‘వీరసింహారెడ్డి’ సెన్సార్ పూర్తి.. యూఎస్ఏలో బాలయ్యకు క్రేజీ రెస్పాన్స్.. ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్!
నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ ఫిల్మ్ ‘వీర సింహారెడ్డి’. రేపు యూఎస్ఏలో ప్రీమియర్స్ కు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. అలాగే అదిరిపోయే ప్రీ-సేల్స్ తో బాలయ్య జోరు కనిపిస్తోంది.
నందమూరి నటసింహాం బాలకృష్ణ (Balakrishna) తాజాగా నటించిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy). గోపీచంద్ మాలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రచారం కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ చిత్రం రేపు యూఎస్ఏలో ప్రీమియర్ పడబోతుంది. ఈ సందర్భంగా ప్రీ -సేల్స్ బిజినెస్ ఆసక్తికరంగా మారింది.
యూఎస్ఏ మార్కెట్ లో వీరసింహారెడ్డి చిత్రానికి మాసీవ్ రెస్పాన్స్ దక్కుతోంది. కేవలం ప్రీమియర్స్ తోనే దూసుకుపోతోంది. తాజాగా ఈ చిత్రం ఏకంగా నాలుగు లక్షల డాలర్స్ మార్కను దాటేసింది. దీంతో తొలిరోజు భారీ నంబర్స్ ను నమోదు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రీసెంట్ గా ఒంగోలులో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. యాక్షన్ సీన్స్, డైలాగ్స్, బాలయ్య డాన్స్, సౌండ్ అదిరిపోవడంతో ఫ్యాన్స్ కు పూనకాలే అంటున్నారు.
రెండు రోజుల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. యూ/ఏ సర్టిఫికెట్ పొందటం విశేషం. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన పాటలు, టీజర్, గ్లింప్స్ కు భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ట్రైలర్ కూడా దూసుకుపోతోంది. బాలయ్య సరసన తొలిసారిగా గ్లామర్ బ్యూటీ శ్రుతి హాసన్ (Shruti Haasan) నటిస్తోంది. శ్రీలీల, దునియా విజయ్, వరలక్ష్మి శరత్కుమార్ కీలక పాత్రల్లో అలరించనున్నారు. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందించారు.