గ్యాంగ్ స్టర్స్ తో హాల్ నిండితేనే మాంస్టర్ వేటః `కేజీఎఫ్` బిగ్ అప్డేట్
`కేజీఎఫ్2`చిత్ర విడుదలపై అనేక ఊహాగానాలు వెల్లడవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందం స్పందించింది. విడుదలపై క్లారిటీ ఇచ్చింది.త్వరలో ప్రకటించబోతున్నట్టు తెలిపింది.
`కేజీఎఫ్` చిత్రం ఇండియన్ సినిమాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రాల్లో ఒకటి. `కేజీఎఫ్`కి రెండో పార్ట్ గా `కేజీఎఫ్ః ఛాప్టర్ 2` వస్తోంది. యశ్, ప్రశాంత్నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. విడుదలకు సిద్ధంగా ఉంది. జులై 16న సినిమాని విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్తో వాయిదా పడింది. ఇప్పుడు సినిమా విడుదలపై అనేక ఊహాగానాలు వెల్లడవుతున్నాయి.
ఈ నేపథ్యంలో చిత్ర బృందం స్పందించింది. విడుదలపై క్లారిటీ ఇచ్చింది. ఎప్పుడైతే గ్యాంగ్స్టర్స్ తో థియేటర్లు నిండిపోతాయో అప్పుడే మాంస్టర్ వేట కొనసాగుతుంది. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామ`ని చిత్ర బృందం వెల్లడించింది. ఇందులో కేజీఎఫ్ని మాంస్టర్గా, ఆడియెన్స్ ని గ్యాంగ్స్టర్స్ గా వర్ణించారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు సమాచారం.
యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుంది. సంజయ్ దత్, రవీనా టండన్, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెలుగు, కన్నడ, హిందీ, తమిళం, మలయాళంలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.