గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)హీరోగా బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) హ్యాట్రిక్ హిట్స్ తీశారు.
ఫుల్ మాస్ అండ్ యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న స్కంథ చిత్రం ప్రమోషన్స్ వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం హైదరాబాద్ శిల్పా కళా వేదికలో స్కంద ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకలకు నందమూరి హీరో బాలకృష్ణ ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ ఈవెంట్ కు బాలయ్య రావటం వెనక కారణం కేవలం బోయపాటితో ఉన్న రిలేషన్ అని అందరూ అనుకున్నారు. అయితే బాలయ్యను రప్పించటం వెనక అసలు కారణం చెప్పారు బోయపాటి శ్రీను.
'స్కంద' ప్రీ రిలీజ్ థండర్ కార్యక్రమానికి బాలకృష్ణను ఆహ్వానించడానికి ప్రధాన కారణం ఏమిటో తన స్పీచ్ లో బోయపాటి శ్రీను వివరించారు. ఆయన మాట్లాడుతూ... ''బాలయ్య గారిలో ఉన్నది వాక్ సుద్ధి. ఆయన ఆశీర్వాదానికి ఎంత అమోఘమైన విలువ ఉంటుందో నాకు తెలుసు. బాలయ్య గారి ఆశీర్వాదంలో మన హితంతో పాటు జన హితం ఉంటుంది. దటీజ్ బాలయ్య. ఈ కార్యక్రమానికి వచ్చిన ఆయన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు'' అని బోయపాటి శ్రీను చెప్పారు.
ఇక బోయపాటి శ్రీను స్పీచ్ బాలయ్య అభిమానులు, మంచి కిక్ ఇస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ''కొంత మంది వ్యక్తులు కాదు, శక్తులు. ఆ శక్తి బాలయ్య. ఆయనకు ఓ పదం అయినా లొంగుతుంది. పాత్ర అయినా లొంగుతుంది. మేం ఓ పాత్రకు ఓ నటుడిని అనుకున్నప్పుడు... మాకు కొత్తగా కనిపిస్తున్నారంటే? వాళ్ళు వందకు వంద శాతం శక్తి ఉన్నవాళ్ళు. అదీ బాలయ్య. ఒక పాత్రను ఇస్తే దానిలో ప్రవేశించి, దానిని లొంగదీసుకుని చేస్తారు. దటీజ్ బాలయ్య'' అని బోయపాటి శ్రీను చెప్పారు.
అంతేకాదు బాలకృష్ణతో 'అఖండ 2' కన్ఫర్మ్ చేశారు. నందమూరి ఫ్యాన్స్కు అవసమైన కిక్ ఇచ్చారు.
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)హీరోగా బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) హ్యాట్రిక్ హిట్స్ తీశారు. 'సింహ', 'లెజెండ్', 'అఖండ' చిత్రాలు భారీ విజయాలు సాధించాయి.
ఇక బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన తాజా సినిమా 'స్కంద'. ది ఎటాకర్... అనేది ఉపశీర్షిక. ఉస్తాద్ రామ్ పోతినేని, శ్రీ లీల జంటగా నటించిన చిత్రమిది. సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.