Asianet News TeluguAsianet News Telugu

నిఖిల్ కు నాలుగు కోట్ల సమస్య, తేలటం కష్టమే!

నిఖిల్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘అర్జున్ సురవరం’.

why Nikhil's Arjun Suravaram postponements?
Author
Hyderabad, First Published Jun 24, 2019, 2:59 PM IST

నిఖిల్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘అర్జున్ సురవరం’.చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మొదట ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలని అనుకుంటే.. కొన్ని కారణాల వల్ల అది కాస్తా మే 17కు వాయిదా పడింది. అయితే నిర్మాతలు ప్రకటించిన ఆ తేదీన కూడా సినిమా విడుదల కాలేదు. వరసగా వాయిదాలు పడుతూ వస్తోంది. దాంతో అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనేది పెద్ద క్వచ్చిన్ మార్క్ గా మారింది. హీరో నిఖిల్ సైతం ఈ విషయమై క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. 

అయితే అందుతున్న సమాచారం మేరకు ఇక ఈ సినిమా రిలీజ్ కష్టమే అని తెలుస్తోంది.  అందుకు కారణం ఈ చిత్రం ఎదుర్కొంటున్న ఫైనాన్స్ సమస్యలే అంటున్నారు. ఈ సినిమా రిలీజ్ అవ్వాలంటే పెండింగ్ డ్యూస్ నాలుగు కోట్లు వరకూ చెల్లించారని సమాచారం. దాంతో పెద్దగా బజ్ లేని ఈ సినిమా రిలీజ్ అయ్యి ఏ మేరకు ఆడుతుందో అని నిర్మాతలు సందేహపడుతున్నారట. మరో నాలుగు కోట్లు పెడితే అవి కూడా పోతాయని వాళ్ల సన్నిహితులు హెచ్చరిస్తున్నారట.

దాంతో ఆ నాలుగు కోట్లు పెట్టే ఇంట్రస్ట్ లేక అలా పెండింగ్ లో పెట్టేసారని, ఎవరైనా ఉత్సాహంతో ముందుకు వస్తే అవుట్ రేటుకు ఫిల్మ్ ఇచ్చేద్దామని ఎదురుచూస్తున్నారని చెప్తున్నారు. ఈ లోగా నిఖిల్ మరో సినిమా ఏదైనా హిట్ కొట్టి మార్కెట్ పెరిగితే ఆ ఊపులో అమ్మేయచ్చు కదా అని ఎదురుచూస్తున్నారట. ఇవన్ని చూస్తూంటే ఇప్పుడిప్పుడే ఈ సినిమా వచ్చే సూచన లేదని చెప్తున్నారు. అసలు రాకపోయినా ఆశ్చర్యం లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

దానికి తోడు ఈ సినిమాకు ముందగా ముద్ర అనే టైటిల్‌ను నిర్ణయించారు. కానీ జగపతిబాబు హీరోగా అదే పేరుతో ఓ సినిమా ఇటీవల రిలీజ్ కావటంతో నిఖిల్ సినిమాకు టైటిల్‌కు మార్చక తప్పలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios