Asianet News TeluguAsianet News Telugu

లూసిఫర్‌ రీమేక్ః సుజిత్‌ ఔట్‌.. వినాయక్‌ ఇన్‌.. చిరు షాకింగ్‌ డిసీషన్‌

`లూసిఫర్‌` రీమేక్‌కి సుజిత్‌ దర్శకత్వం వహించడం లేదట. తన హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌ చేయాలని మాస్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ని రంగంలోకి దించినట్టు తెలుస్తుంది.

vv vinayak will be direct lucifer remake with chiranjeevi arj
Author
Hyderabad, First Published Oct 4, 2020, 5:01 PM IST

మలయాళంలో సూపర్‌ హిట్‌ సాధించిన `లూసిఫర్‌` రీమేక్‌లో చిరంజీవి నటించబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి `సాహో` ఫేమ్‌ సుజిత్‌ దర్శకత్వం వహిస్తారనే వార్తలు వినిపించాయి. ఇంతలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది.

`లూసిఫర్‌` రీమేక్‌కి సుజిత్‌ దర్శకత్వం వహించడం లేదట. తన హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌ చేయాలని మాస్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ని రంగంలోకి దించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే చిరంజీవి, వినాయక్‌ కాంబినేషన్‌లో `ఠాగూర్‌`, `ఖైదీ నెం.150` చిత్రాలు వచ్చాయి. రెండూ బ్లాక్‌ బస్టర్స్ గా, చిరంజీవి కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచాయి. 

ఇప్పుడు ముచ్చటగా మూడోసారి, హ్యాట్రిక్‌ కొట్టేందుకు రెడీ అవుతున్నారట. `లూసిఫర్‌` రీమేక్‌ వినాయక్‌ డైరెక్షన్‌ నటించాలని చిరు నిర్ణయించినట్టు సమాచారం. ఓ రకంగా సుజిత్‌కి హ్యాండిచ్చారనే చెప్పాలి.  ఇదిలా ఉంటే చిరంజీవి హీరోగా వినాయక్‌ రూపొందించిన రెండు సినిమాలు రీమేక్‌. `ఠాగూర్‌` తమిళంలో వచ్చిన `రమణ`కి రీమేక్‌. `ఖైదీ నెం.150` తమిళంలో సూపర్‌ హిట్‌ `కత్తి`కి రీమేక్‌. ఇప్పుడు ఈ సినిమా కూడా రీమేక్‌ కావడం విశేషం. బహుశా రీమేక్‌ సినిమాలను వినాయక్‌ బాగా తెరకెక్కిస్తాడనే నమ్మకంతో చిరు ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడు. 

చిరు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` చిత్రంలో నటిస్తున్నారు. ఆ తర్వాత మెహర్‌ రమేష్‌ డైరెక్షన్‌లో తమిళ హిట్‌ చిత్రం `వేదాలం` రీమేక్‌లో నటించబోతున్నారు. ఆ తర్వాత `లూసిఫర్‌` ఉండనుంది. అయితే ఈ సినిమాకి ముహూర్తం ఫిక్స్ చేశారట. వచ్చే ఏడాదిలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్ర స్క్రిప్ట్ ని రైటర్‌ ఆకుల శివ రెడీ చేస్తున్నారట. దీన్ని రామ్‌చరణ్‌, ఎన్‌వీ ప్రసాద్‌ నిర్మించనున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios