రీసెంట్ గా పెళ్లైన నటి భర్తకు గుండెపోటు
నటి వనితా విజయ్కుమార్ ఈ మధ్య పీటర్ పాల్ అనే వ్యక్తిని మూడో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ ఆనందం అనుభవించకుండానే... భర్తకు గుండెపోటు రావడంతో ఆయన చెన్నైలోని ఒక ప్రైవేటు హాస్పిటల్లో చేరారు.
సంచలన నటిగా ముద్ర వేసుకున్న నటి వనితా విజయ్కుమార్ ఈ మధ్య పీటర్ పాల్ అనే వ్యక్తిని మూడో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ ఆనందం అనుభవించకుండానే... భర్తకు గుండెపోటు రావడంతో ఆయన చెన్నైలోని ఒక ప్రైవేటు హాస్పిటల్లో చేరారు.
ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించిన వనితా ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. 'చెప్పాల్సింది చాలా ఉంది కానీ ఇప్పుడు ఏమీ చెప్పలేను. దేవుడు చాలా గొప్పవాడు. జీవితం చాలా కష్టమైంది. మన లైఫ్లో జరిగే ప్రతీది ఏదో ఒక కారణంతోనే జరుగుతుందని నేను నమ్ముతాను. పరిస్థితులు అన్ని సర్దుకుంటాయి' అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
వివాహ వివాద వివరాల్లోకి వెళితే...నటి వనితావిజయకుమార్ ఇటీవలే పీటర్పాల్ అనే వ్యక్తిని మూడవ వివాహం చేసుకున్న విషయం తెలిసింది. వీరి వివాహం అంతటా పెద్ద చర్చకే దారి తీసింది. అంతేకాకుండా చాలా మంది బహిరంగ విమర్శలు సైతం చేసారు. అయితే తనకు విడాకులు ఇవ్వకుండానే వనితా తన భర్తను వివాహం ఎలా చేసుకుంటుందంటూ పీటర్ మొదటి భార్య ఎలిజబెత్ ఆరోపణలు చేసింది. డబ్బు కోసమే ఇవన్నీ చేస్తుందంటూ ఆమె వనితపై కేసు కూడా ఫిర్యాదు చేసింది. దీంతో వనితా విజయ్కుమార్ మరోసారి వార్తల్లో నిలిచింది.
నటి కస్తూరి, దర్శకురాలు లక్ష్మీ రామకృష్ణన్, నిర్మాత రవీంద్రన్ వంటివారు నటి వనితా విజయకుమార్ మూడవ పెళ్లి చేసుకోవడంపై విమర్శలు చేశారు. వీరి మధ్య గొడవ పోలీసులు, కేసుల వరకు వెళ్లింది. అంతేకాకుండా నటి వనితా విజయకుమార్, దర్శకురాలు లక్ష్మీరామకృష్ణన్ ఒకరిపై ఒకరు పరువు నష్టం దావా అంటూ నోటీసుల వరకు వెళ్లారు.
ఇక 1995లో విడుదలైన చంద్రలేఖ చిత్రంతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన వనితా విజయ్కుమార్ పలు చిత్రాల్లో నటించింది. అయితే నటిగా కంటే వివాదాలతోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది.