షాకిస్తోన్న విజయ్ రెమ్యునరేషన్,ప్లాఫ్ ల్లో ఉంటేనే ఇంతంటే...
విజయ్ దేవరకొండ తాజా చిత్రానికి అతనికి అందిస్తున్న రెమ్యునరేషన్ అందుకు సాక్ష్యం. విజయ్ దేవరకొండ,గౌతమ్ కాంబోలో రూపొందే చిత్రానికి అతనికి ...
పూరి జగన్నాథ్ తో చేసిన లైగర్ చిత్రం అతి పెద్ద డిజాస్టర్ అవ్వగానే...విజయ్ దేవరకొండ పని అయ్యిపోయిందని అంతటా కామెంట్స్ వినిపించాయి. డైరక్టర్ పూరి జగన్నాథ్ తో మొదలెట్టిన ‘JGM’ జనగణమన, సుకుమార్ తో చెయ్యాల్సిన సినిమా వెంటనే ఆగిపోయాయి.అయితే అతని నిర్మాతలు ఎవరు ఆ కామెంట్స్ పట్టించుకున్నట్లు కనపడటం లేదు. అతనితో సినిమా చెయ్యాలనే క్రేజ్ మాత్రం తగ్గలేదు. విజయ్ దేవరకొండ తాజా చిత్రానికి అతనికి అందిస్తున్న రెమ్యునరేషన్ అందుకు సాక్ష్యం. విజయ్ దేవరకొండ,గౌతమ్ కాంబోలో రూపొందే చిత్రానికి అతనికి 45 కోట్లు దాకా రెమ్యునరేషన్ అందుకున్నారని వినికిడి. విజయ్ కు పెరిగిన ఓటిటి రైట్స్, హిందీ రైట్స్ తో ఈ పెరిగిన రెమ్యునరేషన్ ని లెక్కేసి ఇస్తున్నట్లు తెలుస్తోంది.
విజయ్ దేవరకొండ తన తాజా చిత్రం ఖుషి సెట్స్పై ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేయబోతున్నాడు. సంక్రాంతి పండగ సందర్బంగా ఈ సినిమాను అఫీషియల్గా అనౌన్స్చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్ఛ్యూన్ ఫోర్ పతాకాలపై నాగవంశీ , సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమా అనౌన్స్మెంట్తో పాటు కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇందులో పోలీస్ దుస్తుల్లో ఓ వ్యక్తి కనిపిస్తున్నాడు. అతడు ఎవరన్నది తెలియకుండా ముఖానికి ముసుగు ధరించి ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
నేను ఎక్కడివాడినో, ఎవరిని మోసం చేశాను తెలియదు అంటూ పోస్టర్పై ఉన్న అక్షరాలు ఆసక్తిని రేకెత్తిస్తోన్నాయి. అజ్ఞాత గూఢచారి అంటూ క్యాప్షన్ చివరలో ఉన్న అక్షరాలు చూస్తుంటే విజయ్ దేవరకొండ ఈ సినిమాలో స్పైగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. సముద్ర తీర ప్రాంతం, మంటల్లో కాలిపోతున్న పడవలు పోస్టర్లో కనిపిస్తున్నాయి. స్పై థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకాబోతున్నట్లు తెలిసింది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న 12వ సినిమా ఇది. ఇందులో అతడి క్యారెక్టర్ కొత్త కోణంలో సాగుతుందని సమాచారం.
గతంలో గౌతమ్ తిన్ననూరి, సితార ఎంటర్టైన్మెంట్స్ ‘జెర్సీ’ చిత్రం కోసం జతకట్టారు. నాని, శ్రద్ధా శ్రీనాథ్ నటించిన ఈ నేషనల్ అవార్డు విన్నింగ్ స్పోర్ట్స్ డ్రామా విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబట్టి ఘన విజయం సాధించింది. తెలుగు, హిందీ పరిశ్రమలలో ప్రతిభగల దర్శకుడిగా గౌతమ్ తిన్ననూరి నిరూపించుకున్నారు. 2019లో ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు గెలుచుకుంది. ఎంతో ప్రతిభగల గౌతమ్ ఇప్పుడు విజయ్ దేవరకొండతో చేతులు కలిపారు. ప్రస్తుతం..విజయ్... శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. కశ్మీర్ బ్యాక్డ్రాప్లో ప్యూర్ లవ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటిస్తోంది.