Asianet News TeluguAsianet News Telugu

ఫస్ట్ టైమ్ తన కొడుకు అర్జున్ గురించి స్పందించిన వెంకీ.. హీరోగా ఎంట్రీ ఎప్పుడంటే ?

విక్టరీ వెంకటేష్ మైల్ స్టోన్ మూవీగా తెరకెక్కుతున్న 75వ చిత్రం సైంధవ్‌. హిట్ 2 ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతోంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రుహాని శర్మ, శ్రద్దా శ్రీనాథ్, ఆండ్రియా జెర్మియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

Venkatesh first time react on his son tollywood entry dtr
Author
First Published Jan 3, 2024, 12:47 PM IST

విక్టరీ వెంకటేష్ మైల్ స్టోన్ మూవీగా తెరకెక్కుతున్న 75వ చిత్రం సైంధవ్‌. హిట్ 2 ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతోంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రుహాని శర్మ, శ్రద్దా శ్రీనాథ్, ఆండ్రియా జెర్మియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

జనవరి 13న సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి. ముందు నుంచి ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. విక్టరీ వెంకటేష్ మునుపెన్నడూ నటించని జోనర్ చిత్రం ఇది. దీనితో సైంధవ్ చిత్రం ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి నెలకొంది. తాజాగా విడుదలైన ట్రైలర్ అంచనాలు పెంచేసింది. 

యాక్షన్ ఎమోషన్ మిక్స్ చేసి వెంకటేష్ దుమ్ము దులిపేస్తున్నాడు. ముద్దుల కూతురికి అంతుచిక్కని ఆరోగ్య సమస్య వస్తే తండ్రి ఎంత ఆవేదన చెందుతాడు ? దాని వెనుక కుట్ర ఉంటే ఎంత వయలెంట్ గా రియాక్ట్ అవుతాడో ట్రైలర్ లో శాంపిల్ చూపించారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సందర్భం రావడంతో మీడియా ప్రతినిధులు వెంకటేష్ ని తన కుమారుడు అర్జున్ దగ్గుబాటి టాలీవుడ్ ఎంట్రీ గురించి ప్రశ్నించారు. 

దీనికి వెంకీ ఇచ్చిన సమాధానం చాలా ఫన్నీగా ఉంది. వాడెక్కడో చదువుకుంటున్నాడమ్మా అని అన్నారు. ఫ్యాన్స్ బలవంతం చేస్తున్నారు అని మీడియా ప్రతినిధి అంటే.. నేను వాళ్ళకి చెబుతాను అని వెంకీ అన్నారు. ముందు అందరూ బాగా చదువుకోవాలి. తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అని వెంకీ అన్నారు. 

అర్జున్ టాలీవుడ్ ఎంట్రీ గురించి వెంకటేష్ ఎలాంటి హింట్ ఇవ్వలేదు. చదువు పూర్తయ్యాకే అన్నట్లుగా సమాధానం ఇచ్చారు. గతంలో గోపాల గోపాల చిత్ర ఆడియో లాంచ్ లో వెంకటేష్ మాట్లాడిన మాటలు కూడా వైరల్ అవుతున్నాయి. మా అబ్బాయి ఎంట్రీ ఇచ్చే వరకు తాను నటిస్తానని వెంకటేష్ చెప్పిన సంగతి తెలిసిందే. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios