'కేజీఎఫ్ -2' రిలీజ్ డేట్ పై నిర్మాతల క్లారిటీ
త్వరలో కేజీఎఫ్ పార్ట్ 2 రాబోతుంది. దక్షిణాది సినీ పరిశ్రమను మరో మెట్టు ఎక్కించిన కేజీఎఫ్కు సీక్వెల్గా వస్తోందీ సినిమా. ఈ సినిమాలో రాకీ భాయ్ను ఢీ కొట్టేందుకు అధీరాగా వస్తున్నాడు బాలీవుడ్ హీరో సంజయ్దత్. మరో బాలీవుడ్ నటి రవీనాటాండన్ కీలక పాత్రలో నటిస్తుంది.
మహారాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 22 నుంచి థియోటర్స్ రీఓపినింగ్ కు ఫర్మిషన్ ఇచ్చింది. దాంతో బాలీవుడ్ సినిమాలు హడావిడిగా రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకునే పనిలో పడ్డాయి. అయితే థియోటర్స్ తెరిచిన వెంటనే జనం వస్తారనే నమ్మకం లేదు. భయాలు పోయి..థియోటర్ కు అలవాటు పడటానికి టైమ్ పడుతుంది. దాంతో పెద్ద నిర్మాతలు కాస్త అటూ ఇటూగా ఆలోచనలో పడ్డారు. అయితే అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, రనవీర్ సింగ్, రణబీర్ కపూర్, షాహిద్ కపూర్ వంటి స్టార్స్ తమ సినిమాల రిలీజ్ డేట్స్ ప్రకటించారు. ఈ క్రమంలో సౌత్ లోని పెద్ద సినిమాలు కూడా తమ సినిమాల రిలీజ్ డేట్స్ ప్లాన్స్ ప్రకటించే దిసగా ప్రయత్నాలు మొదలెట్టాయి. అలాంటి వాటిల్లో కేజీ ఎఫ్ 2, ఆర్ ఆర్ ఆర్ ఉన్నాయి.
ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ విషయమై క్లారిటీ ఇవ్వలేదు కానీ కేజీఎఫ్ 2 మాత్రం తాను ఇంతకు ముందు ప్రకటించిన డేట్ కు కట్టుబడి ఉంటామని అఫీషియల్ గా తెలియచేసింది. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ సూపర్ హిట్ తో ఆ సినిమా కి సీక్వెల్ గా కేజీఎఫ్ 2 సినిమాని నిర్మిస్తోంది. కరోనాతో పాటు ఇతర కారణాలతో విడుదల వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రాన్ని 2022 ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు దర్శకుడు ప్రశాంత్ నీల్ ట్విట్టర్ వేదికగా ఆ మధ్యన కేజీఎఫ్ చాప్టర్ 2 పోస్టర్ ని విడుదల చేశాడు. ఆ తేదీ మార్చటం లేదు. దానికే కట్టుబడి ఉన్నామని తెలియచేసారన్నమాట.
సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా యష్ కి జోడిగా శ్రీనిధి శెట్టి కనిపించబోతుంది. ప్రస్తుతం కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ హీరోగా సలార్ చిత్రాన్ని తెరకేక్కిస్తున్నాడు. ఆ సినిమా కూడా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకొని వచ్చే ఏడాది విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరుపుతున్నారు చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా డ్యూరేషన్ గురించి ఇంటరెస్టింగ్ చర్చ జరుగుతుంది. ఈ సినిమా డ్యూరేషన్ 2గంటల 52నిముషాలు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రశాంత్ నీల్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు.
దక్షిణాది సినీ పరిశ్రమను మరో మెట్టు ఎక్కించిన కేజీఎఫ్కు సీక్వెల్గా వస్తోందీ సినిమా. ఈ సినిమాలో రాకీ భాయ్ను ఢీ కొట్టేందుకు అధీరాగా వస్తున్నాడు బాలీవుడ్ హీరో సంజయ్దత్. మరో బాలీవుడ్ నటి రవీనాటాండన్ కీలక పాత్రలో నటిస్తుంది. కేజీఎఫ్ ఛాప్టర్ 1 భారీ విజయం సాధించడంతో ఛాప్టర్ 2పై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రకాశ్ రాజ్, రావు రమేష్ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.