Asianet News TeluguAsianet News Telugu

#Saindhav:'సైంధవ్' OTTలోకి ఇంత త్వరగానా?

 ఇదే సైంధవ్ ఓటీటీ రిలీజ్ డేట్ అని  మీడియాలో టాక్ నడుస్తోంది. అయితే, దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. 

Venkatesh #Saindhav is arriving early on OTT? JSP
Author
First Published Jan 29, 2024, 12:24 PM IST


భారీ ఆశలు, అంచనాల మధ్య సంక్రాంతికి రిలీజైన వెంకటేశ్ మూవీ సైంధవ్ బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది. బాక్సాఫీస్ దగ్గర  డిజాస్టర్ గా నిలిచిన   ఈ సినిమా ఓటీటీ హక్కులను భారీ మొత్తానికి అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది.  సైంధవ్ మూవీ ఓటీటీ హక్కులను  సుమారు రూ. 15 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం.

సైంధవ్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఫిక్స్ అయినట్లు టాక్ వస్తోంది. వచ్చే పిబ్రవరి నెల 2, 2024 న ప్రీమియర్ అయ్యే అవకాసం ఉందని తెలుస్తోంది. అది కాకపోతే మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 9న అమెజాన్ ప్రైమ్‌లో సైంధవ్ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నారట. ఇదే సైంధవ్ ఓటీటీ రిలీజ్ డేట్ అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. అయితే, దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. ప్రొడక్షన్ టీమ్ లేదా OTT ప్లాట్‌ఫారమ్ నుండి అఫీషియల్ ప్రకటన వస్తే క్లారిటీ వస్తుంది.
 
 సంక్రాంతి సినిమాల పోటితో  ఓపెనింగ్స్ పరంగా ఇతర సినిమాల ఇంపాక్ట్ వలన బాగా తగిలింది ఈ సినిమాకు .  దాంతో అనుకున్న రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోలేక పోయింది  ఈ చిత్రం టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ - రూ. 25 కోట్లు అంటే ఈ సినిమా కు బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే... సుమారు రూ. 26 లేదా 27 కోట్లు కలెక్ట్ చేయాలి. కానీ 8 కోట్ల దగ్గర ఆగిపోయిందని సమాచారం.

వెంకటేష్ చేసిన నారప్ప, దృశ్యం 2 సినిమాలు యాక్షన్ చిత్రాలు కాగా.. ఎఫ్‌ 3, ఓరి దేవుడా ఫన్ ఓరియెంటెడ్ చిత్రాలు. అన్ని సినిమాలు వెంకీమామకు హిట్టుగానే నిలిచాయి. వెంకీ మామ క్లాస్ మాస్ ఆడియెన్స్‌ను మెప్పిస్తూ హిట్ల మీద హిట్లు కొట్టేస్తున్నాడు. అలాంటి వెంకటేష్ శైలేష్ కొలనుతో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. హిట్ ఫ్రాంచైజీలతో అందరినీ మెప్పిస్తున్న శైలేష్‌ కొలను ఇప్పుడు వెంకీమామతో సైంధవ్ అంటూ వచ్చాడు.  

'సైంధవ్' సినిమాలో వెంకటేష్ సరసన 'జెర్సీ' ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ నటించారు. వెంకీ భార్యగా, ఓ పాపకు తల్లిగా మనోజ్ఞ క్యారెక్టర్ చేశారామె. అభినయానికి ఆస్కారమున్న పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ నటించినట్లు దర్శక - నిర్మాతలు తెలిపారు. మూడేళ్ల విరామం తర్వాత శ్రద్ధా శ్రీనాథ్ నటించిన తెలుగు చిత్రమిది. ఆమె కాకుండా సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. సుశాంత్ 'చిలసౌ', విశ్వక్ సేన్ 'హిట్' సినిమాల ఫేమ్ రుహానీ శర్మ డాక్టర్ రోల్ చేశారు. ఆమె పాటు ఆండ్రియా జెరెమియా మరో కీలక పాత్రలో కనిపించనున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios