మణిరత్నం సినిమాని కొని రిలీజ్ చేసే వాళ్లే లేరా?
తెలుగులో పొన్నియిన్ సెల్వన్ 1 ని దిల్ రాజు భారీగా రిలీజ్ చేశాడు. ఈ సినిమాతో దిల్ రాజుకి నష్టమే మిగిలిందట.
ఒకప్పుడు మణిరత్నం సినిమా అంటే డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్లు ఎగబడేవారు. ఆయన డ్రీమ్ ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్-1 దెబ్బ తినటంతో సీన్ రివర్స్ అయ్యంది. తమిళంలో నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. కానీ తెలుగులో మాత్రం దారుణమైపోయింది. దాంతో ఈ భారీ మల్టీస్టారర్ సీక్వెల్ పొన్నియన్ సెల్వన్-2 (Ponniyin Selvan-2)కు బిజినెస్ అవటం చాలా కష్టంగా మారిందనేది టాక్.
పొన్నియన్ సెల్వన్ 2 ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పొన్నియన్ సెల్వన్ -2లో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిషతోపాటు ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఎపిక్ పీరియడ్ యాక్షన్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్గా విడుదల చేయాలనేది నిర్మాతల ఆలోచన.
తెలుగులో పొన్నియిన్ సెల్వన్ 1 ని దిల్ రాజు భారీగా రిలీజ్ చేశాడు. ఈ సినిమాతో దిల్ రాజుకి నష్టమే మిగిలిందట. ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాని ఆయన వదిలేసాడు అంటున్నారు. దాంతో తమిళ నిర్మాతలే డైరక్ట్ గా తెలుగులో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. అయితే దిల్ రాజు ద్వారా రిలీజ్ చేయాలని చర్చలు జరుపుతున్నట్లు వినికిడి.
ఫస్ట్ పార్టు లాగే పొన్నియన్ సెల్వన్-2 కూడా ఐమాక్స్ ఫార్మాట్లో విడుదల కానుంది. చోళ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే స్టోరీతో వస్తున్న ఈ చిత్రాన్ని మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.పొన్నియిన్ సెల్వన్ పుస్తకం ఆధారంగా తమిళ రాజుల చరిత్రని చూపిస్తూ గ్రాండ్ గా తీసారు ఈ సినిమాని. సినిమా రిలీజ్ కి ముందు భారీ అంచనాలు ఉన్నాయి. దీన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తామని ప్రకటించి పొన్నియిన్ సెల్వన్ 1 గతేడాది రిలీజ్ చేశారు.