MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • నిరుద్యోగుల‌కు పండ‌గే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రూ. 82 వేల కోట్ల‌తో భారీ పెట్టుబ‌డి, వేల ఉద్యోగాలు

నిరుద్యోగుల‌కు పండ‌గే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రూ. 82 వేల కోట్ల‌తో భారీ పెట్టుబ‌డి, వేల ఉద్యోగాలు

Andhra pradesh: కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌రిశ్రామికాభివృద్ధి ఊపందుకుంది. తాజాగా రెన్యూ ప‌వ‌ర్ కంపెనీ ఏకంగా రూ. 82వేల కోట్ల పెట్టుబ‌డి పెట్ట‌నుంది. ఈ విష‌యాన్ని మంత్రి నారా లోకేష్ అధికారికంగా ప్ర‌క‌టించారు. 

2 Min read
Narender Vaitla
Published : Nov 13 2025, 12:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రూ. 82వేల కోట్ల పెట్టుబ‌డి
Image Credit : renew.com

రూ. 82వేల కోట్ల పెట్టుబ‌డి

ప్ర‌ముఖ పునరుత్పాదక ఇంధన సంస్థ ReNew Power ఆంధ్రప్రదేశ్‌లో రూ. 82,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టబోతోంది. ఈ ప్రాజెక్ట్‌లో సోలార్ ప్యానెల్ తయారీ, వాఫర్ ఉత్పత్తి, గ్రీన్ హైడ్రోజన్ తయారీ, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు ఉంటాయి. ఈ విష‌య‌మై మంత్రి లోకేష్ ఎక్స్ వేదిక‌గా పోస్ట్ చేశారు. “ఐదు సంవత్సరాల తర్వాత ReNew Power మళ్లీ ఆంధ్రప్రదేశ్‌లోకి వస్తోంది. ఇది రాష్ట్రానికి పెద్ద గర్వకారణం” అని రాసుకొచ్చారు.

#ChooseSpeedChooseAP#CIIPartnershipSummit2025 
After 5 years out of AP, it is my proud privilege to announce that Renew is placing an all-in investment on the entire renewable energy value chain in #AndhraPradesh. In an investment spanning Rs. 82,000 crores, Renew will be… pic.twitter.com/JczVgbtcEO

— Lokesh Nara (@naralokesh) November 13, 2025

24
విశాఖ‌లో మ‌రో డేటా సెంట‌ర్
Image Credit : Google Gemini AI

విశాఖ‌లో మ‌రో డేటా సెంట‌ర్

ఇప్ప‌టికే గూగుల్ విశాఖ‌లో డేటా సెంట‌ర్ ఏర్పాటుకు సిద్ధ‌మైన విష‌యం తెలిసిందే. కాగా తాజాగా మ‌రో సంస్థ సైతం డేటా సెంట‌ర్ ఏర్పాటు చేయ‌నుంది. అమెరికాకు చెందిన టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ (Tillman Global Holdings) సంస్థ విశాఖపట్నంలో రూ. 15,000 కోట్లతో డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఢిల్లీలో జరిగిన యూఎస్‌-ఇండియా స్ట్రాట‌జిక్ పాట్న‌ర్‌షిప్ ఫోర‌మ్‌లో సంత‌కం చేశారు.

Related Articles

Related image1
ఢిల్లీలో మరోసారి పేలుడు కలకలం.. ఒక్కసారిగా భారీ శబ్ధం. అసలేం జరిగిందంటే
Related image2
దేశంలో ధ‌నిక జిల్లా ఏదో తెలుసా.? స‌గ‌టు ఆదాయం రూ. 11 ల‌క్ష‌లు. టాప్‌లో తెలంగాణ
34
భారీగా ఉద్యోగాలు
Image Credit : X

భారీగా ఉద్యోగాలు

ఈ పెట్టుబ‌డుల‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భారీగా ఉద్యోగాలు రానున్నాయి. ఈ డేటా సెంటర్ ద్వారా 200 నుంచి 300 ప్రత్యక్ష ఉద్యోగాలు, అలాగే 800 నుంచి 1,000 పరోక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే రెన్యూ ప‌వ‌ర్ పెట్టుబ‌డితో కకూడా వేల సంఖ్యలో టెక్నిక‌ల్‌, ఇంజినీరింగ్ ఉద్యోగాలు రానున్నాయి.

44
విశాఖ స‌ద‌స్సులో రెన్యూ ఒప్పందం
Image Credit : getty

విశాఖ స‌ద‌స్సులో రెన్యూ ఒప్పందం

ఇదిలా ఉంటే రెన్యూ ప‌వ‌ర్ ఏపీలో భారీగా పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకొచ్చింది. విశాఖ‌ప‌ట్నంలో జ‌ర‌గ‌నున్న సీఐఐ పార్ట్‌న‌ర్‌షిప్ స‌మ్మిట్‌లో ఎమ్ఓయూపై సంత‌కం చేయ‌నున్నారు. ఈ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్‌ను పునరుత్పాదక ఇంధన రంగంలో దేశానికి కేంద్రంగా మార్చనున్నాయి అని మంత్రి లోకేష్ చెప్పుకొచ్చారు.

About the Author

NV
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు.
ఆంధ్ర ప్రదేశ్
విశాఖపట్నం
నారా లోకేష్
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved