ఉపరాష్ట్రపతిని మెప్పించిన మహేష్.. వెంకయ్య నాయుడు స్వయంగా!
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి విజయపథంలో దూసుకుపోతోంది. మహర్షి చిత్రం మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా రికార్డులు నెలకొల్పుతోంది. దర్శకుడు వంశీ పైడిపల్లి రైతు ప్రాముఖ్యతని గుర్తు చేసేలా తెరకెక్కించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి విజయపథంలో దూసుకుపోతోంది. మహర్షి చిత్రం మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా రికార్డులు నెలకొల్పుతోంది. దర్శకుడు వంశీ పైడిపల్లి రైతు ప్రాముఖ్యతని గుర్తు చేసేలా తెరకెక్కించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. దిల్ రాజు, పీవీపీ, అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా.. అల్లరి నరేష్ మహేష్ స్నేహితుడిగా కీలకమైన పాత్ర పోషించారు.
మహర్షి చిత్రం కమర్షియల్ గానే కాదు.. సందేశాత్మకంగా కూడా మంచి చిత్రంగా నిలిచింది. ఈ చిత్ర కథకు స్వయానా భారత దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఫిదా అయ్యారు. కుటుంబ సభ్యులతో కలసి ఆయన మహర్షి చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ట్విట్టర్ వేదికగా మహర్షి చిత్రం పట్ల తన స్పందన తెలియజేశారు.
'కుటుంబ సభ్యులతో కలసి మహర్షి చిత్రాన్ని చూశాను. గ్రామీణ నేపథ్యంలో వ్యవసాయ పరిరక్షణ, అన్నదాతకు అండగా నిలబడాల్సిన ఆవశ్యకతని తెలియజేసేలా చిత్రాన్ని రూపిందించారు. ఇది ప్రతి ఒక్కరూ చూడదగిన మంచి చిత్రం. మహేష్ బాబు సహజసిద్ధమైన నటన కనబరిచాడు. దర్శకుడు వంశీ పైడిపల్లి చిత్రాన్ని చక్కగా చిత్రీకరించారు. నిర్మాతలతో పాటు చిత్ర యూనిట్ మొత్తానికి నా శుభాకాంక్షలు' అని వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు.
వెంకయ్య నాయుడు ట్వీట్ కు మహేష్ ప్రతిస్పదించాడు. సర్ ఈ చిత్రాన్ని మీరు చూడడం, అది మీకు నచ్చడం మా మహర్షి చిత్రయూనిట్ మొత్తానికి దక్కిన గౌరవం. మీ మాటలు ఇలాంటి మరిన్ని చిత్రాలని చేసేందుకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి. మహర్షి చిత్ర యూనిట్ తరుపున మీకు కృతజ్ఞతలు అని మహేష్ తెలిపాడు.
Sir.. This is such an honour for me personally & our whole team... it can't get better than this. Thank you Sir, your words have inspired us to keep doing more films like "Maharshi".. on behalf of Team Maharshi... humbled, Sir. 🙏🙏🙏 https://t.co/ML50Cf6QgJ
— Mahesh Babu (@urstrulyMahesh) May 14, 2019