Asianet News TeluguAsianet News Telugu

మాస్క్ మరచి పబ్లిక్ లోకి వచ్చిన రష్మిక... తప్పు తెలుసుకొని!

అమితాబ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న గుడ్ బై మూవీలో రష్మిక నటిస్తుండగా, ఆ చిత్ర షూటింగ్ కోసం ముంబై వెళ్లడం జరిగింది. ముంబైలో హీరోయిన్స్ అడుగు బయటపెడితే చాలు ఫోటోలు తీసుకోవడానికి కెమెరా మెన్ లు సిద్ధంగా ఉంటారు.

when rashmika mandanna forgot her mask and this was her feeling ksr
Author
Hyderabad, First Published Jul 2, 2021, 9:54 AM IST


స్టార్ హీరోయిన్ రష్మిక మందాన ప్రస్తుతం ముంబైలో ఉన్నారు. అమితాబ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న గుడ్ బై మూవీలో రష్మిక నటిస్తుండగా, ఆ చిత్ర షూటింగ్ కోసం ముంబై వెళ్లడం జరిగింది. ముంబైలో హీరోయిన్స్ అడుగు బయటపెడితే చాలు ఫోటోలు తీసుకోవడానికి కెమెరా మెన్ లు సిద్ధంగా ఉంటారు. అలాగే ఎక్కడికో వెళుతూ కారు దగ్గరకు వచ్చిన రష్మికను ఫోటోలకు పోజులివ్వాలి అంటూ ఫోటోగ్రాఫర్స్ అడిగారు.


 

ఆ సమయంలో రష్మిక మాస్క్ ధరించి లేదు. తాను మాస్క్ మరచిపోయానని తరువాత గ్రహించిన రష్మిక క్రేజీ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చారు. సదరు వీడియో విరాల్ బియాని తన అధికారిక ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేయగా వైరల్ అవుతుంది. ఇక కోవిడ్ నుండి రక్షణ పొందాలి అంటే మాస్క్ తప్పనిసరి అని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాస్క్ లేకుండా బయట తిరిగే సెలెబ్రిటీలను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. 


అందుకే అయ్యో మాస్క్ ధరించడం మరచి తప్పు చేశానే అనే భావనలో రష్మిక అలా ఫీల్ అయ్యారు. ఇక తెలుగులో రష్మిక చేస్తున్న పుష్ప షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. బన్నీ-సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. దీనితో పాటు మరో తెలుగు చిత్రం, మిషన్ మజ్ను అనే హిందీ చిత్రంలో రష్మిక నటిస్తున్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios