- Home
- Entertainment
- Madhampatty Rangaraj: డీఎన్ఏ టెస్ట్తో బయటపడ్డ నిజం, ఆమె బిడ్డ ఆ సెలెబ్రిటీ కొడుకే.. ఫలించిన తల్లి పోరాటం
Madhampatty Rangaraj: డీఎన్ఏ టెస్ట్తో బయటపడ్డ నిజం, ఆమె బిడ్డ ఆ సెలెబ్రిటీ కొడుకే.. ఫలించిన తల్లి పోరాటం
సెలబ్రిటీ చెఫ్ మాధంపట్టి రంగరాజ్, కాస్ట్యూమ్ డిజైనర్ జాయ్ క్రిసిల్డా కొడుకును తన కొడుకుగా అధికారికంగా అంగీకరించారు. డీఎన్ఏ టెస్ట్ తర్వాత ఈ వివాదానికి తెరపడింది. దీని పూర్తి వివరాలు చూద్దాం.
15

Image Credit : Instagram
Madhampatty Rangaraj
ప్రముఖ చెఫ్ మాధంపట్టి రంగరాజ్, కాస్ట్యూమ్ డిజైనర్ జాయ్ క్రిసిల్డా మధ్య కొన్ని నెలలుగా నడుస్తున్న వివాదం కొత్త మలుపు తిరిగింది. డీఎన్ఏ టెస్ట్ తర్వాత జాయ్ కొడుకును తన కొడుకేనని రంగరాజ్ అధికారికంగా అంగీకరించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించారు. గతంలో, రంగరాజ్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి, గర్భవతిని చేసి వదిలేశాడని జాయ్ పోలీసులకు, మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు.
గూగుల్లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
25
Image Credit : X
తండ్రి ఎవరో తేల్చడానికి డీఎన్ఏ టెస్ట్
గర్భవతిగా ఉన్నప్పుడు, పుట్టబోయే బిడ్డకు న్యాయం చేయాలని జాయ్ పోరాడారు. బాబు పుట్టాక, అతనికి 'రాగా రంగరాజ్' అని పేరు పెట్టారు. బిడ్డకు తండ్రి ఎవరో తేల్చడానికి డీఎన్ఏ టెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. దీనికి స్పందించిన రంగరాజ్, టెస్టులో బిడ్డ తనవాడే అని తేలితే, పూర్తి బాధ్యత తీసుకుంటానని అప్పట్లో ఓ ప్రకటనలో తెలిపారు.
35
Image Credit : Instagram
తండ్రి మాధంపట్టి రంగరాజే అని టెస్టులో నిర్ధారణ
అనుకున్నట్టే డీఎన్ఏ టెస్ట్ నిర్వహించారు. ఆ బిడ్డకు తండ్రి మాధంపట్టి రంగరాజే అని ఈ టెస్టులో నిర్ధారణ అయింది. ఆ తర్వాత, రంగరాజ్ తన కొడుకును చేతుల్లోకి తీసుకుని ఆడిస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. గత ఆరు నెలలుగా ఓ తండ్రిగా అన్ని బాధ్యతలూ ప్రేమతో, అంకితభావంతో నిర్వర్తిస్తున్నానని ఆయన పోస్టులో రాశారు. తన జీవితాంతం కొడుకు రాగా సంక్షేమం, సంతోషం, భవిష్యత్తు కోసం అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
45
Image Credit : x/Joy Crizildaa
ఒక తల్లిగా నా మనసు ప్రశాంతంగా ఉంది
మరోవైపు, జాయ్ క్రిసిల్డా కూడా అదే ఫోటోను షేర్ చేశారు. 'నిజం ఒకరోజు బయటకు వస్తుంది. కొన్ని పోరాటాలు గెలుపు కోసం కాదు, ఒక బిడ్డ భవిష్యత్తు కోసం. ఈ రోజు ఒక తల్లిగా నా మనసు ప్రశాంతంగా ఉంది' అని ఆమె ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. జాయ్ సుదీర్ఘ పోరాటానికి న్యాయం జరిగిందని కొందరు ప్రశంసిస్తున్నారు.
55
Image Credit : JioHotstar/Screenshot
'కుక్ విత్ కోమలి' షోలో జడ్జిగా
అదే సమయంలో, ఈ నిర్ణయాన్ని మాధంపట్టి రంగరాజ్ ముందే తీసుకుని ఉండాల్సిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు రంగరాజ్ తన కొడుకును అధికారికంగా అంగీకరించడంతో, వీరిద్దరి మధ్య వివాదం ముగిసిపోతుందా అనే ప్రశ్న సోషల్ మీడియాలో తలెత్తుతోంది. దీనిపై ఇద్దరూ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. మాధంపట్టి రంగరాజ్ ప్రస్తుతం 'కుక్ విత్ కోమాలి' షోలో జడ్జిగా ఉన్నారన్న విషయం తెలిసిందే.
Latest Videos

