వి.వి.వినాయక్ ఆవిష్కరించిన ‘యమ్6’ ట్రైలర్
విశ్వనాధ్ ఫిలిం ఫ్యాక్టరీ, శ్రీలక్ష్మి వెంకటాద్రి క్రియేషన్స్ బ్యానర్స్పై విశ్వనాధ్ తన్నీరు నిర్మిస్తున్న చిత్రం ‘యమ్6’. ఈ చిత్రం ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ ఆవిష్కరించి చిత్ర యూనిట్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో హీరో ధ్రువ, నిర్మాత విశ్వనాథ్ తన్నీరు పాల్గొన్నారు.
విశ్వనాధ్ ఫిలిం ఫ్యాక్టరీ, శ్రీలక్ష్మి వెంకటాద్రి క్రియేషన్స్ బ్యానర్స్పై విశ్వనాధ్ తన్నీరు నిర్మిస్తున్న చిత్రం ‘యమ్6’. ఈ చిత్రం ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ ఆవిష్కరించి చిత్ర యూనిట్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో హీరో ధ్రువ, నిర్మాత విశ్వనాథ్ తన్నీరు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్మాత విశ్వనాథ్ మాట్లాడుతూ ‘‘వినాయక్గారి చేతులమీదుగా మా ‘యమ్6’ ట్రైలర్ విడుదల కావడం మాకెంతో సంతోషాన్ని కలిగించింది. ఈ సందర్భంగా ఆయనకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ట్రైలర్కి మంచి స్పందన వస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రాన్ని ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఎంతో క్వాలిటీగా నిర్మించాం. దర్శకుడు జైరాం చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. మా హీరో ధ్రువ కొత్తవాడైనప్పటికీ చక్కటి నటనను ప్రదర్శించాడు.
‘యమ్6’ అనే డిఫరెంట్ టైటిల్ని ఈ సినిమాకు ఎందుకు పెట్టామో సినిమా చూస్తే అర్థమవుతుంది. ఈ చిత్రానికే హైలైట్గా నిలిచే ‘ఈ క్షణం...’ అనే మెలోడీ సాంగ్ను మంగళూరు, అరకులోని అందమైన లొకేషన్స్లో చిత్రీకరించడం జరిగిందని నిర్మాత తెలిపారు.
హీరో ధ్రువ మాట్లాడుతూ ‘‘హీరోగా ఇది నా తొలి చిత్రం. అందర్నీ అలరించే విభిన్నమైన పాత్రలు పోషించి ఇండస్ట్రీలో నటుడిగా నాకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవాలన్నది నా చిరకాల కోరిక. నిర్మాత విశ్వనాథ్ తన్నీరు, దర్శకుడు జైరామ్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఎక్కడా ఇబ్బంది పడకుండా నటించగలిగాను. ఈ సినిమాలో అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. నా మొదటి సినిమా ట్రైలర్ను ప్రముఖ దర్శకులు వి.వి.వినాయక్గారు ఆవిష్కరించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు నా ధన్యవాదాలు" అని ధ్రువ తెలిపారు.