప్రవేశాలు తీసుకున్న పిల్లలకు మొదటి తరగతి నుంచే తల్లికి వందనం ప్రయోజనం వర్తించనుంది. వీరి తల్లులకు కూడా ఈ నెల 5లోగా పథక బెనిఫిట్లు అకౌంట్లలో జమ అవుతాయని అధికారులు వెల్లడించారు.

56
 ఉపాధ్యాయ అవార్డులు
Image Credit : AI Generated Photo

ఉపాధ్యాయ అవార్డులు

ఇంకా, రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో కీలక కార్యక్రమాలకు కూడా సిద్ధమవుతోంది. జూలై 10న ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు,  జూనియర్ కళాశాలల స్థాయిలో తల్లిదండ్రులు,  ఉపాధ్యాయుల సమావేశాలను నిర్వహించనున్నారు. దీని ద్వారా విద్యా విధానాల్లో మార్పులకు తల్లిదండ్రుల అభిప్రాయాలను తీసుకోవాలనుకుంటున్నారు.ఇక ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియ కూడా జోరుగా సాగుతోంది. జాతీయ స్థాయిలో ఇచ్చే ఉపాధ్యాయ అవార్డుల కోసం ఈ నెల 13వరకు దరఖాస్తుల్ని స్వీకరిస్తారు. రాష్ట్ర స్థాయిలో ఏర్పడే ఎంపిక కమిటీ ఆగస్టు 4లోపు జాబితాను కేంద్రానికి పంపుతుంది. ఆ తరువాత ఆగస్టు 5 నుంచి 12 వరకు వీడియో ఇంటర్వ్యూలు నిర్వహించి, 13న తుది ఎంపిక జాబితాను ఖరారు చేస్తారు. ఎంపికైన ఉపాధ్యాయులకు సెప్టెంబర్ 4, 5 తేదీల్లో అవార్డులు అందజేయనున్నారు.

66
అవార్డులు ఇవ్వాలని
Image Credit : Getty

అవార్డులు ఇవ్వాలని

ఈ అవార్డులపై రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నేరుగా ఉపాధ్యాయులను గుర్తించి అవార్డులు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఎంతో కాలంగా నిబద్ధతతో పని చేస్తున్న ఉపాధ్యాయులకు ఇది న్యాయం చేయడమని వారు అభిప్రాయపడుతున్నారు.

About the Author

BT
Bhavana Thota
భావన మహిళా జర్నలిస్ట్. ఈమె 10 ఏళ్లుగా పాత్రికేయరంగంలో ఉన్నారు. స్థానిక వార్తలు మొదలుకుని అంతర్జాతీయ వార్తల దాకా ఏ అంశంపై అయినా సులభంగా అర్థం అయ్యేలా కథనాలు రాయగలగడం భావన ప్రత్యేకత. ఈమె ఈనాడులో దాదాపు ఆరేళ్లు పని చేశారు. తొలివెలుగు, ఆర్టీవీలోనూ ఈమె పలు కేటగిరీలకు సబ్ ఎడిటర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఆమె ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్
నారా చంద్రబాబు నాయుడు
నారా లోకేష్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved