MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Andhra pradesh: ఏపీలో 3 కొత్త జిల్లాలు.. ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో ఈ ప్రాంతాల్లో అభివృద్ధి ప‌రుగులు ఖాయం

Andhra pradesh: ఏపీలో 3 కొత్త జిల్లాలు.. ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో ఈ ప్రాంతాల్లో అభివృద్ధి ప‌రుగులు ఖాయం

Andhra pradesh: జిల్లాల పున‌ర్విభ‌జ‌న‌కు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీంతో జిల్లాల సంఖ్య 28కి చేరింది. కొత్త‌గా ఏయే జిల్లాలు వ‌స్తున్నాయి.? దీంతో ఏం జ‌ర‌గ‌నుంది.? లాంటి పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

1 Min read
Author : Narender Vaitla
Published : Dec 30 2025, 11:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏపీ జిల్లాల పునర్విభజనపై క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
Image Credit : Andhra pradesh

ఏపీ జిల్లాల పునర్విభజనపై క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజనపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు అధికారికంగా ఆమోదం లభించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 28కి చేరనుంది. దీనికి సంబంధించి తుది గెజిట్ నోటిఫికేషన్‌ను రెండు రోజుల్లో విడుదల చేయనున్నారు.

25
మూడు కొత్త జిల్లాలు – మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం
Image Credit : ANI

మూడు కొత్త జిల్లాలు – మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం

కేబినెట్ నిర్ణయం ప్రకారం మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం కేంద్రాలుగా మూడు కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. తొలుత రెండు జిల్లాలకే పరిమితమవాలని భావించిన ప్రభుత్వం, మన్యం ప్రాంత ప్రజల విజ్ఞప్తుల నేపథ్యంలో రంపచోడవరం జిల్లాకు కూడా ఆమోదం తెలిపింది. దీంతో గిరిజన ప్రాంతాలకు పరిపాలనా సేవలు మరింత చేరువ కానున్నాయి.

Related Articles

Related image1
వెండి కొనడం ఆలస్యమైందని బాధపడుతున్నారా.? ఏం బాధ‌ప‌డ‌కండి, అస‌లు క‌థ ముందుంది
Related image2
Wine Shop: మందు బాబుల‌కు కిక్కిచ్చే న్యూస్‌.. రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు వైన్స్ ఓపెన్
35
జిల్లాల సరిహద్దుల్లో కీలక మార్పులు
Image Credit : our own

జిల్లాల సరిహద్దుల్లో కీలక మార్పులు

పునర్విభజనలో భాగంగా పలు నియోజకవర్గాలు ఇతర జిల్లాల్లో కలపాలని మంత్రివర్గం నిర్ణయించింది.

* రాయచోటిని కొత్తగా ఏర్పడే మదనపల్లె జిల్లాలోకి మార్చారు.

* రాజంపేటను కడప జిల్లాలో విలీనం చేశారు.

* రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలో కలిపారు.

* గూడూరును తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లాకు మార్చారు

ఈ మార్పులు ప్రజల దీర్ఘకాలిక డిమాండ్లను పరిగణలోకి తీసుకుని చేసినవేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.

45
కొత్త రెవెన్యూ డివిజన్లు, పరిపాలనా సౌలభ్యమే లక్ష్యం
Image Credit : Getty

కొత్త రెవెన్యూ డివిజన్లు, పరిపాలనా సౌలభ్యమే లక్ష్యం

జిల్లాల మార్పులతో పాటు కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. బనగానపల్లె, అడ్డరోడ్డు వంటి ప్రాంతాలను డివిజన్లుగా ప్రకటించారు. ఆదోనిని రెండు మండలాలుగా విభజించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పరిపాలనా భారాన్ని తగ్గించడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని మంత్రులు వెల్లడించారు. దీంతో ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెంద‌డంతో పాటు, రియ‌ల్ ఎస్టేట్ బూమ్ ఖాయ‌మ‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

55
ప్రజా ప్రయోజనాలే ప్రాధాన్యం
Image Credit : X/Telugu Desam Party

ప్రజా ప్రయోజనాలే ప్రాధాన్యం

మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాయచోటి మార్పు తప్పనిసరి పరిస్థితుల్లో జరిగిందని, ఒక్క నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా కొనసాగించడం సాధ్యం కాదని తెలిపారు. ప్రజల అభిప్రాయాలకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. 2025లో అనేక పాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టామని, 2026లో మరింత వేగంగా పనిచేయాలని అధికారులకు సూచించారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
నారా చంద్రబాబు నాయుడు
అమరావతి

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Anganwadi Workers on Chandrababu:జీతాలుపెంచకపోతే ప్రాణాలు తీసుకోవడానికి సిద్దం | Asianet News Telugu
Recommended image2
Now Playing
ధర్నాలతో సమస్యలు పరిస్కారం కావు: Gummadi Sandhyarani on Anganwadi Workers | Asianet News Telugu
Recommended image3
Now Playing
Somi Reddy fire on Kakani: సిగ్గుందా కాకాణి?నా వెయ్యి కోట్లు ఏమయ్యాయి? | TDP | Asianet News Telugu
Related Stories
Recommended image1
వెండి కొనడం ఆలస్యమైందని బాధపడుతున్నారా.? ఏం బాధ‌ప‌డ‌కండి, అస‌లు క‌థ ముందుంది
Recommended image2
Wine Shop: మందు బాబుల‌కు కిక్కిచ్చే న్యూస్‌.. రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు వైన్స్ ఓపెన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved