Asianet News TeluguAsianet News Telugu

Waltair Veerayya: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్... 

వాల్తేరు వీరయ్య సాంగ్స్ తెలుగు రాష్ట్రాల్లో దుమ్మురేపుతున్నాయి. విడుదలైన మూడు పాటలు ఫ్యాన్స్ కి బాగా నచ్చాయి. తాజాగా విడుదలైన వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేస్తుంది. 
 

waltair veerayya title song gets huge response in youtube
Author
First Published Dec 28, 2022, 8:13 AM IST

వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) విడుదలకు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉంది. ఈ చిత్ర విజయాన్ని చిరంజీవి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయన గత రెండు చిత్రాలు ఆచార్య, గాడ్ ఫాదర్ నిరాశపరిచాయి. ఆచార్య డిజాస్టర్ కాగా, గాడ్ ఫాదర్ పర్లేదు అనిపించింది. గాడ్ ఫాదర్ కమర్షియల్ హిట్ అనిపించుకోలేకపోయింది. ఒక క్లీన్ బ్లాక్ బస్టర్ కొట్టి తానేమిటో నిరూపించాలని చిరంజీవి తాపత్రయపడుతున్నారు. వాల్తేరు వీరయ్య మూవీతో తన సక్సెస్ దాహం తీర్చుకోవాలి అనుకుంటున్నారు. అందులోనూ బాలయ్య నటిస్తున్న వీరసింహారెడ్డి మూవీతో వాల్తేరు వీరయ్య సంక్రాంతి పోరుకు సిద్ధం అవుతుంది. 

వాల్తేరు వీరయ్య విజయం చిరంజీవికి ప్రెస్టేజ్ మేటర్ అయ్యింది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. నిన్న యూనిట్ మెంబర్స్ తో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆల్రెడీ వాల్తేరు వీరయ్య సినిమాను చూశానన్న చిరంజీవి విజయంపై విశ్వాసం ప్రకటించారు. 

చిరంజీవి(Chiranjeevi) మాటలతో పాటు దేవిశ్రీ పాటలు వాల్తేరు వీరయ్య చిత్రంపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఫ్యాన్స్ లో నమ్మకం డబుల్ చేస్తున్నాయి. ఫస్ట్ సింగిల్ గా మాస్ ఐటెం నంబర్ 'బాస్ పార్టీ' విడుదల చేశారు. ఈ సాంగ్ సూపర్ హిట్. ఐటెం నంబర్స్ స్పెషలిస్ట్ అయిన దేవిశ్రీ అద్భుతమైన ట్యూన్ కట్టాడు. సెకండ్ సాంగ్ 'శ్రీదేవి చిరంజీవి' పర్వాలేదు అనిపించింది. అయితే టైటిల్ సాంగ్ మాత్రం దుమ్మురేపుతోంది. 

వాల్తేరు వీరయ్య మూవీలో చిరంజీవి పాత్ర స్వభావం తెలిపేలా అద్బుతంగా టైటిల్ సాంగ్ రూపొందించారు. దేవిశ్రీ ట్యూన్స్ కి చంద్రబోస్ సాహిత్యం తోడు కావడంతో సాంగ్ బాగా ఎలివేట్ అయ్యింది. ఈ సాంగ్ ద్వారా చిరంజీవి మరో గెటప్ కూడా పరిచయం చేశారు. కాగా వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ 22 గంటల్లోనే 5 మిలియన్ వ్యూస్ రాబట్టింది. 6 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన ఈ సాంగ్... యూట్యూబ్ ని షేక్ చేస్తుంది. 

జనవరి 13న వాల్తేరు వీరయ్య విడుదల కానుంది. దర్శకుడు కే ఎస్ రవీంద్ర తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతుంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. రవితేజ కీలక రోల్ చేస్తున్నారు. ఆయన విక్రమ్ సాగర్ ఏసీపీ అనే పవర్ ఫుల్ పోలీస్ రోల్ చేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios