'గీత గోవిందం' సినిమాలో కలిసి నటించిన విజయ్ దేవరకొండ, రష్మికల జంటకి మంచి క్రేజ్ వచ్చింది.

'గీత గోవిందం' సినిమాలో కలిసి నటించిన విజయ్ దేవరకొండ, రష్మికల జంటకి మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి 'డియర్ కామ్రేడ్' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళలో జరుగుతోంది. అయితే అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర విజయ్ దేవరకొండ.. రష్మికకు ఓ ఫోటో తీశాడు. ఆ ఫోటోని రష్మిక తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫోటో క్రెడిట్స్ విజయ్ కి ఇచ్చింది.

ఇప్పటివరకు ఈ ఫోటోకి మూడున్నర లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. అయితే ఇదే లొకేషన్ లో గతంలో విజయ్ దేవరకొండ ఓ ఫోటో షేర్ చేసి ఆ ఫోటో రష్మిక తీసినట్లు తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తాజాగా రష్మిక కూడా అదే లొకేషన్ లో విజయ్ తో ఫోటో తీయించుకుంది. క్యాజువల్ టీ షర్ట్, ప్యాంట్ వేసుకొని ప్రకృతిని ఆశ్వాదిస్తూ.. కనిపిస్తోంది. 

View post on Instagram

Scroll to load tweet…