MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Dussehra Holidays : దసరా సెలవులు మరో మూడ్రోజులు పెరిగాయోచ్.. తెలుగు స్టూడెంట్స్ ఇక పండగ చేస్కొండి

Dussehra Holidays : దసరా సెలవులు మరో మూడ్రోజులు పెరిగాయోచ్.. తెలుగు స్టూడెంట్స్ ఇక పండగ చేస్కొండి

Dussehra Holidays : అనుకున్నదే జరిగింది…  ఆంధ్ర ప్రదేశ్ లో దసరా సెలవులు మరో మూడ్రోజులు పెరిగాయి. మరి ఇప్పుడు దసరా సెలవులు ఎప్పట్నుంచి ఎప్పటివరకో తెలుసా? 

3 Min read
Arun Kumar P
Published : Sep 19 2025, 05:07 PM IST| Updated : Sep 19 2025, 05:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్
Image Credit : getty

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్

Dussehra Holidays : ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులు ఎగిరిగంతేసే ప్రకటన చేసింది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే దసరా సెలవులను 9 రోజులు ఇవ్వనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే... కానీ వాటిని మరో రెండ్రోజులు పెంచింది. అంతేకాదు ఈ పెంచిన సెలవులకు ఇంకో ఆదివారం అదనంగా యాడ్ అయ్యింది. దీంతో మొత్తంగా దసరా సెలవులు 9 నుండి 12 రోజులకు పెరిగాయి. ఇలా దసరా సెలవుల పెంపుపై ఏపీ విద్యాశాఖమంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికన కీలక ప్రకటన చేశారు.

25
ఏపీలో పెరిగిన దసరా సెలవులు
Image Credit : Getty

ఏపీలో పెరిగిన దసరా సెలవులు

ఇప్పటికే ప్రకటించినట్లు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు దసరా సెలవులు సెప్టెంబర్ 24 నుండి కాకుండా ముందుగానే ప్రారంభం అవుతాయని విద్యాశాఖమంత్రి వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రులే కాదు ఉపాధ్యాయులు కూడా దసరా సెలవులు పెంచాలని కోరుతున్నట్లు తనకు సమాచారం అందిందన్నారు లోకేష్. పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల 22 నుండి ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు తన దృష్టికి తీసుకొచ్చారని లోకేష్ తెలిపారు. వారి కోరిక మేరకు విద్యా శాఖ అధికారులతో చర్చించి సెలవుల పొడిగింపుపై నిర్ణయం తీసుకున్నట్లు లోకేష్ వెల్లడించారు.

పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల 22 నుండి ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు నా దృష్టికి తీసుకొచ్చారు. వారి కోరిక మేరకు విద్యా శాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 22 నుండి అక్టోబర్ 2 వరకూ దసరా పండుగ సెలవులు ఇవ్వాలని నిర్ణయించాం. pic.twitter.com/SpUJldmwiH

— Lokesh Nara (@naralokesh) September 19, 2025

Related Articles

Related image1
Dussehra Holidays : ఆ స్కూల్స్ స్టూడెంట్స్ కి రేపట్నుంచే దసరా సెలవులు ప్రారంభం
Related image2
Dussehra Holidays : తెలుగు స్టూడెంట్స్ కి దసరా సెలవులు పెరుగుతాయా..?
35
ఏపీలో కూడా సెప్టెంబర్ 20 నుండే దసరా సెలవులు
Image Credit : Getty

ఏపీలో కూడా సెప్టెంబర్ 20 నుండే దసరా సెలవులు

సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు దసరా సెలవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు లోకేష్ వెల్లడించారు. అంటే తెలంగాణలో మాదిరిగానే ఏపీలో కూడా రేపు(శనివారం) ఒక్కరోజే స్కూళ్లు నడిచేంది... సెప్టెంబర్ 21 ఆదివారం నుండి సెలవులు ప్రారంభం అవుతాయి. తెలంగాణలో దసరా తర్వాతిరోజు అక్టోబర్ 3 వరకు సెలవులుంటే ఏపీలో మాత్రం దసరా వరకే సెలవులు కొనసాగుతాయి... తర్వాతిరోజు అంటే అక్టోబర్ 3న స్కూళ్లు తిరిగి ప్రారంభం అవుతాయి.

45
తెలంగాణలో కూడా ఓరోజు ముందే దసరా సెలవులు ప్రారంభం
Image Credit : getty

తెలంగాణలో కూడా ఓరోజు ముందే దసరా సెలవులు ప్రారంభం

తెలంగాణలో మరీముఖ్యంగా హైదరాబాద్ లో కార్పోరేట్, ఐటీ ఉద్యోగుల పిల్లలు చదివే ప్రైవేట్ స్కూళ్ళకి ప్రతి శని, ఆదివారం సెలవు ఉంటుంది. తల్లిదండ్రులకు వీకెండ్ లో రెండ్రోజులు సెలవు ఉంటుంది కాబట్టి వారితో గడిపేందుకు పిల్లలకు కూడా సెలవులు ఇస్తుంటారు. ఇలా వీకెండ్ లో రెండ్రోజులు సెలవులిచ్చే స్కూళ్లు హైదరాబాద్ లో చాలా ఉన్నాయి. అలాంటి విద్యాసంస్థల్లో చదివే స్టూడెంట్స్ కి దసరా సెలవులు ఓరోజు ముందుగానే అంటే సెప్టెంబర్ 20 నుండే ప్రారంభం అవుతాయి.

ఇక మరికొన్ని ప్రైవేట్ స్కూళ్లలో ఇవాళ్టితో (సెప్టెంబర్ 19) పరీక్షలు ముగుస్తున్నాయి. కాబట్టి రేపు చివరి వర్కింగ్ డే కాబట్టి దసరా, బతుకమ్మ వేడుకల నిర్వహించేందుకు ప్లాన్ చేశాయి. అంటే ఈ స్కూల్ విద్యార్థులకు కొద్దిసేపు దసరా వేడుకల తర్వాత ఇంటికి పంపిస్తారు. ఎలాంటి క్లాసులు, పరీక్షలు ఉండవు... కాబట్టి ఓ రకంగా ఇది సెలవు అనే చెప్పాలి. ఇలా సెప్టెంబర్ 20 శనివారం చాలా విద్యాసంస్థల్లో దసరా సెలబ్రేషన్స్ ఉన్నాయి.

ఇలా దసరా పండగ సెలవులు ప్రారంభం అవుతుండటంతో హైదరాబాద్ లో చదివే ఏపీ విద్యార్థులు, పేరెంట్ప్ ఆదివారం నుండే స్వస్థలాలకు తరలివెళ్లనున్నారు. ఇప్పుడు ఏపీలో కూడా ముందుగానే సెలవులు వస్తుండటంతో విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాలతో పాటు ఇతర పట్టణాల్లో రద్దీ పెరగనుంది. హైదరాబాద్ నుండి వచ్చినవారితో పాటు ఈ నగరాల నుండి సొంతూళ్లకు వెళ్లేవారితో ప్రభుత్వ, ప్రైవేట్ రవాణా వ్యవస్థలు రద్దీగా మారనున్నాయి.

55
దసరా సెలవుల్లో స్పెషల్ క్లాసులొద్దు... విద్యాసంస్థలకు సర్కార్ వార్నింగ్
Image Credit : iSTOCK

దసరా సెలవుల్లో స్పెషల్ క్లాసులొద్దు... విద్యాసంస్థలకు సర్కార్ వార్నింగ్

సిలబస్ కాలేదనో, మంచి ర్యాంకులు సాధించేలా విద్యార్థులను రెడీ చేస్తామని చెబుతూ కొన్ని విద్యాసంస్థలు సెలవుల్లో క్లాసులు, స్టడీ అవర్స్ నిర్వహిస్తుంటారు. ఇలా దసరా సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ హెచ్చరిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూల్స్ అయితే సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 3 వరకు.. జూనియర్ కాలేజీలు అయితే సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 5 వరకు సెలవులు ఇవ్వాల్సిందేనని... విద్యార్థులకు క్లాసులకు రావాలని ఒత్తిడి చేయరాదని ప్రభుత్వం సూచిస్తోంది. కావాలంటే విద్యార్థులకు సెలవుల్లో చదువునేందుకు హోంవర్క్ ఇవ్వాలని సూచిస్తోంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్
విశాఖపట్నం
విజయవాడ
పండుగలు
భారతదేశంలో ప్రభుత్వ సెలవులు

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved