17వ శతాబ్దపు జనరల్ లచిత్ బోర్ఫుకాన్ స్టోరీని (Lachit Borphukan Story) ‘బ్రహ్మపుత్ర: ది అహోం సన్ రైజెస్’ (Brahmaputra: The Ahom Son Rises) అనే నవల రూపంలో తీసుకొస్తున్నారు. 


వరల్డ్ వైడ్ గా మార్మొగిన బాహుబ‌లి, ఆర్ ఆర్ ఆర్ సినిమా క‌థ విజ‌యేంద్ర ప్ర‌సాదే. అలాగే బాలీవుడ్ లో ఒక గొప్ప చిత్రంగా సంచ‌ల‌న విజ‌యం సాధించిన భ‌జ‌రంగ్ భాయిజాన్ చిత్ర క‌థ కూడా విజేయంద్ర ప్ర‌సాద్ అందించిందే. .రాజ‌మౌళి సాధించే సక్సెస్ లో ప‌రోక్షంగా స‌హాయ ప‌డే శక్తి ఆయ‌న తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాదే. బాహుబ‌లి,ఆర్ ఆర్ ఆర్ సృష్టించిన ప్ర‌భంజ‌నంతో ఆయన దేశవ్యాప్తంగా సంచలనం అయ్యారు. ప్రస్తుతం రాజమౌళి తదుపరి మహేష్ బాబుతో తీయబోయే SSMB29 కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. కానీఈ ప్రాజెక్టుముందే ఆయన మరొక ప్రాజెక్ట్‌తో ముందుకొస్తున్నారు. ఆ విశేషాలు చూద్దాం.

17వ శతాబ్దపు జనరల్ లచిత్ బోర్ఫుకాన్ స్టోరీని (Lachit Borphukan Story) ‘బ్రహ్మపుత్ర: ది అహోం సన్ రైజెస్’ (Brahmaputra: The Ahom Son Rises) అనే నవల రూపంలో తీసుకొస్తున్నారు. ఇందు కోసం విజయేంద్ర ప్రసాద్.. గూఢచర్య కాల్పనిక రచయితగా మారిన నేవల్ ఆఫీసర్‌ కుల్‌ప్రీత్ యాదవ్‌తో కలిసి పనిచేస్తున్నారు. హార్పర్‌కాలిన్స్ పబ్లిషర్స్ ఇండియా.. మే 30న ఈ నవలను విడుదల చేస్తోంది.

ఈ నవల కథాంశం ఏమిటంటే...లచిత్ బోర్ఫుకాన్ ఒకప్పుడు అస్సాంలోని అహోం రాజ్యంలో జనరల్. 1671 సరైఘాట్ యుద్ధంలో తన నాయకత్వ పటిమతో గుర్తింపు పొందాడు. మొఘలులను చాలాసార్లు ఓడించిన లచిత్.. వారి నుంచి గౌహతిని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. ఈ కథ యాక్షన్, రొమాన్స్ కలగలిసి ఉంటుంది. లచిత్.. అహోం రాజ్యాన్ని పాలించిన స్వర్గదేవ్ జయధ్వజ సింఘా కుమార్తె యువరాణి పద్మినితో ప్రేమలో పడతాడు. వీరి రొమాన్స్ గురించి తెలుసుకున్న రాజు.. లచిత్‌ని రాజధాని జోర్హాట్ నుంచి బయటకు పంపిస్తాడు. కొన్ని రోజుల తర్వాత అహోం రాజధానిపై ఔరంగజేబు దళాలు దాడి చేస్తాయి. తద్వారా రాజ్యంలో కొంత భాగాన్ని మొఘల్‌లకు అప్పగిస్తాడు స్వర్గ దేవ్. కానీ క్రమంగా ప్రమాదంలో పడుతున్న రాజధాని నగరాన్ని యువరాజు చక్రధ్వజ్‌తో కలిసి రక్షించేందుకు పూనుకున్న లచిత్.. ఈ యుద్ధంతో అహోం రాజ్య భవిష్యత్తును ఏ విధంగా మారుస్తాడు? అనేది స్టోరీ.

ఈ ‘బ్రహ్మపుత్ర’ నవలకు విజయేంద్ర ప్రసాద్‌‌కు కుల్‌ప్రీత్ యాదవ్ రచనా సహకారం అందించారు. ఆయన నేవల్ ఆఫీసర్స్ అకాడమీ అధికారిగా రెండు దశాబ్దాలు పనిచేశాడు. అతని మొత్తం కెరీర్‌లో మూడు నౌకలను విజయవంతంగా నడిపించాడు. 2014లో ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి రిటైర్ అయినప్పటి నుంచి ‘గూఢచర్యం, సైనిక చరిత్ర, ట్రూ క్రైమ్’ వంటి జానర్స్‌లో పుస్తకాలు రచించాడు. అతని తాజా పుస్తకం ‘ది బ్యాటిల్ ఆఫ్ రెజాంగ్ లా’ (పెంగ్విన్ 2021).ఇక ఈ నవల సినిమాగా వచ్చే అవకాసం ఉంది.