'యాత్ర' బిజినెస్ ని 'ఎన్టీఆర్' దెబ్బకొట్టాడా..?
ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం కథనాయకుడు కలెక్షన్స్ పరంగా డిజాస్టర్ గా మారిన సంగతి తెలిసిందే. దాంతో ఈ చిత్రం ప్రభావం ఖచ్చితంగా మరో బయోపిక్ యాత్రపై పడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం కథనాయకుడు కలెక్షన్స్ పరంగా డిజాస్టర్ గా మారిన సంగతి తెలిసిందే. దాంతో ఈ చిత్రం ప్రభావం ఖచ్చితంగా మరో బయోపిక్ యాత్రపై పడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా చిత్రం బిజినెస్ విషయంలో ఈ సినిమా ఇబ్బందులు ఎదుర్కొంటుందని అంటున్నారు. కేవలం వైయస్సార్ పార్టీ అభిమానులైన వారు ఈ సినిమా చూస్తారని, వారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ సినిమాకు మంచి బిజినెస్ జరుగుతుందని భావిస్తున్నారు.
దానికి తోడు ఎన్టీఆర్ బయోపిక్ ఎన్నో అంచనాలతో రిలీజ్ అయితే చూసేవాళ్లే కరువు అయ్యారు. అలాంటిది ఓ డాక్యుమెంటరిగా సాగే యాత్ర సినిమా ఎంతవరకూ వర్కవుట్ అవుతుందని అంటున్నారు. అయితే విడుదలైన టీజర్స్, ట్రైలర్స్ ని బట్టి సినిమా బాగానే ఎమోషనల్ గా తీసారని అంటున్నారు. ఎమోషన్ పడితే కనుక పార్టీకే కాక , సినిమాని కొనుక్కున్నవారికి లాభం వస్తుందనటంలో సందేహం లేదు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలో ముఖ్య ఘట్టం అయిన పాదయాత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘యాత్ర’. ఈ బయోపిక్ లో మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వైయస్ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ ఇప్పటికే విడదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఆ క్రేజ్ ఎంతవరకూ చిత్రం రిలీజ్ కు, ఓపినింగ్స్ కు , రిలీజ్ కు ఉపయోగపడుతుందనేది ట్రేడ్ వర్గాలను ఆలోచనలో పడేస్తున్న అంశం.
జగపతిబాబు, సుహాసిని, అనసూయ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను 2019 ఫిబ్రవరి 8న యాత్ర సినిమా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళ మళయాల భాషల్లోనూ యాత్ర సినిమా రిలీజ్ అవుతోంది. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మా సినిమాలను నిర్మించిన విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ బయోపిక్ను నిర్మిస్తున్నారు. పాఠశాల, ఆనందో బ్రహ్మా చిత్రాల దర్శకుడు మహి వి రాఘవ ఈ చిత్రానికి దర్శకుడు.