స్టార్ హీరో సినిమాపై బ్యాన్!
మలేషియా ప్రభుత్వం విక్రమ్ నటించిన 'మిస్టర్ కెకె' సినిమాను నిషేధించింది. మలేషియా పోలీసులను సినిమాలో తప్పుగా చూపించినందుకు గాను ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'మిస్టర్ కెకె'. కోలీవుడ్ లో 'కదరం కొండన్' అనే పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. ఇటీవల విడుదలైన ఈ సినిమాకి తొలి షో నుండే నెగెటివ్ టాక్ రావడంతో విక్రమ్ అభిమానులు నిరాశ చెందారు.
ఇది ఇలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి మరో షాక్ తగిలింది. సినిమా ఎక్కువ భాగం షూటింగ్ మలేషియాలోనే జరిగింది. ఇప్పుడు మలేషియా ప్రభుత్వం సినిమాను నిషేధించింది.
మలేషియా పోలీసులను సినిమాలో తప్పుగా చూపించినందుకు గాను ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని చిత్ర మలేషియా డిస్ట్రిబ్యూటర్స్ లోటస్ ఫైవ్ స్టార్ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ సినిమాను నటుడు కమల్ హాసన్ నిర్మించాడు. కమల్ చిన్న కూతురు అక్షర హాసన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది.