MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Chandrababu Naidu: మందు బాబులకు భారీ షాకిచ్చిన చంద్రబాబు ప్రభుత్వం!

Chandrababu Naidu: మందు బాబులకు భారీ షాకిచ్చిన చంద్రబాబు ప్రభుత్వం!

ఏపీలో ప్రభుత్వ పరిధిలో లేని మద్యం బ్రాండ్ల విక్రయాలపై నిషేధం విధించాలంటూ సీఎం చంద్రబాబు అబ్కారీ శాఖను ఆదేశించారు. కొత్త విధానం వల్ల ధరలు తగ్గనున్నాయి.

2 Min read
Author : Bhavana Thota
Published : Jul 15 2025, 09:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
మందు బాబులకు పెద్ద షాక్
Image Credit : ANI

మందు బాబులకు పెద్ద షాక్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మందు బాబులకు పెద్ద షాక్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా తమ లెక్కల్లో లేని మద్యం బ్రాండ్ల విక్రయాలను వెంటనే ఆపేయాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. తాజాగా జరిగిన అబ్కారీ శాఖ సమీక్షా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని అధికారులకు వివరించారు.

27
నూతన మద్యం విధానం
Image Credit : Getty

నూతన మద్యం విధానం

ఈ సమావేశంలో ముఖ్యంగా నూతన మద్యం విధానం అమలుపై చర్చ జరిగింది. గత ప్రభుత్వ కాలంలో రాష్ట్రం వ్యాప్తంగా మద్యం దుకాణాలను ప్రభుత్వం నిర్వహించేది. అయితే టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని పూర్తిగా మారుస్తూ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 2024 నుంచి అమలులోకి వచ్చిన ఈ పాలసీ ప్రకారం, మద్యం అమ్మకాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పారు.

Related Articles

Related image1
Chandrababu Naidu: రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు.. చంద్ర‌బాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్
Related image2
Chandrababu: నీళ్ల గొడవలు వద్దు.. బనకచర్ల ప్రాజెక్టు కామెంట్స్ పై రేవంత్ కు చంద్రబాబు కౌంటర్
37
నాణ్యమైన మద్యం బ్రాండ్లు
Image Credit : our own

నాణ్యమైన మద్యం బ్రాండ్లు

ఈ విధానంతో నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులోకి వచ్చాయని, మార్కెట్‌లో పారదర్శకత పెరిగిందని చంద్రబాబు అన్నారు. అయితే మార్కెట్‌లో నకిలీ లేదా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బ్రాండ్లు పెద్ద మొత్తంలో అమ్మకాలు జరుగుతున్నట్లు గుర్తించి, వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ తరహా బ్రాండ్లు రాష్ట్ర మద్యం విధానానికి మచ్చ కలిగించకుండా నియంత్రించాలని స్పష్టం చేశారు.

47
ఎలాంటి టాక్స్‌ పేమెంట్ లేకుండా
Image Credit : freepik

ఎలాంటి టాక్స్‌ పేమెంట్ లేకుండా

అంతేకాకుండా, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండే బ్రాండ్లకే రాష్ట్రంలో అనుమతి ఉండాలని సీఎం తెలిపారు. నకిలీ మద్యం, ఎలాంటి టాక్స్‌ పేమెంట్ లేకుండా అమ్మే మద్యం వంటి అంశాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని వివరించారు. నాటుసారా, నాన్ డ్యూటీ పేయిడ్ లిక్కర్ అమ్మకాలు పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు.

57
రూ.10 నుంచి రూ.100 వరకు తగ్గుదల
Image Credit : freepik

రూ.10 నుంచి రూ.100 వరకు తగ్గుదల

ఇక మద్యం ధరల విషయానికి వస్తే, కొత్త విధానం వల్ల వినియోగదారులపై భారం కొంత తగ్గినట్టు అబ్కారీ శాఖ వివరించింది. అధికారుల వివరాల ప్రకారం, గత పాలనతో పోలిస్తే మద్యం ధరలు రూ.10 నుంచి రూ.100 వరకు తగ్గాయి. ఈ తగ్గింపుతో ఏటా సగటు లిక్కర్ వినియోగదారుడిపై పడే భారం నెలకు రూ.116 కోట్లు తగ్గినట్టు అధికారులు తెలిపారు.

ఇది కేవలం ధరల విషయానికి మాత్రమే పరిమితమైన విషయం కాదు. ప్రభుత్వం ఈ మార్పుల ద్వారా ఆదాయాన్ని కూడా పెంచుకోవడంలో విజయవంతమైందని చంద్రబాబు పేర్కొన్నారు. నూతన విధానంతో, లిక్కర్ అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరిగిందని తెలిపారు.

67
30 ప్రధాన బ్రాండ్ల ధరలు
Image Credit : freepik

30 ప్రధాన బ్రాండ్ల ధరలు

పక్కరాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలతో పోలిస్తే ఏపీలో విక్రయిస్తున్న 30 ప్రధాన బ్రాండ్ల ధరలు తక్కువగా ఉన్నట్లు అధికారుల నివేదికలో వెల్లడైంది. ఇది వినియోగదారుల నష్టాన్ని తగ్గించడమే కాకుండా, అక్రమ రవాణా, బ్లాక్ మార్కెట్‌ను కూడా అడ్డుకుంటుందని అధికారులు పేర్కొన్నారు.

ఈ సమీక్ష సందర్భంగా మరో ముఖ్యమైన అంశం చర్చకు వచ్చింది. మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూమ్‌ల ఏర్పాటుపై ప్రతిపాదన ముందుకు వచ్చింది. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, ఆ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని సీఎం సూచించారు. పర్మిట్ రూమ్‌ల ఏర్పాటుతో రోడ్లపై మద్యం తాగే పరిస్థితులు తగ్గిపోతాయని అధికారులు అభిప్రాయపడ్డారు. ఇది ప్రజా శాంతిభద్రతలకూ ఉపయోగపడే అంశమని భావిస్తున్నారు.

77
ధరలను నియంత్రించడం
Image Credit : social media

ధరలను నియంత్రించడం

ఈ కొత్త విధానం మద్యం పరంగా ప్రభుత్వ పాలనలో ఓ కీలక మలుపు అని చెప్పొచ్చు. నాణ్యతపై శ్రద్ధ పెట్టడం, ధరలను నియంత్రించడం, ఆదాయాన్ని పెంచడం,  వినియోగదారులపై భారం తగ్గించడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం మద్యం పాలసీలో వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నట్లు కనిపిస్తోంది.

ఇకపై ఏపీలో మద్యం వినియోగదారులకు నాణ్యమైన బ్రాండ్లు, తక్కువ ధరలు, మరింత నియంత్రిత అందుబాటులో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పర్మిట్ రూమ్‌లను ఏర్పాటు చేసే దిశగా జరిగే నిర్ణయం రాష్ట్రంలో మద్యం వినియోగ శైలి మీద కూడా ప్రభావం చూపిస్తుందని అధికారులు చెబుతున్నారు.

About the Author

BT
Bhavana Thota
భావన మహిళా జర్నలిస్ట్. ఈమె 10 ఏళ్లుగా పాత్రికేయరంగంలో ఉన్నారు. స్థానిక వార్తలు మొదలుకుని అంతర్జాతీయ వార్తల దాకా ఏ అంశంపై అయినా సులభంగా అర్థం అయ్యేలా కథనాలు రాయగలగడం భావన ప్రత్యేకత. ఈమె ఈనాడులో దాదాపు ఆరేళ్లు పని చేశారు. తొలివెలుగు, ఆర్టీవీలోనూ ఈమె పలు కేటగిరీలకు సబ్ ఎడిటర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఆమె ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్
నారా చంద్రబాబు నాయుడు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Free Bus Travel : మహిళలు, దివ్యాంగులతో పాటు వీరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం
Recommended image2
వెంక‌న్న భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌.. ముంద‌స్తు బుకింగ్ లేకుండానే ప్ర‌త్యేక‌ ద‌ర్శ‌నం, నేరుగా టికెట్‌
Recommended image3
తిరుమల లడ్డూను చెక్ చేసేందుకు 'ఇ-నోస్' ఇ-టంగ్'.. ఎలా పనిచేస్తాయో తెలుసా..?
Related Stories
Recommended image1
Chandrababu Naidu: రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు.. చంద్ర‌బాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్
Recommended image2
Chandrababu: నీళ్ల గొడవలు వద్దు.. బనకచర్ల ప్రాజెక్టు కామెంట్స్ పై రేవంత్ కు చంద్రబాబు కౌంటర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved