`కొండపొలం`(kondpolam) సినిమా ఎప్పుడో పూర్తైంది. అయితే సీజీ,విఎఫ్ ఎక్స్ వర్క్ చాలా కాలం పట్టింది. అలాగే కరనో ఎఫెక్ట్ తో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. ఆ మధ్యన ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే వాయిదా పడే అవకాసం ఉందంటూ ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని అక్టోబరు 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు తెలిపారు.
వైష్ణవ్ తేజ్(vaishnav tej) ఫస్ట్ మూవీ, బ్లాక్ బస్టర్ హిట్ ‘ఉప్పెన’ పాండెమిక్ టైం లోనే 100 కోట్ల కలెక్షన్స్ సాదించించి. ఒకే డెబ్యూ హీరోకి ఇది కొత్త రికార్డ్ గా నిలిచింది. వైష్ణవ్ తేజ్ కెరీర్లో మరిచిపోలేని చిత్రంగా మిగిలింది. ఈ సినిమా విడుదల అవకముందే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘కొండపొలం’(kondpolam) అనే ఒక సినిమా పూర్తి చేసాడు వైష్ణవ తేజ్. షూటింగ్ పూర్తై చాలా కాలం అయినా గ్రాఫిక్స్ వర్క్ తోనూ, రకరకాల కారణాలతోనూ విడుదల కాలేదు. ఇప్పుడీ సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఇప్పుడది కన్ఫర్మ్ చేసారు. ఆ తేదీనే అక్టోబర్ 8.
వివరాల్లోకి వెళితే... తొలి సినిమా ‘ఉప్పెన’ మొదలు కాకముందే.. దర్శకుడు క్రిష్తో కలిసి ఓ విభిన్నమైన సినిమా సైన్ చేశాడు వైష్ణవ్. అడివి నేపధ్యంలో సాగే ‘కొండపాలెం’ నవల ఆధారంగా.. ఈ సినిమా రూపొందించింది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా ఎప్పుడో పూర్తైంది. అయితే సీజీ,విఎఫ్ ఎక్స్ వర్క్ చాలా కాలం పట్టింది. అలాగే కరనో ఎఫెక్ట్ తో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. ఆ మధ్యన ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే వాయిదా పడే అవకాసం ఉందంటూ ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని అక్టోబరు 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు తెలిపారు.
ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక డైరెక్టర్ క్రిష్ నల్లమల అటవీ ప్రాంతంలో 45 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసారు. అలాగే ఈ సినిమాకు కొండపాలెం టైటిల్ ని ఫిక్స్ చేసారు. తొలుత ఈ చిత్రాన్ని ఓటీటిలోనే విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. ఫైనల్ గా థియేటర్లలో రిలీజ్ చేసేందుకే మేకర్స్ మొగ్గు చూపారు.
పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు తెరకెక్కిస్తూనే.. షూటింగ్ గ్యాప్ లో ఈ సినిమాను పూర్తి చేశాడు క్రిష్. చాలా తక్కువ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కింది. రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో హీరోయిన్. పూర్తిగా డీ గ్లామర్ పాత్రలో ఈమె నటిస్తోంది. ప్రస్తుతం వైష్ణవ్ మరో సినిమా కమిటయ్యి చేస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమాను తమిళంలో రీమేక చేసిన గిరీశయ్య దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో కేతికా శర్మ, శోభితా రానాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
