MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Andhra Pradesh
  • Free Bus: ఏపీలో ఉచిత‌ బస్సు ప్ర‌యాణం ఎప్ప‌టి నుంచి? ఏ బ‌స్సుల్లో ఉచితం? పూర్తి వివ‌రాలు ఇవిగో

Free Bus: ఏపీలో ఉచిత‌ బస్సు ప్ర‌యాణం ఎప్ప‌టి నుంచి? ఏ బ‌స్సుల్లో ఉచితం? పూర్తి వివ‌రాలు ఇవిగో

AP Free Bus Travel Scheme: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందించ‌డం కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం స్త్రీ శక్తి పథకం తీసుకొచ్చింది. ఫ్రీ బ‌స్సు జ‌ర్నీ అందిస్తున్న స్త్రీ శక్తి పథకం పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 14 2025, 04:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
స్త్రీ శ‌క్తి ప‌థ‌కం : ఏపీలో మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్రయాణం
Image Credit : Google gemini AI

స్త్రీ శ‌క్తి ప‌థ‌కం : ఏపీలో మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్రయాణం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించేందుకు ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతోంది. ఈ పథకం ద్వారా మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవ‌చ్చు.

రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి ఆగస్టు 4న ప్రకటించిన విధంగా, ఈ పథకం కూటమి ప్రభుత్వ సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అమలు చేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఏపీ ఉచిత బ‌స్సు ప్ర‌యాణం ఏ బ‌స్సుల్లో ఉంటుంది? గుర్తింపు కార్డులు ఏవి ఉండాలి?
Image Credit : Gemini Ai

ఏపీ ఉచిత బ‌స్సు ప్ర‌యాణం ఏ బ‌స్సుల్లో ఉంటుంది? గుర్తింపు కార్డులు ఏవి ఉండాలి?

స్త్రీ శక్తి పథకం కింద ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తోంది. వాటిలో:

  • పల్లె వెలుగు
  • అల్ట్రా పల్లె వెలుగు
  • సిటీ ఆర్డినరీ
  • మెట్రో ఎక్స్‌ప్రెస్
  • ఎక్స్‌ప్రెస్

అయితే, తిరుమల-తిరుపతి మధ్య సప్తగిరి బస్సులు, నాన్ స్టాప్ బస్సులు, అంతర్రాష్ట్ర సర్వీసులు, సూపర్ లగ్జరీ, ఏసీ, స్టార్ లైనర్, ఆల్ట్రా డీలక్స్ బస్సులు ఈ పథకం నుంచి మిన‌హాయించారు. అలాగే, ఇతర రాష్ట్రాల మధ్య న‌డిచే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణం ఉండ‌దు.

మహిళలు స్త్రీ శ‌క్తి పథకంలో భాగంగా ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచితంగా ప్రయాణించడానికి ఆధార్, ఓటర్ ఐడీ లేదా రేషన్ కార్డు వంటి గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. జీరో ఫేర్ టికెట్ ద్వారా ఉచిత ప్రయాణం అందించ‌నున్నారు.

Related Articles

Related image1
WhatsApp Spying In Divorce Cases: విడాకుల కేసులో వాట్సాప్ స్పై చాట్ సాక్ష్యం చెల్లుతుందా?
Related image2
Pulivendula: జగన్ కంచుకోట బద్దలు.. పులివెందులలో టీడీపీ ఎలా చ‌క్రం తిప్పింది
35
స్త్రీ శ‌క్తి ప‌థ‌కం నిబంధ‌న‌లు, భద్రతా ఏర్పాట్లు
Image Credit : X-@ncbn

స్త్రీ శ‌క్తి ప‌థ‌కం నిబంధ‌న‌లు, భద్రతా ఏర్పాట్లు

రద్దీ పెరగకుండా ప్రభుత్వం అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు, మహిళా కండక్టర్ల కోసం బాడీ వేర్ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. బస్టాండ్లలో ఫ్యాన్లు, కుర్చీలు, తాగునీరు, టాయిలెట్ సదుపాయాలను మెరుగుపరచే చర్యలు చేపట్టారు.

కండక్టర్లు జీరో టికెట్ల నిర్వహణలో శిక్షణ పొందారు. ప్రయాణం ఎక్కడి నుండి ఎక్కడికి జరిగిందో జాగ్రత్తగా నమోదు చేయాల్సి ఉంటుంది, దీని ద్వారా ఆర్థికంగా ప్రభుత్వం APSRTC కి తిరిగి చెల్లిస్తుంది.

45
స్త్రీ శక్తి పథకంతో మ‌హిళ‌ల‌కు ప్ర‌యోజ‌నాలు
Image Credit : APSRTC

స్త్రీ శక్తి పథకంతో మ‌హిళ‌ల‌కు ప్ర‌యోజ‌నాలు

ఈ పథకం ద్వారా మహిళలు విద్య, ఉద్యోగం, వ్యాపార ప్రయాణాలకు సౌకర్యం పొందుతారు. పేద, మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక భారం తగ్గుతుంది. యువత, బాలికలు చదువుల కోసం స్కూళ్లు, కాలేజీల‌కు వెళ్ళడానికి ఉచిత ర‌వాణా సౌక‌ర్యం క‌ల్పిస్తుంది. ట్రాన్స్‌జెండర్‌లకు గౌరవం, ఆర్థిక భారం తగ్గుతుంది. స్త్రీ శక్తి పథకం మహిళా సాధికారతకు సహకరిస్తుందని ప్ర‌భుత్వం తెలిపింది.

55
స్త్రీ శ‌క్తి ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న సీఎం చంద్ర‌బాబు
Image Credit : ANI

స్త్రీ శ‌క్తి ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న సీఎం చంద్ర‌బాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగస్టు 15 మధ్యాహ్నం ఉచిత బ‌స్సు పథకాన్ని విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌లో ప్రారంభిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సాంకేతిక సౌకర్యాల్ని సమన్వయం చేసి అమలు చేస్తారు. బస్సుల‌ సంఖ్యను పెంచడం, కొత్త ఎలక్ట్రిక్ బస్సులను చేర్చడం వంటి చర్యలు ఇప్పటికే సిద్ధం చేశారు. మొదటి దశలో 750 బస్సులు అందుబాటులోకి వస్తాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
నారా చంద్రబాబు నాయుడు
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ డబ్బులు పడేది ఎప్పుడంటే?
Recommended image2
Amaravati Real Estate: అమరావతిలో అప్పుడు రూ.16 లక్షలు పెడితే.. ఇప్పుడు రూ.1 కోటి! మైండ్ బ్లాకింగ్ రియల్ ఎస్టేట్ లెక్కలు
Recommended image3
Now Playing
APకి బ్రాండ్ అంబాసిడర్ CBN స్పీచ్ అదరగొట్టిన నిమ్మల| Nimmala Ramanaidu Speech | NTR Bharosa Pensions
Related Stories
Recommended image1
WhatsApp Spying In Divorce Cases: విడాకుల కేసులో వాట్సాప్ స్పై చాట్ సాక్ష్యం చెల్లుతుందా?
Recommended image2
Pulivendula: జగన్ కంచుకోట బద్దలు.. పులివెందులలో టీడీపీ ఎలా చ‌క్రం తిప్పింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved