#Venkatesh: దేవుడు పాత్రలో వెంకటేష్, గెస్ట్ రోల్
విశ్వక్ ఇటీవలే ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమాతో మంచి విజయాన్ని సాధించి ఫుల్ జోష్లో ఉన్నాడు. ప్రస్తుతం ఈయన మూడు సినిమాలను సెట్స్పై ఉంచాడు. అందులో ఒకటి ‘ఓరి దేవుడా’. తమిళంలో సూపర్ హిట్టయిన ‘ఓమై కడువలే’ చిత్రానికి రీమేక్గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఒరిజనల్ వెర్షన్ను తెరకెక్కించిన అశ్వత్ మరిముత్తు రీమేక్ చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది.
విక్టరీ వెంకటేష్ ఆచి తూచి సినిమాలు చేస్తూంటారు. ఆయన ఎంచుకునే కథలు చాలా విభిన్నంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. అదే విధంగా ఇప్పుడు ఆయన ఓ సినిమాలో గెస్ట్ పాత్రలో కనిపించటానికి రెడీ అవుతున్నారు. ఆ పాత్ర కూడా సినిమాకు కీలకమైనది. అందుతున్న సమాచారం మేరకు వెంకటేష్ దేవుడు పాత్రలో కనిపించనున్నారు. వివరాల్లోకి వెళితే...
కోలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘ఓ మై కడవులే’కి రీమేక్గా రూపొందుతోన్న సినిమా ‘ఓరి దేవుడా..!’. ‘మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్’ అనే ట్యాగ్ లైన్. ‘పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయించబడతాయి’ అనేది పెద్దల మాట. అంటే మన భాగస్వామి ఎవరో ముందే రాసిపెట్టుంటుందన్న మాట. ఈ కాన్సెప్ట్తోనే త్వరలో సందడి చేయనున్నాడు విశ్వక్ సేన్. విశ్వక్ హీరోగా పెళ్లి నేపథ్యంలో దర్శకుడు అశ్వత్ మరిముత్తు ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు.
పెళ్లి కష్టాలు భరించలేకే ఏమో హీరో పారిపోవాలనే ప్రయత్నం చేస్తుంటే.. ఎక్కడికీ వెళ్లకుండా హీరోయిన్ కట్టిపారేసే రొమాంటిక్ కామెడీ ఇది. ఈ చిత్రంలో దేవుడు పాత్ర కీలకం. తమిళ్లో ఆ పాత్రను విజయ్ సేతుపతి చేశాడు. తెలుగులో ఆ క్యారెక్టర్లో వెంకటేశ్ కనిపించబోతున్నాడని సమాచారం. మూడు రోజులు పాటు వెంకీ ఈ సినిమాకు డేట్స్ కేటాయించారు.
ఇక విశ్వక్ సరసన మిథిలా పాల్కర్ నటిస్తోంది. ‘మురంబ’ అనే మరాఠీ చిత్రం, పలు వెబ్ సిరీస్లతో నటిగా మంచి పేరు తెచ్చుకున్న పాల్కర్కు ఇదే తొలి తెలుగు సినిమా. ఈ చిత్రాన్ని పీవీపీ సినిమా, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: తరుణ్ భాస్కర్, కూర్పు: గ్యారీ బీహెచ్.