Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ మల్టీ ఫ్లెక్స్ 'V-EPIQ' లాంచింగ్ కు గెస్ట్ ఎవరంటే...?

ప్రభాస్ తన స్నేహితులైన యువి క్రియేషన్స్ వారితో కలిసి ఓ థియోటర్ ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 30 న సాహో సినిమాతో ఈ థియోటర్ లాంచ్ కానుంది. 

Venkaiah Naidu is the Chief guest for V EPIQ launch
Author
Hyderabad, First Published Aug 25, 2019, 5:06 PM IST

ప్రభాస్ తన స్నేహితులైన యువి క్రియేషన్స్ వారితో కలిసి ఓ థియోటర్ ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 30 న సాహో సినిమాతో ఈ థియోటర్ లాంచ్ కానుంది. నెల్లూరు జిల్లాలోని సూళ్లూరు పేట లో వి ఎపిక్ పేరట ఈ  మల్టిఫ్లెక్స్ నిర్మాణమైంది. ఈ మల్టిప్లెక్స్  కు షాపింగ్ మాల్ కూడా ఎటాచ్ అయ్యి ఉంటుంది.  

ఇక ఈ థియోటర్ స్పెషాలిటీ ఏమిటి అంటే ..సౌత్ ఏషియాలోనే ఇంత పెద్ద స్క్రీన్ ఉన్న థియోటర్ లేదు. అలాగే లేటెస్ట్ డాల్బీ ఆట్మస్ సౌండ్ ఎక్విప్మెంట్ తో ఉంది. దాంతో ఈ థియోటర్ పైనే అందరి దృష్టీ ఉంది. మరీ ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ ...సాహోని ఈ థియోటర్ లో ఫస్ట్ వీక్ లో చూడాలని ఉత్సాహపడుతున్నారు. 

ఈ నేపధ్యంలో ఈ థియోటర్ ఓపినింగ్ కు ఎవరు వస్తారు..ప్రభాస్ స్వంత థియోటర్ కాబట్టి ఆయన వస్తాడా అంటే ఆ టైమ్ కు ఆయన లండన్ ఉండబోతున్నారు. దాంతో మొదట అనుకున్న పోగ్రామ్ కాన్సిలైంది. ఈ నేపధ్యంలో ప్రభాస్ పెద నాన్న , నటుడు కృష్ణరాజు, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి ఈ థియోటర్ లాంచింగ్ కు రానున్నట్లు సమాచారం.  

 

Follow Us:
Download App:
  • android
  • ios