క్రేజీ కాంబో: వరుణ్ తేజ్ కు విలన్ గా సునీల్
కెరీర్ లో ఆచితూచి అడుగులేస్తున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్. రీసెంట్ గా ఎఫ్ 2 చిత్రంతో ఆడియన్స్కి మంచి ఎంటర్ట్మెంట్ ని అందించిన వరుణ్ ప్రస్తుతం హరీష్ శంకర్ తో వాల్మికి చిత్రం చేస్తున్నారు.
కెరీర్ లో ఆచితూచి అడుగులేస్తున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్. రీసెంట్ గా ఎఫ్ 2 చిత్రంతో ఆడియన్స్కి మంచి ఎంటర్ట్మెంట్ ని అందించిన వరుణ్ ప్రస్తుతం హరీష్ శంకర్ తో వాల్మికి చిత్రం చేస్తున్నారు. ఆ సినిమాతో పాటు మరో సినిమా కూడా ఓకే చేసారు. కిరణ్ కొర్రపాటి అనే నూతన దర్శకుడు డైరెక్షన్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ మాజీ హీరో సునీల్ శెట్టిని ఎంపిక చేసినట్లు సమాచారం.
అందుతున్న సమాచారం మేరకు అల్లు అరవింద్ పెద్ద కుమారుడు..అల్లు బాబీ ఈ సినిమాని నిర్మించనున్నారు. చిత్ర దర్శకుడు కిరణ్ కొర్రపాటి.. మిస్టర్, తొలిప్రేమ’ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు.
ఇక ఈ సినిమా కోసం వరుణ్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. ఈ చిత్రం థ్రిల్లర్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనుండగా, ప్రొఫెషనల్ బాక్సర్గా కనిపించేందుకు ఒలింపిక్ విన్నర్ టోని జెఫ్రీస్ పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్నాడు.
హరీష్ శంకర్ తో చేయబోతున్న వాల్మీకి చిత్రం విషయానికి వస్తే... గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళంలో హిట్ అయిన జిగర్తాండ్రా మూవీకి రీమేక్గా ఈ చిత్రం రూపొందనుంది.
వరుణ్ తేజ్ సరసన పలువురి అమ్మాయిలని పరిశీలిస్తుండగా మృణాలినీ రవి, ఈషా రెబ్బా పేర్లు ఫ్రేమ్లోకి వచ్చాయి. ఇక తమిళ సినిమాలో బాబీ సింహా చేసిన పాత్రలో వరుణ్ తేజ్ కనిపిస్తారట. అలాగే తమిళంలో సిద్ధార్థ్ చేసిన పాత్ర కోసం శ్రీవిష్ణు, నాగశౌర్యలని పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది.