Asianet News TeluguAsianet News Telugu

జిమ్ లో విజయశాంతి కష్టం వెనక అసలు సీక్రెట్

విజయశాంతి చివరగా 2006లో వచ్చిన పొలిటికల్ డ్రామా మూవీ 'నాయుడమ్మ'లో కనిపించారు. ఆ తర్వాత పూర్తిగా రాజకీయ జీవితానికే అంకితం చేసారు.  దాదాపు 13 సంవత్సరాల సుదీర్గ విరామం  తర్వాత మహేష్ బాబు హీరోగా రూపొందబోతున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం ద్వారా విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఈ గ్యాప్ లో ఆమె నటిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమీ తీసుకోలేదు. అలాగని ఒళ్లు పెరిగి లావు అయ్యిపోలేదు. 
 

Vijayashanti has joined a gym
Author
Hyderabad, First Published Jun 10, 2019, 7:36 AM IST

 

విజయశాంతి చివరగా 2006లో వచ్చిన పొలిటికల్ డ్రామా మూవీ 'నాయుడమ్మ'లో కనిపించారు. ఆ తర్వాత పూర్తిగా రాజకీయ జీవితానికే అంకితం చేసారు.  దాదాపు 13 సంవత్సరాల సుదీర్గ విరామం  తర్వాత మహేష్ బాబు హీరోగా రూపొందబోతున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం ద్వారా విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఈ గ్యాప్ లో ఆమె నటిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమీ తీసుకోలేదు. అలాగని ఒళ్లు పెరిగి లావు అయ్యిపోలేదు. 

బరువు తగ్గించుకునే ప్రయత్నాలు అవసరం లేదు. కానీ ఆమె తెరపై కనపడితే తన పాత అభిమానులు మాత్రం నిరాశపడకూడదని భావిస్తున్నారు. సినిమాలో ఆమెది గ్లామర్ రోల్ కాకపోయినా శారీరకంగా ఫిట్ గా ఉండాలని డైలీ జిమ్ కు వెళ్తూ ఎక్కువ సేపు అక్కడ గడపుతున్నారు. రీ ఎంట్రీని గ్రాండ్ గా ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఆమె కష్టపడుతున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా స్క్రిప్టు తెప్పించుకుని తన పాత్రపై అవగాహన పెంచుకుని  పాత్రకు తగినట్లుగా తనను తాను మార్చుకుంటున్నట్లు సమాచారం.

దాంతో  ఆమె డెడికేషన్ తెలుసుకున్న సీనియర్స్ ఆశ్చర్యపోవటం లేదు కానీ ఈ కాలం హీరోయిన్స్ మాత్రం షాక్ అవుతున్నారట. ఆ పట్టుదల, డెడికేషన్ ఉన్న నటి కాబట్టే 13 ఏళ్లు గ్యాప్ ఇచ్చినా మళ్లీ సూపర్ స్టార్ హీరో సినిమాలో కీ రోల్ కు ఆమెను బ్రతిమాలి ఒప్పించుకునే స్దాయికి వెళ్లింది. ఈ సినిమా కనుక క్లిక్ అయ్యితే వరస పెట్టి విజయ శాంతి సినిమాలు చేస్తుందని ఇండస్ట్రీ భావిస్తోంది. అలాగే రాజకీయాల్లోనూ ఆమె బిజీగా ఏమీ లేదు. మళ్లీ ఎలక్షన్స్ వచ్చే దాకా కూడా ఖాళీనే. అదీ దృష్టిలో పెట్టుకునే విజయశాంతి ఈ డెసిషన్ కు వచ్చింది. 

‘సరిలేరు నీకెవ్వరు’. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు.  ఈ సినిమాలో మహేశ్ సరసన రష్మిక మందన్నా నటిస్తోంది. ‘మహర్షి’ లానే ఈ సినిమాను కూడా ముగ్గురు నిర్మాతలు (దిల్ రాజు - మహేశ్ - అనిల్ సుంకర) నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. 2020 సంక్రాంతి కానుకగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేశ్ ఆర్మీ మేజర్ గా కనిపించబోతున్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios