Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ జగన్ పాత్రలో జీవా జీవించేశాడు.. ఎమోషనల్ గా 'యాత్ర 2' టీజర్

ఎలక్షన్స్ కి కొన్ని రోజులు సమయం మాత్రమే ఉండడంతో డైరెక్టర్ మహి వి రాఘవ్ జోరు పెంచారు. తాజాగా యాత్ర 2 టీజర్ ని రిలీజ్ చేశారు. వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి, జగన్ పాత్రలో తమిళ నటుడు జీవా నటిస్తున్న సంగతి తెలిసిందే.

YS Jagan Biopic Yatra 2 movie teaser out now dtr
Author
First Published Jan 5, 2024, 12:16 PM IST

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన యాత్ర చిత్రం 2019లో విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు రిలీజ్ కావడంతో ఆ చిత్రం వైఎస్ జగన్ కి, వైసీపీకి బాగా ఉపయోగపడిందనే భావన చాలా మందిలో ఉంది. 

యాత్ర దర్శకుడు మహి వి రాఘవ్ మరోసారి ఎన్నికల ముందు సందడి చేసేందుకు యాత్ర 2 చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. యాత్ర 2లో వైఎస్ఆర్ మరణం.. వైఎస్ జగన్ ఏపీ రాజకీయాల్లో ఎదిగిన విధానం హైలైట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే జగన్ చేసిన పాద యాత్రని ఎమోషనల్ గా మహి వి రాఘవ్ చూపించబోతున్నారు.   

ఎలక్షన్స్ కి కొన్ని రోజులు సమయం మాత్రమే ఉండడంతో డైరెక్టర్ మహి వి రాఘవ్ జోరు పెంచారు. తాజాగా యాత్ర 2 టీజర్ ని రిలీజ్ చేశారు. వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి, జగన్ పాత్రలో తమిళ నటుడు జీవా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే దర్శకుడు మహి వి రాఘవ్ ఆడియన్స్ ని ఎమోషనల్ గా కట్టిపడేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అర్థం అవుతోంది. 

నడి వీధిలో ఒక కళ్ళు లేని వ్యక్తి వైఎస్సార్ ఫోటో పట్టుకుని ఉంటాడు. అటు వైపుగా జగన్ వెళుతూ తన కాన్వాయ్ ని ఆపి ఆ కళ్ళు లేని వ్యక్తితో మాట్లాడడం మొదలు పెడతాడు. అలా టీజర్ ఎమోషనల్ గా ప్రారంభం అవుతుంది. చంద్రబాబు పాత్రని పోలి ఉన్న వ్యక్తి తండ్రి పోయాడనుకుంటే కొడుకు వచ్చాడు అంటూ చెబుతున్న డైలాగులు ఉన్నాయి. 

కాంగ్రెస్ పార్టీ తలుచుకుంటే ఇంకో 100 మంది వైఎస్సార్ లని సృష్టించగలడు. ఏ విషయం అతడికి చెప్పండి. దారిలోకి రాకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించండి అంటూ సోనియాగాంధీ పాత్ర చెబుతున్న డైలాగులు కూడా ఉన్నాయి. జగన్ జైలుకి వెళ్లడం లాంటి సన్నివేశాలు కూడా ఉన్నాయి. జగన్ లక్ష కోట్ల అవినీతి అనేది ఒక అబద్దం మాత్రమే అని దర్శకుడు మహి వి రాఘవ్ చూపించే ప్రయత్నం చేశారు. 

చరిత్ర నన్ను గుర్తుపెట్టుకుంటుందో లేదో నాకు తెలియదు అన్నా.. ఒక వేళ గుర్తుపెట్టుకుంటే తండ్రి కోసం ఇచ్చిన మాట తప్పని కొడుకుగా ఉంటే చాలు అంటూ జీవా చెబుతున్న ఎమోషనల్ డైలాగ్స్ బావున్నాయి. జగన్ బాడీ లాంగ్వేజ్ తో జీవా జీవించేశాడు అనే చెప్పాలి. ఫిబ్రవరి 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు ఖరారు చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios